ETV Bharat / sports

ఇంగ్లాండ్​-పాక్​: టీ20ల్లో టెస్టు ప్లేయర్లకు దక్కని చోటు

author img

By

Published : Aug 19, 2020, 10:49 AM IST

ఇంగ్లాండ్-పాకిస్థాన్​ మధ్య త్వరలో టీ20 సిరీస్​ ప్రారంభం కానుంది. ఇందుకోసం 14 మందితో జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్​ బోర్డు. ఇప్పటికే మూడో మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో 1-0 ఆధిక్యంలో ఉంది ఇంగ్లీష్​ సేన.

england vs pakistan
ఇంగ్లాండ్​-పాక్​: టీ20ల్లో టెస్టు ప్లేయర్లకు దక్కని చోటు

పాకిస్థాన్​తో టీ20 సిరీస్​కు జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్​ బోర్డు. మూడు మ్యాచ్​ల కోసం 14 మందితో జట్టును ప్రకటించారు. ఇందులో ప్రస్తుతం టెస్టుల్లో ఆడుతున్న ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఆగస్టు 28 నుంచి మాంచెస్టర్​లోని ఓల్డ్​ ట్రాఫోర్డ్ వేదికగా పొట్టి సిరీస్​ ప్రారంభం కానుంది.

ఇంగ్లీష్​ జట్టుకు ఇయాన్​ మోర్గాన్​ సారథ్యం వహించనున్నాడు. మిడిల్​ఎసెక్స్​ ఆల్​రౌండర్​ లియామ్​ డావ్సన్​, జేమ్స్​ విన్స్​ ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో లేరు.

" ప్రస్తుతం టెస్టు జట్టులో ఉన్న ఆటగాళ్లను బయో బబుల్​ కారణంగా టీ20లకు ఎంపిక చేయలేదు. మూడో టెస్టు మూడు రోజుల తర్వాత టీ20 సిరీస్​ ప్రారంభం కానుంది. మల్టీ ఫార్మాట్​ ప్లేయర్లకు కాస్త విశ్రాంతి తీసుకునే అవకాశం ఇస్తున్నాం. త్వరలోనే ఆస్ట్రేలియాతో సిరీస్​కు జట్టును ప్రకటిస్తాం" అని సెలక్టర్​ స్మిత్​ చెప్పారు.

ఇంగ్లాండ్ జట్టు:

ఇయాన్​ మోర్గాన్​ (కెప్టెన్​), మొయిన్​ అలీ, జానీ బెయిర్​స్టో, టామ్​ బాంటన్​, సామ్​ బిల్లింగ్స్​, టామ్​ కరన్​, జో డెన్లే, లూయిస్​ గ్రెగోరీ, క్రిస్​ జోర్డాన్​ష షకీబ్​ మహ్మూద్​, డేవిడ్​ మాల్టన్​, అదిల్​ రషీద్​, జేసన్​ రాయ్​, డేవిడ్​ విల్లే

ప్రస్తుతం ఇరుజట్ల మధ్య టెస్టు సిరీస్​ జరుగుతోంది. ఇందులో తొలి మ్యాచ్​ ఇంగ్లాండ్​ నెగ్గగా.. రెెండో మ్యాచ్​ వర్షం కారణంగా డ్రా అయింది. ఫలితంగా ఇంగ్లాండ్​ 1-0 ఆధిక్యంలో ఉంది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్​ ఆగస్టు 21 నుంచి సౌథాంప్టన్​లోనే ప్రారంభం కానుంది.

పాకిస్థాన్​తో టీ20 సిరీస్​కు జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్​ బోర్డు. మూడు మ్యాచ్​ల కోసం 14 మందితో జట్టును ప్రకటించారు. ఇందులో ప్రస్తుతం టెస్టుల్లో ఆడుతున్న ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఆగస్టు 28 నుంచి మాంచెస్టర్​లోని ఓల్డ్​ ట్రాఫోర్డ్ వేదికగా పొట్టి సిరీస్​ ప్రారంభం కానుంది.

ఇంగ్లీష్​ జట్టుకు ఇయాన్​ మోర్గాన్​ సారథ్యం వహించనున్నాడు. మిడిల్​ఎసెక్స్​ ఆల్​రౌండర్​ లియామ్​ డావ్సన్​, జేమ్స్​ విన్స్​ ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో లేరు.

" ప్రస్తుతం టెస్టు జట్టులో ఉన్న ఆటగాళ్లను బయో బబుల్​ కారణంగా టీ20లకు ఎంపిక చేయలేదు. మూడో టెస్టు మూడు రోజుల తర్వాత టీ20 సిరీస్​ ప్రారంభం కానుంది. మల్టీ ఫార్మాట్​ ప్లేయర్లకు కాస్త విశ్రాంతి తీసుకునే అవకాశం ఇస్తున్నాం. త్వరలోనే ఆస్ట్రేలియాతో సిరీస్​కు జట్టును ప్రకటిస్తాం" అని సెలక్టర్​ స్మిత్​ చెప్పారు.

ఇంగ్లాండ్ జట్టు:

ఇయాన్​ మోర్గాన్​ (కెప్టెన్​), మొయిన్​ అలీ, జానీ బెయిర్​స్టో, టామ్​ బాంటన్​, సామ్​ బిల్లింగ్స్​, టామ్​ కరన్​, జో డెన్లే, లూయిస్​ గ్రెగోరీ, క్రిస్​ జోర్డాన్​ష షకీబ్​ మహ్మూద్​, డేవిడ్​ మాల్టన్​, అదిల్​ రషీద్​, జేసన్​ రాయ్​, డేవిడ్​ విల్లే

ప్రస్తుతం ఇరుజట్ల మధ్య టెస్టు సిరీస్​ జరుగుతోంది. ఇందులో తొలి మ్యాచ్​ ఇంగ్లాండ్​ నెగ్గగా.. రెెండో మ్యాచ్​ వర్షం కారణంగా డ్రా అయింది. ఫలితంగా ఇంగ్లాండ్​ 1-0 ఆధిక్యంలో ఉంది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్​ ఆగస్టు 21 నుంచి సౌథాంప్టన్​లోనే ప్రారంభం కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.