ETV Bharat / sports

ఐపీఎల్ 2020: ఈసారి లీగ్​​లో ఇవేవీ కనిపించవు

author img

By

Published : Aug 8, 2020, 5:42 PM IST

కరోనా ప్రభావంతో ఈ ఏడాది జరిగే ఐపీఎల్ సీజన్​లో కొన్నింటిని మనం మిస్సవబోతున్నాం. ఇందులో భాగంగా మస్కట్​, షేక్ హ్యాండ్​లు లాంటివి ఇకపై మనకు కనిపించవు.

ఐపీఎల్ 2020: ఈసారి లీగ్​​లో ఇవేవి కనిపించవు
ఐపీఎల్ 2020

కరోనాతో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. వేసవిలో సందడే లేకుండా పోయింది. స్టార్ హీరోల సినిమాల నుంచి ఐపీఎల్​ మ్యాచ్​ల వరకు అన్ని ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. యూఏఈలో ఐపీఎల్​ నిర్వహణకు భారత ప్రభుత్వం తాజాగా అనుమతిచ్చిన నేపథ్యంలో క్రికెటర్లు, ప్రాక్టీసుకు సిద్ధమవుతున్నారు. కొందరు ఈపాటికే మొదలుపెట్టేశారు. వైరస్ ప్రభావం వల్ల ఈ సీజన్​లో చాలా అంశాల్ని మనం మిస్సవబోతున్నాం. ఇంతకీ అవేంటంటే?

IPL 2020 in UAE
ఐపీఎల్ 2020

మస్కట్​ లేదు.. షేక్​ హ్యాండ్స్​ పూర్తిగా బంద్

ఎస్​ఓపీ(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రకారం ఈ సీజన్​ టాస్​ వేసేటప్పుడు టీమ్​ జాబితా పేపర్​లో కాకుండా డిజిటల్​గా ఉండనుంది. ఐపీఎల్​ మస్కట్ ఈసారి కనిపించదు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. కరచాలనం పూర్తిగా నిషేధం లాంటి నిబంధనలు అమల్లో ఉన్నాయి.​ ఆటగాళ్లు తమ కిట్​లోని వస్తువులను మరొకరితో పంచుకోవడానికి కూడా వీల్లేదని తెలుస్తోంది.

ipl mascot
ఐపీఎల్ మస్కట్

మైదానంలో ప్రేక్షకులు కనిపించరు

ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు, యూఏఈ అథారిటీలు, వైద్య నిపుణులతో పాటు పలు ఏజెన్సీలతో కలిసి బీసీసీఐ ఐపీఎల్​ను నిర్వహించనుంది. ఇందులో భాగంగా ప్రేక్షకులు ఎవరూ లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్​లు జరపనుంది.

IPL 2020 in UAE
యూఏఈ మైదానంలో అభిమానులు(పాత చిత్రం)

డ్రెస్సింగ్ రూమ్​ల్లో ఇంటర్వ్యూలు లేవు

మైదానంతో పాటే డ్రెస్సింగ్ రూమ్​లోనూ ఆటగాళ్లు భౌతిక దూరం పాటించనున్నారు. బయో సెక్యూర్​ వాతావరణంలో మ్యాచ్​ల నిర్వహణ వల్ల బయట నుంచి ఎవరిని లోపలికి అనుమతించరు. అందువల్ల డ్రెస్సింగ్​ రూమ్​లో ఇంటర్య్వూలు ఈసారి కనిపించవు.

IPL 2020 in UAE
డ్రెస్సింగ్ రూమ్​లో ఇంటర్వ్యూ(పాత చిత్రం)

నో షారుక్.. నో ప్రీతి జింటా

ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు యూఏఈ వస్తే బయో సెక్యూర్​ వాతావరణంలోనే ఉండాలి. ఒకవేళ అతిక్రమిస్తే ఏడు రోజులు క్వారంటైన్ సహా రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో నెగటివ్​గా వస్తేనే తిరిగి లోపలికి అనుమతిస్తారు.

IPL TEAM OWNERS
ఐపీఎల్ జట్టు యజమానులు

ఒకవేళ జట్టు యజమానులు బయో సెక్యూర్​లో లేకపోతే.. క్రికెటర్లు, ఇతర సిబ్బందితో కలిసి ఒకే బస్సులో ప్రయాణించడానికి వీలుపడదు.

కుటుంబాలతో ప్రయాణం కుదరదు

ఈ సీజన్​లో క్రికెటర్లతో పాటు వారి కుటుంబాలు యూఏఈకి వచ్చినా సరే, ఒకే బస్సులో ప్రయాణించడం కుదరదు. కుటుంబ సభ్యుల్ని ట్రైనింగ్, మ్యాచ్​లు జరుగుతున్నప్పుడు చూసేందుకు అనుమతించరు. వారికి కేటాయించిన హోటళ్లలో ఉండాల్సిందే. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే ఏడు రోజులు క్వారంటైన్​లో ఉంచడం సహా రెండుసార్లు కరోనా పరీక్షలు జరిపిన తర్వాత తిరిగి బయో సెక్యూర్​ వాతావరణంలోకి అనుమతిస్తారు.

rohit with his family
కుటుంబంతో మైదానంలో రోహిత్ శర్మ

కరోనాతో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. వేసవిలో సందడే లేకుండా పోయింది. స్టార్ హీరోల సినిమాల నుంచి ఐపీఎల్​ మ్యాచ్​ల వరకు అన్ని ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. యూఏఈలో ఐపీఎల్​ నిర్వహణకు భారత ప్రభుత్వం తాజాగా అనుమతిచ్చిన నేపథ్యంలో క్రికెటర్లు, ప్రాక్టీసుకు సిద్ధమవుతున్నారు. కొందరు ఈపాటికే మొదలుపెట్టేశారు. వైరస్ ప్రభావం వల్ల ఈ సీజన్​లో చాలా అంశాల్ని మనం మిస్సవబోతున్నాం. ఇంతకీ అవేంటంటే?

IPL 2020 in UAE
ఐపీఎల్ 2020

మస్కట్​ లేదు.. షేక్​ హ్యాండ్స్​ పూర్తిగా బంద్

ఎస్​ఓపీ(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రకారం ఈ సీజన్​ టాస్​ వేసేటప్పుడు టీమ్​ జాబితా పేపర్​లో కాకుండా డిజిటల్​గా ఉండనుంది. ఐపీఎల్​ మస్కట్ ఈసారి కనిపించదు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. కరచాలనం పూర్తిగా నిషేధం లాంటి నిబంధనలు అమల్లో ఉన్నాయి.​ ఆటగాళ్లు తమ కిట్​లోని వస్తువులను మరొకరితో పంచుకోవడానికి కూడా వీల్లేదని తెలుస్తోంది.

ipl mascot
ఐపీఎల్ మస్కట్

మైదానంలో ప్రేక్షకులు కనిపించరు

ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు, యూఏఈ అథారిటీలు, వైద్య నిపుణులతో పాటు పలు ఏజెన్సీలతో కలిసి బీసీసీఐ ఐపీఎల్​ను నిర్వహించనుంది. ఇందులో భాగంగా ప్రేక్షకులు ఎవరూ లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్​లు జరపనుంది.

IPL 2020 in UAE
యూఏఈ మైదానంలో అభిమానులు(పాత చిత్రం)

డ్రెస్సింగ్ రూమ్​ల్లో ఇంటర్వ్యూలు లేవు

మైదానంతో పాటే డ్రెస్సింగ్ రూమ్​లోనూ ఆటగాళ్లు భౌతిక దూరం పాటించనున్నారు. బయో సెక్యూర్​ వాతావరణంలో మ్యాచ్​ల నిర్వహణ వల్ల బయట నుంచి ఎవరిని లోపలికి అనుమతించరు. అందువల్ల డ్రెస్సింగ్​ రూమ్​లో ఇంటర్య్వూలు ఈసారి కనిపించవు.

IPL 2020 in UAE
డ్రెస్సింగ్ రూమ్​లో ఇంటర్వ్యూ(పాత చిత్రం)

నో షారుక్.. నో ప్రీతి జింటా

ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు యూఏఈ వస్తే బయో సెక్యూర్​ వాతావరణంలోనే ఉండాలి. ఒకవేళ అతిక్రమిస్తే ఏడు రోజులు క్వారంటైన్ సహా రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో నెగటివ్​గా వస్తేనే తిరిగి లోపలికి అనుమతిస్తారు.

IPL TEAM OWNERS
ఐపీఎల్ జట్టు యజమానులు

ఒకవేళ జట్టు యజమానులు బయో సెక్యూర్​లో లేకపోతే.. క్రికెటర్లు, ఇతర సిబ్బందితో కలిసి ఒకే బస్సులో ప్రయాణించడానికి వీలుపడదు.

కుటుంబాలతో ప్రయాణం కుదరదు

ఈ సీజన్​లో క్రికెటర్లతో పాటు వారి కుటుంబాలు యూఏఈకి వచ్చినా సరే, ఒకే బస్సులో ప్రయాణించడం కుదరదు. కుటుంబ సభ్యుల్ని ట్రైనింగ్, మ్యాచ్​లు జరుగుతున్నప్పుడు చూసేందుకు అనుమతించరు. వారికి కేటాయించిన హోటళ్లలో ఉండాల్సిందే. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే ఏడు రోజులు క్వారంటైన్​లో ఉంచడం సహా రెండుసార్లు కరోనా పరీక్షలు జరిపిన తర్వాత తిరిగి బయో సెక్యూర్​ వాతావరణంలోకి అనుమతిస్తారు.

rohit with his family
కుటుంబంతో మైదానంలో రోహిత్ శర్మ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.