వాణిజ్య ఒప్పందాల్లో బాలీవుడ్ తారల కంటే క్రికెటర్ల జోరు ఎక్కువగా కనిపిస్తుంది. ఒప్పందాల విషయంలో సినీతారల సంఖ్య అధికంగానే ఉన్నా.. ఎదుగుదలలో మాత్రం క్రికెటర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది 21 మంది బాలీవుడ్ తారలకు వాణిజ్య ఒప్పందాలు ఉండగా.. ఈ సారి ఆ సంఖ్య 30కి పెరిగింది. అయితే నిరుడు ఐపీఎల్లో నలుగురికి మాత్రమే వాణిజ్య ఒప్పందాలు ఉండగా.. ఈ ఏడాది 18 మందికి చేరుకుంది.
బాలీవుడ్ వివాదాలు, ఐపీఎల్ కారణంగా క్రికెటర్ల క్రేజ్ పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు. ఐపీఎల్-13లో వాణిజ్య ఒప్పందాల్లో 42 శాతం వాటాతో ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ 9 శాతం చొప్పున తర్వాత స్థానాల్లో ఉన్నారు. బ్రాండ్ విలువలో మాత్రం కోహ్లీదే ప్రథమస్థానం. కోహ్లీ ఒక రోజుకు రూ.5 కోట్లు తీసుకుంటుండగా.. ధోనీ, రోహిత్ శర్మలు రూ.1 కోటి నుంచి రూ.3 కోట్లు అందుకుంటున్నారు.