ETV Bharat / sports

ఐపీఎల్​ నుంచి వివో పూర్తిగా.. కారణమిదే!

ఐపీఎల్​ టైటిల్​ స్పాన్సర్​షిప్​ నుంచి చైనా మొబైల్​ దిగ్గజం వివో వైదొలగనుంది. ఇప్పటికే 2020కి గాను బీసీసీఐతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ఈ సంస్థ.. ఆసక్తి ఉన్న కంపెనీలకు టైటిల్​ హక్కులు బదిలీ చేయాలని భావిస్తోంది.

author img

By

Published : Feb 10, 2021, 6:39 AM IST

Vivo may transfer IPL title rights; Dream11, Unacademy in contention
ఐపీఎల్​ నుంచి పూర్తిగా దూరం కానున్న వివో!

చైనాకు చెందిన మొబైల్​ తయారీదారు సంస్థ వివో.. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​) నుంచి వైదొలగాలనుకుంటోంది. ఈ సంస్థకు 2023 వరకు టైటిల్​ ఐపీఎల్​ స్పాన్సర్​షిప్​ హక్కులు ఉన్నాయి. కానీ గల్వాన్ లోయలో ఉద్రిక్తతల కారణంగా దేశ ప్రజల్లో చైనా ఉత్పత్తులపై వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో 2020 సంవత్సరానికి మాత్రం బీసీసీఐ, వివోలు భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి.

ఇప్పుడు వివో ఐపీఎల్​కు పూర్తిగా దూరం కావాలనుకుంటోంది. ఆసక్తి ఉన్న కంపెనీలకు టైటిల్​ హక్కులను బదిలీ చేయాలని భావిస్తోంది. ఈ స్పాన్సర్​షిప్​ హక్కుల కోసం డ్రీమ్​11, అన్​అకాడమీ వంటి కంపెనీలు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. డ్రీమ్​11 రూ.222 కోట్లు చెల్లించి 2020 ఐపీఎల్​కు స్పాన్సర్​గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

చైనాకు చెందిన మొబైల్​ తయారీదారు సంస్థ వివో.. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​) నుంచి వైదొలగాలనుకుంటోంది. ఈ సంస్థకు 2023 వరకు టైటిల్​ ఐపీఎల్​ స్పాన్సర్​షిప్​ హక్కులు ఉన్నాయి. కానీ గల్వాన్ లోయలో ఉద్రిక్తతల కారణంగా దేశ ప్రజల్లో చైనా ఉత్పత్తులపై వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో 2020 సంవత్సరానికి మాత్రం బీసీసీఐ, వివోలు భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి.

ఇప్పుడు వివో ఐపీఎల్​కు పూర్తిగా దూరం కావాలనుకుంటోంది. ఆసక్తి ఉన్న కంపెనీలకు టైటిల్​ హక్కులను బదిలీ చేయాలని భావిస్తోంది. ఈ స్పాన్సర్​షిప్​ హక్కుల కోసం డ్రీమ్​11, అన్​అకాడమీ వంటి కంపెనీలు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. డ్రీమ్​11 రూ.222 కోట్లు చెల్లించి 2020 ఐపీఎల్​కు స్పాన్సర్​గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: 'లాక్​డౌన్​లో రూల్స్​ మార్చారు.. మా చేతుల్లో ఏముంది?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.