ETV Bharat / sports

'టీమ్ఇండియా బెంచ్​ బలానికి ఐపీఎల్​యే కారణం'

ప్రస్తుత టీమ్​ఇండియా రిజర్వ్​బెంచ్ బలంగా ఉండటానికి ఐపీఎల్​యే కారణమని తెలిపాడు దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందుల్కర్​. ఇంగ్లాండ్​తో పొట్టి సిరీస్​లో సూర్యకుమార్​, ఇషాన్​ కిషన్​ రాణించడానికి ఈ టోర్నీ ఉపయోగపడిందని పేర్కొన్నాడు.​

author img

By

Published : Mar 19, 2021, 5:50 PM IST

Tendulkar credits IPL for developing India's bench strength
'టీమ్ఇండియా బెంచ్​ బలానికి ఐపీఎల్​యే కారణం '

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​పై పొగడ్తలు కురిపించాడు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్. ఐపీఎల్​ వల్లే టీమ్ఇండియా బెంచ్​ బలం పెరిగిందని కీర్తించాడు. ఆటగాళ్ల పురోగతికి ఈ లీగ్​ ఎంతోగానో తోడ్పడిందని లిటిల్ మాస్టర్​ పేర్కొన్నాడు. ప్రతి ఏడాది ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం ఈ టోర్నీ​తో ఏర్పడిందని తెలిపాడు.

"మేము క్రికెట్ ఆడే తొలినాళ్లలో మాకు ఈ అవకాశం లేదు. వసీమ్​ అక్రమ్​, షేన్ వార్న్​, మెక్​ డెర్మాట్​, మెర్వ్ హ్యూగ్స్​ వంటి బౌలర్లను ఎదుర్కోవాలంటే ఇబ్బంది పడేవాళ్లం. కానీ, ఐపీఎల్ వల్ల ప్రస్తుతం ఈ ఇబ్బంది లేకుండా పోయింది. ఈ పొట్టి లీగ్​లోనే మేటి క్రికెటర్ల బౌలింగ్​లో ఆడే అవకాశం ఉంది. తాజాగా సూర్య, ఇషాన్​ గొప్పగా ఆడటానికి కారణమిదే."

-సచిన్ తెందుల్కర్, భారత మాజీ క్రికెటర్.

ఇంగ్లాండ్​తో జరుగుతున్న టీ20 సిరీస్​లో సూర్యకుమార్ యాదవ్​, ఇషాన్​ కిషన్.. అరంగేట్రం మ్యాచ్​ల్లోనే అదరగొట్టారు. వారు ఇంతకుముందే ఆర్చర్​, స్టోక్స్​ వంటి బౌలర్లను ఐపీఎల్​లో ఎదుర్కొన్నారు. ఈ ఇద్దరు ఇంగ్లిష్ ఆటగాళ్లు రాజస్థాన్ రాయల్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ప్రస్తుతం వీరి బౌలింగ్ ఆడటానికి సూర్యతో పాటు ఇషాన్ ఎటువంటి సంకోచం చూపలేదు.

డ్రెస్సింగ్​ రూమ్​ గొప్పతనం అదే..

రోడ్​ సేఫ్టీ సిరీస్​పై స్పందించిన సచిన్​.. తిరిగి డ్రెస్సింగ్ రూమ్​ను సహచరులతో పంచుకోవడం ప్రత్యేకంగా ఉందని తెలిపాడు. "ఆట అనేది ప్రతి ఒక్కరినీ గుర్తిస్తుంది. ఇక్కడ కులం, మతం, బ్యాంక్​ బ్యాలెన్స్​, ఇంకా వేరేది చూడరు. ఎలా ఆడుతున్నామన్నది మాత్రమే ముఖ్యం. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా.. డ్రెస్సింగ్​ రూమ్​లో మాత్రం జట్టుగా కలిసి ఉంటాం. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న భావన గర్వంగా అనిపిస్తుంది" అని మాస్టర్​ బ్లాస్టర్ పేర్కొన్నాడు.

హెల్మెట్ తప్పక ధరించండి..

"ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది దాదాపు 13 లక్షల పైచిలుకు ప్రజలు రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోతున్నారు. భారత్​లో లక్షా 50వేలు ప్రాణాలు విడుస్తున్నారు. ఇవీ కూడా హెల్మెట్​లు ధరించకపోవడం వల్ల జరుగుతున్నవి. కాబట్టి బండి నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వాళ్లు కూడా హెల్మెట్ ధరించాలి" అని సచిన్ సూచించాడు.

ఇదీ చదవండి: ఒలింపిక్స్​కు మరో నలుగురు భారత అథ్లెట్లు

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​పై పొగడ్తలు కురిపించాడు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్. ఐపీఎల్​ వల్లే టీమ్ఇండియా బెంచ్​ బలం పెరిగిందని కీర్తించాడు. ఆటగాళ్ల పురోగతికి ఈ లీగ్​ ఎంతోగానో తోడ్పడిందని లిటిల్ మాస్టర్​ పేర్కొన్నాడు. ప్రతి ఏడాది ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం ఈ టోర్నీ​తో ఏర్పడిందని తెలిపాడు.

"మేము క్రికెట్ ఆడే తొలినాళ్లలో మాకు ఈ అవకాశం లేదు. వసీమ్​ అక్రమ్​, షేన్ వార్న్​, మెక్​ డెర్మాట్​, మెర్వ్ హ్యూగ్స్​ వంటి బౌలర్లను ఎదుర్కోవాలంటే ఇబ్బంది పడేవాళ్లం. కానీ, ఐపీఎల్ వల్ల ప్రస్తుతం ఈ ఇబ్బంది లేకుండా పోయింది. ఈ పొట్టి లీగ్​లోనే మేటి క్రికెటర్ల బౌలింగ్​లో ఆడే అవకాశం ఉంది. తాజాగా సూర్య, ఇషాన్​ గొప్పగా ఆడటానికి కారణమిదే."

-సచిన్ తెందుల్కర్, భారత మాజీ క్రికెటర్.

ఇంగ్లాండ్​తో జరుగుతున్న టీ20 సిరీస్​లో సూర్యకుమార్ యాదవ్​, ఇషాన్​ కిషన్.. అరంగేట్రం మ్యాచ్​ల్లోనే అదరగొట్టారు. వారు ఇంతకుముందే ఆర్చర్​, స్టోక్స్​ వంటి బౌలర్లను ఐపీఎల్​లో ఎదుర్కొన్నారు. ఈ ఇద్దరు ఇంగ్లిష్ ఆటగాళ్లు రాజస్థాన్ రాయల్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ప్రస్తుతం వీరి బౌలింగ్ ఆడటానికి సూర్యతో పాటు ఇషాన్ ఎటువంటి సంకోచం చూపలేదు.

డ్రెస్సింగ్​ రూమ్​ గొప్పతనం అదే..

రోడ్​ సేఫ్టీ సిరీస్​పై స్పందించిన సచిన్​.. తిరిగి డ్రెస్సింగ్ రూమ్​ను సహచరులతో పంచుకోవడం ప్రత్యేకంగా ఉందని తెలిపాడు. "ఆట అనేది ప్రతి ఒక్కరినీ గుర్తిస్తుంది. ఇక్కడ కులం, మతం, బ్యాంక్​ బ్యాలెన్స్​, ఇంకా వేరేది చూడరు. ఎలా ఆడుతున్నామన్నది మాత్రమే ముఖ్యం. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా.. డ్రెస్సింగ్​ రూమ్​లో మాత్రం జట్టుగా కలిసి ఉంటాం. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న భావన గర్వంగా అనిపిస్తుంది" అని మాస్టర్​ బ్లాస్టర్ పేర్కొన్నాడు.

హెల్మెట్ తప్పక ధరించండి..

"ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది దాదాపు 13 లక్షల పైచిలుకు ప్రజలు రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోతున్నారు. భారత్​లో లక్షా 50వేలు ప్రాణాలు విడుస్తున్నారు. ఇవీ కూడా హెల్మెట్​లు ధరించకపోవడం వల్ల జరుగుతున్నవి. కాబట్టి బండి నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వాళ్లు కూడా హెల్మెట్ ధరించాలి" అని సచిన్ సూచించాడు.

ఇదీ చదవండి: ఒలింపిక్స్​కు మరో నలుగురు భారత అథ్లెట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.