సరిగ్గా ఇదే రోజు.. 12 ఏళ్ల క్రితం ఐపీఎల్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ కోల్కతా నైట్రైడర్స్-బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగింది. కేకేఎర్ తరఫున ఓపెనింగ్ చేసిన బ్రెండన్ మెక్కల్లమ్(కివీస్ మాజీ క్రికెటర్).. టోర్నీ చరిత్రలోనే గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 158 పరుగులతో అజేయంగా నిలిచాడు. లీగ్ ప్రారంభమై 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, మళ్లీ ఆ జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు.
"ఆరోజు జరిగిన విషయాలు చాలావరకు గుర్తులేవు. కానీ గంగూలీ చెప్పిన మాటలు మాత్రం ఇప్పటికీ గుర్తండిపోయాయి. 'నీ జీవితం శాశ్వతంగా మారిపోతుంది' అని దాదా, ఏ ఉద్దేశ్యంతో అన్నాడో తెలియదు గాని ఇప్పుడు నూరు శాతం అతడి మాటలతో అంగీకరిస్తున్నాను. ఫ్రాంఛైజీ యాజమాని షారుక్.. 'నువ్వు ఎప్పుడూ కేకేఆర్ సభ్యుడివే' అని అన్నాడు. కెప్టెన్గా కేకేఆర్తో కలిసి పనిచేసిన రోజుల్ని ఎంతో గొప్పగా భావిస్తాను. ఇప్పుడు జట్టు యజమాన్యం, కోచ్ బాధ్యతలు అప్పగించడం ఎంతో సంతోషంగా ఉంది. గతంలో షారుక్ చెప్పిన మాటలు మళ్లీ గుర్తొచ్చాయి. ఇది నాకు మరో గొప్ప అవకాశంగా భావిస్తున్నాను"
- బ్రెండన్ మెక్కల్లమ్, కివీస్ మాజీ ఆటగాడు
అయితే ఆ ఇన్నింగ్స్ ఆడే ముందు తాను ఎంతో ఒత్తిడిని అనుభవించినట్లు చెప్పాడు మెక్కల్లమ్. ఆ సమయంలో ఐపీఎల్ అంటే ఏంటో తమలో చాలా మందికి సరిగా తెలియదని, కానీ ఈ లీగ్ ఆలోచన నచ్చిందని తెలిపాడు. ఇందులో ఆడే అవకాశం వచ్చినందుకు ఇప్పటికీ గర్వంగా ఉంటుందని అన్నాడు. తాను ఘనతల్ని సాధించడంలో జట్టు సభ్యుల కృషి ఎంతో ఉందని వివరణ ఇచ్చాడు.
ఇదీ చూడండి : పునరావాస కేంద్రంగా ఒలింపిక్ అథ్లెట్స్ గ్రామం!