ETV Bharat / sports

గజరాజు మృతిపై క్రికెటర్ల ఆవేదన

author img

By

Published : Jun 4, 2020, 2:06 PM IST

కేరళలో మనుషుల క్రూరమైన చర్య వల్ల గర్భంతో ఉన్న ఏనుగు మృతి చెందడంపై టీమ్‌ఇండియా క్రికెటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగు మృతిపై సామాజిక మాధ్యమాల్లో సంతాపాన్ని తెలియజేశారు. దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని విన్నవించారు.

Virat Kohli: Let's treat our animals with love, bring an end to cowardly acts
గజరాజు మృతిపై సోషల్​మీడియాలో క్రికెటర్ల సంతాపం

కేరళలో హృదయవిదారక పరిస్థితుల్లో ఏనుగు మృతిచెందిన ఉదంతంపై సోషల్​మీడియాలో టీమ్‌ఇండియా క్రికెటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ జంతువు కూడా అలాంటి క్రూరమైన హింసకు బలికాకూడదని అభిప్రాయపడ్డారు. బుధవారం సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త వైరల్‌గా మారడం వల్ల దేశవ్యాప్తంగా చాలా మంది తల్లడిల్లిపోయారు. ఈ నేపథ్యంలోనే విషయం తెలుసుకున్న పలువురు భారత క్రికెటర్లు స్పందించారు.

  • Appalled to hear about what happened in Kerala. Let's treat our animals with love and bring an end to these cowardly acts. pic.twitter.com/3oIVZASpag

    — Virat Kohli (@imVkohli) June 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కేరళలో జరిగిన విషయం తెలిసి ఆందోళన చెందా. జంతువులపై ప్రేమను చూపండి. ఇలాంటి హేయమైన చర్యలకు ముగింపు పలకాలి".

- విరాట్​ కోహ్లీ, టీమ్​ఇండియా కెప్టెన్​

  • We are savages. Are we not learning ? To hear what happened to the elephant in Kerala was heartbreaking. No animal deserves to be treated with cruelty.

    — Rohit Sharma (@ImRo45) June 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మనం క్రూరులం. ఎలా ఉండాలో ఇంకా నేర్చుకోవట్లేదా? కేరళలో ఆ ఏనుగుకు ఏం జరిగిందో తెలిసి హృదయం బరువెక్కింది. ఏ జంతువు కూడా అలాంటి క్రూరత్వానికి బలికాకూడదు".

-రోహిత్​ శర్మ, టీమ్​ఇండియా వైస్​ కెప్టెన్​

"దుర్మార్గులైన మనుషులు చేసిన మరో సిగ్గుమాలిన చర్య. జంతువుల పట్ల ప్రేమగా ఉంటే మానవులకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఆ ఏనుగుకు పేలుడు పదార్థాలతో కూడిన పైనాపిల్‌ను పెట్టిన వ్యక్తులపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలి".

-సురేశ్​ రైనా, టీమ్ఇండియా క్రికెటర్

  • It is so heartbreaking to hear about such cruelty to these innocent creatures. So disappointed and upset about this. I really hope the culprit gets punished. https://t.co/w72QISt3Rk

    — Shikhar Dhawan (@SDhawan25) June 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అమాయక జీవులపై ఇలాంటి క్రూరత్వం గురించి వినడం హృదయ విదారకంగా ఉంది. ఈ వార్త విని నా మనసంతా కలత చెందింది. దీనికి కారణమైన వారికి కచ్చితంగా శిక్ష పడతుందని ఆశిస్తున్నా".

-శిఖర్​ ధావన్, టీమ్​ఇండియా ఓపెనర్​

  • Feeding a pregnant elephant with a pineapple filled with crackers. Only a monster can do this. Strict action should be taken against the culprits.

    — Umesh Yaadav (@y_umesh) June 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఏనుగుకు పైనాపిల్​లో పేలుడు పదార్థాలను పెట్టి ఇవ్వడం అనేది హేయమైన చర్య. రాక్షసులు మాత్రమే ఇలా చేయగలరు. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి".

­-ఉమేశ్​ యాదవ్​, టీమ్​ఇండియా బౌలర్​

"ఇలాంటి ఘటన చూసి నా గుండె పగిలిపోయింది. జంతువులను ఇలా చేయడం సరికాదు. దీనికి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి".

-ఇషాంత్​ శర్మ, టీమ్​ఇండియా పేసర్​

ఇదీ చూడండి... బంతిపై మైనం పూయడాన్ని అనుమతించలేం: కుంబ్లే

కేరళలో హృదయవిదారక పరిస్థితుల్లో ఏనుగు మృతిచెందిన ఉదంతంపై సోషల్​మీడియాలో టీమ్‌ఇండియా క్రికెటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ జంతువు కూడా అలాంటి క్రూరమైన హింసకు బలికాకూడదని అభిప్రాయపడ్డారు. బుధవారం సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త వైరల్‌గా మారడం వల్ల దేశవ్యాప్తంగా చాలా మంది తల్లడిల్లిపోయారు. ఈ నేపథ్యంలోనే విషయం తెలుసుకున్న పలువురు భారత క్రికెటర్లు స్పందించారు.

  • Appalled to hear about what happened in Kerala. Let's treat our animals with love and bring an end to these cowardly acts. pic.twitter.com/3oIVZASpag

    — Virat Kohli (@imVkohli) June 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కేరళలో జరిగిన విషయం తెలిసి ఆందోళన చెందా. జంతువులపై ప్రేమను చూపండి. ఇలాంటి హేయమైన చర్యలకు ముగింపు పలకాలి".

- విరాట్​ కోహ్లీ, టీమ్​ఇండియా కెప్టెన్​

  • We are savages. Are we not learning ? To hear what happened to the elephant in Kerala was heartbreaking. No animal deserves to be treated with cruelty.

    — Rohit Sharma (@ImRo45) June 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మనం క్రూరులం. ఎలా ఉండాలో ఇంకా నేర్చుకోవట్లేదా? కేరళలో ఆ ఏనుగుకు ఏం జరిగిందో తెలిసి హృదయం బరువెక్కింది. ఏ జంతువు కూడా అలాంటి క్రూరత్వానికి బలికాకూడదు".

-రోహిత్​ శర్మ, టీమ్​ఇండియా వైస్​ కెప్టెన్​

"దుర్మార్గులైన మనుషులు చేసిన మరో సిగ్గుమాలిన చర్య. జంతువుల పట్ల ప్రేమగా ఉంటే మానవులకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఆ ఏనుగుకు పేలుడు పదార్థాలతో కూడిన పైనాపిల్‌ను పెట్టిన వ్యక్తులపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలి".

-సురేశ్​ రైనా, టీమ్ఇండియా క్రికెటర్

  • It is so heartbreaking to hear about such cruelty to these innocent creatures. So disappointed and upset about this. I really hope the culprit gets punished. https://t.co/w72QISt3Rk

    — Shikhar Dhawan (@SDhawan25) June 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అమాయక జీవులపై ఇలాంటి క్రూరత్వం గురించి వినడం హృదయ విదారకంగా ఉంది. ఈ వార్త విని నా మనసంతా కలత చెందింది. దీనికి కారణమైన వారికి కచ్చితంగా శిక్ష పడతుందని ఆశిస్తున్నా".

-శిఖర్​ ధావన్, టీమ్​ఇండియా ఓపెనర్​

  • Feeding a pregnant elephant with a pineapple filled with crackers. Only a monster can do this. Strict action should be taken against the culprits.

    — Umesh Yaadav (@y_umesh) June 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఏనుగుకు పైనాపిల్​లో పేలుడు పదార్థాలను పెట్టి ఇవ్వడం అనేది హేయమైన చర్య. రాక్షసులు మాత్రమే ఇలా చేయగలరు. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి".

­-ఉమేశ్​ యాదవ్​, టీమ్​ఇండియా బౌలర్​

"ఇలాంటి ఘటన చూసి నా గుండె పగిలిపోయింది. జంతువులను ఇలా చేయడం సరికాదు. దీనికి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి".

-ఇషాంత్​ శర్మ, టీమ్​ఇండియా పేసర్​

ఇదీ చూడండి... బంతిపై మైనం పూయడాన్ని అనుమతించలేం: కుంబ్లే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.