ETV Bharat / sports

'శతకం కోసం కోహ్లీ ఎంతో ఆరాటపడ్డాడు'

నిన్నటి మ్యాచ్​లో భారత సారథి విరాట్ కోహ్లీని గమనిస్తే సెంచరీ కోసం అతడు ఎంత ఆరాటపడ్డాడో తెలుస్తుందని టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. ఐదు నెలల తర్వాత శతకం సాధించాడు కోహ్లీ.

author img

By

Published : Aug 12, 2019, 12:21 PM IST

Updated : Sep 26, 2019, 5:52 PM IST

భువనేశ్వర్ కుమార్

శతకం కోసం విరాట్​ కోహ్లీ తీవ్రంగా ఆరాటపడ్డాడని భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ అభిప్రాయపడ్డాడు. 11 ఇన్నింగ్స్​ తర్వాత విరాట్ చేసిన ఈ సెంచరీ అతడికి ఎంతో ప్రత్యేకమైనదని తెలిపాడు.

VIRAT
శతక్కొట్టిన విరాట్

"శతకం కోసం ఎంత తీవ్రంగా ఆరాటపడ్డాడో నిన్నటి మ్యాచ్​లో విరాట్​ను గమనిస్తే మీకే అర్థమవుతుంది. 70, 80 పరుగుల వద్ద చాలాసార్లు ఔటయ్యాడు. భారీ స్కోరు చేసేందుకే అతడు ఎప్పుడూ చూస్తాడు" - భువనేశ్వర్ కుమార్, భారత బౌలర్

ఆ పిచ్​పై వికెట్ తీయడం అంత సులభం కాదని తెలిపాడు భువనేశ్వర్ కుమార్.

"పొదుపుగా బౌలింగ్ చేద్దామని అనుకున్నా. ఎక్కువ డాట్ బాల్స్​ వేసి ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను ఇబ్బందిపెట్టాలనుకున్నా. అందులో భాగంగానే వికెట్లు కూడా పడ్డాయి. మ్యాచ్ ఫలితం గురించి అంతగా ఆలోచించలేదు. ఒకటి రెండు వికెట్లు తీస్తే ఫలితం మాకే అనుకూలిస్తుందని ముందే తెలుసు" -భువనేశ్వర్ కుమార్, భారత బౌలర్​.

ట్రినిడాడ్ వేదికగా విండీస్​తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 120 పరుగులు చేసి కెరీర్​లో 42వ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 8 ఓవర్లు వేసి కేవలం 31 పరుగులిచ్చి 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరి విజృభణతో విండీస్​తో వన్డే సిరీస్​లో భారత్ బోణీ కొట్టింది.

ఇదీ చదవండి: అండర్-19 త్రైపాక్షిక సిరీస్​లో భారత్ విజయం

శతకం కోసం విరాట్​ కోహ్లీ తీవ్రంగా ఆరాటపడ్డాడని భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ అభిప్రాయపడ్డాడు. 11 ఇన్నింగ్స్​ తర్వాత విరాట్ చేసిన ఈ సెంచరీ అతడికి ఎంతో ప్రత్యేకమైనదని తెలిపాడు.

VIRAT
శతక్కొట్టిన విరాట్

"శతకం కోసం ఎంత తీవ్రంగా ఆరాటపడ్డాడో నిన్నటి మ్యాచ్​లో విరాట్​ను గమనిస్తే మీకే అర్థమవుతుంది. 70, 80 పరుగుల వద్ద చాలాసార్లు ఔటయ్యాడు. భారీ స్కోరు చేసేందుకే అతడు ఎప్పుడూ చూస్తాడు" - భువనేశ్వర్ కుమార్, భారత బౌలర్

ఆ పిచ్​పై వికెట్ తీయడం అంత సులభం కాదని తెలిపాడు భువనేశ్వర్ కుమార్.

"పొదుపుగా బౌలింగ్ చేద్దామని అనుకున్నా. ఎక్కువ డాట్ బాల్స్​ వేసి ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను ఇబ్బందిపెట్టాలనుకున్నా. అందులో భాగంగానే వికెట్లు కూడా పడ్డాయి. మ్యాచ్ ఫలితం గురించి అంతగా ఆలోచించలేదు. ఒకటి రెండు వికెట్లు తీస్తే ఫలితం మాకే అనుకూలిస్తుందని ముందే తెలుసు" -భువనేశ్వర్ కుమార్, భారత బౌలర్​.

ట్రినిడాడ్ వేదికగా విండీస్​తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 120 పరుగులు చేసి కెరీర్​లో 42వ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 8 ఓవర్లు వేసి కేవలం 31 పరుగులిచ్చి 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరి విజృభణతో విండీస్​తో వన్డే సిరీస్​లో భారత్ బోణీ కొట్టింది.

ఇదీ చదవండి: అండర్-19 త్రైపాక్షిక సిరీస్​లో భారత్ విజయం

AP Video Delivery Log - 0100 GMT News
Monday, 12 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0059: Pakistan Kashmir Appeal Part no use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4224649
Wife of Kashmir leader appeals for UN intervention
AP-APTN-2351: US PA Fatal Daycare Fire Must credit WJET; No access Los Angeles; No use US broadcast networks; No re-sale, re-use or archive 4224653
Five children killed in Pennsylvania daycare fire
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 26, 2019, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.