ETV Bharat / sports

వరుణ్​ గాయం గురించి సెలక్టర్లకు తెలియదా?

యువ స్పిన్నర్​​ వరుణ్​ చక్రవర్తి గాయం గురించి బీసీసీఐ సెలక్టర్లకు తెలియదని, అందుకే అతడిని ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నవంబరు 27 నుంచి భారత్-ఆసీస్ జట్ల మధ్య మ్యాచ్​లు జరగనున్నాయి.

author img

By

Published : Nov 9, 2020, 10:26 AM IST

varun chakravarthy
వరుణ్​ చక్రవర్తి

ఐపీఎల్​లో గాయపడిన ముంబయి జట్టు కెప్టెన్​ రోహిత్​ శర్మను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై పెద్ద దుమారమే చెలరేగింది. ఇప్పుడు మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

ఆసీస్​తో టీ20 సిరీస్​ కోసం కోల్​కతా నైట్​రైడర్స్​ స్పిన్నర్ వరుణ్​ చక్రవర్తిని ఎంపిక చేశారు. అయితే ఐపీఎల్​ ప్రారంభానికి ముందే అతడి కుడి భుజానికి గాయమైందని, అలానే ఈ సీజన్​ ఆడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కోల్​కతా ఫ్రాంచైజీ​.. టీమ్​ఇండియా సెలక్షన్ కమిటీకి చెప్పలేదని క్రికెట్​ వర్గాలు తెలిపాయి. ఈ విషయం తెలియకే బోర్డు అతడిని ఆసీస్​ పర్యటనకు ఎంపిక చేసిందని అంటున్నారు.

"వరుణ్ కుడి భుజానికి గాయమైంది. దాని నుంచి కోలుకోవాలంటే సర్జరీ అవసరం. సరిగ్గా బంతిని కూడా విసరలేకపోతున్నాడు. కానీ ఐపీఎల్​లో ఆడాలనే ఆసక్తితో చికిత్స లేకుండానే బరిలో దిగాడు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఫ్రాంచైజీ, ఈ విషయాన్ని తమ జట్టు సీజన్​ నుంచి నిష్క్రమించిన తర్వాత టీమ్​ఇండియా సెలక్టరకు తెలిపింది. ఓ ఆటగాడి గాయాన్ని ఇక్కడ దాచినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతానికి బౌలింగ్ చేయడానికి అతడు ఫిట్​గా ఉన్నప్పటికీ ఆస్ట్రేలియాలోని పెద్ద మైదానాల్లో బంతి వేయడం కష్టమవుతుంది"

-క్రికెట్​ వర్గాలు

ఆరు వారాలు పట్టొచ్చు

దుబాయ్​లోని ఐసీసీ అకాడమీలో మిగతా ఆటగాళ్లతో కలిసి ట్రైనింగ్​ సెషన్​లో వరుణ్​ చక్రవర్తి పాల్గొన్నాడు. ఫిజియో ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గాయం మానడానికి దాదాపు ఆరు వారాల సమయం పట్టొచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

రోహిత్​ ఆడే అవకాశముంది

ఐపీఎల్​లో గాయపడిన రోహిత్​ శర్మ.. కోలుకుని గత రెండు మ్యాచుల్లో ఆడాడు. కాబట్టి ఆసీస్​ పర్యటన కోసం బీసీసీఐ వైద్య బృందం మరోసారి అతడి ఫిట్​నెస్​ను పరిశీలించి, జట్టులోకి తీసుకునే అవకాశముంది.

ఇదీ చూడండి : 'భారత టీ20 జట్టుకు ఎంపికవడం నమ్మలేకపోతున్నా'

ఐపీఎల్​లో గాయపడిన ముంబయి జట్టు కెప్టెన్​ రోహిత్​ శర్మను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై పెద్ద దుమారమే చెలరేగింది. ఇప్పుడు మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

ఆసీస్​తో టీ20 సిరీస్​ కోసం కోల్​కతా నైట్​రైడర్స్​ స్పిన్నర్ వరుణ్​ చక్రవర్తిని ఎంపిక చేశారు. అయితే ఐపీఎల్​ ప్రారంభానికి ముందే అతడి కుడి భుజానికి గాయమైందని, అలానే ఈ సీజన్​ ఆడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కోల్​కతా ఫ్రాంచైజీ​.. టీమ్​ఇండియా సెలక్షన్ కమిటీకి చెప్పలేదని క్రికెట్​ వర్గాలు తెలిపాయి. ఈ విషయం తెలియకే బోర్డు అతడిని ఆసీస్​ పర్యటనకు ఎంపిక చేసిందని అంటున్నారు.

"వరుణ్ కుడి భుజానికి గాయమైంది. దాని నుంచి కోలుకోవాలంటే సర్జరీ అవసరం. సరిగ్గా బంతిని కూడా విసరలేకపోతున్నాడు. కానీ ఐపీఎల్​లో ఆడాలనే ఆసక్తితో చికిత్స లేకుండానే బరిలో దిగాడు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఫ్రాంచైజీ, ఈ విషయాన్ని తమ జట్టు సీజన్​ నుంచి నిష్క్రమించిన తర్వాత టీమ్​ఇండియా సెలక్టరకు తెలిపింది. ఓ ఆటగాడి గాయాన్ని ఇక్కడ దాచినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతానికి బౌలింగ్ చేయడానికి అతడు ఫిట్​గా ఉన్నప్పటికీ ఆస్ట్రేలియాలోని పెద్ద మైదానాల్లో బంతి వేయడం కష్టమవుతుంది"

-క్రికెట్​ వర్గాలు

ఆరు వారాలు పట్టొచ్చు

దుబాయ్​లోని ఐసీసీ అకాడమీలో మిగతా ఆటగాళ్లతో కలిసి ట్రైనింగ్​ సెషన్​లో వరుణ్​ చక్రవర్తి పాల్గొన్నాడు. ఫిజియో ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గాయం మానడానికి దాదాపు ఆరు వారాల సమయం పట్టొచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

రోహిత్​ ఆడే అవకాశముంది

ఐపీఎల్​లో గాయపడిన రోహిత్​ శర్మ.. కోలుకుని గత రెండు మ్యాచుల్లో ఆడాడు. కాబట్టి ఆసీస్​ పర్యటన కోసం బీసీసీఐ వైద్య బృందం మరోసారి అతడి ఫిట్​నెస్​ను పరిశీలించి, జట్టులోకి తీసుకునే అవకాశముంది.

ఇదీ చూడండి : 'భారత టీ20 జట్టుకు ఎంపికవడం నమ్మలేకపోతున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.