ETV Bharat / sports

స్లెడ్జింగ్​ చేస్తూ ప్రతి మ్యాచ్​ గెలవలేరు: పుజారా

author img

By

Published : Dec 13, 2020, 5:53 PM IST

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో స్లెడ్జింగ్​ గురించి పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈనెల 17న అడిలైడ్ వేదికగా భారత్​ తొలి మ్యాచ్​ ఆడనుంది. డే/నైట్ పద్ధతిలో ఈ పోరు జరగనుంది.

Sledging is overrated and irrelevant says Cheteshwar Pujara
'స్లెడ్జింగ్​ చేస్తూ ప్రతీ మ్యాచ్​ గెలవలేరు'

మ్యాచ్ జరుగుతున్నప్పుడు తనను స్లెడ్జింగ్​ చేసినా పెద్దగా పట్టించుకోనని భారత్ నయా వాల్ ఛతేశ్వర్ పుజారా అన్నాడు. స్లెడ్జింగ్​ చేసినంత మాత్రాన ప్రత్యర్థి జట్టు ప్రతి మ్యాచ్​ గెలవదని అభిప్రాయపడ్డాడు. మైదానంలో ఉన్నంత సేపు తన ధ్యాస బంతిపైనే ఉంటుందని, ఇతర ఆటగాళ్లు ఏమన్నా పట్టించుకోనని తెలిపాడు.

పుజారాకు ఎదురైన స్లెడ్జింగ్ అనుభవాలు

  • 2018-19 భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో పుజారా 1000 బంతులు ఆడాడు. ఈ పర్యటనలోని ఓ మ్యాచ్​లో ఆస్ట్రేలియా బౌలర్ లైయన్ పుజారాను ఉద్దేశిస్తూ 'అసలు నీకు బ్యాటింగ్​ అంటే బోర్​ కొట్టదా?' అని విసుక్కున్నాడు.
  • 2017లో రాంచీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో పుజారా 202 పరుగులు చేశాడు. అప్పుడు తన దగ్గరకు వచ్చిన ఆసీస్ ఆటగాళ్లు.. 'ఇప్పుడు నువ్వు ఔట్​ కాకపోతే, మేం వీల్​ ఛైర్స్ అడుగుతాం' అని ఎగతాళి చేశారు.
  • 2018-19 ఆస్ట్రేలియా సిరీస్​కు ముందు ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆసీస్ బౌలర్​ జోష్ హేజిల్​వుడ్... టీమ్​ఇండియా కెప్టెన్​పై ఒత్తిడి తెచ్చేలా మాట్లాడాడు. తమకు విరాట్​ కన్నా పుజారాను ఔట్​ చేయడమే చాలా ముఖ్యమని అన్నాడు. అయితే ఆ సిరీస్​లో 1135 బంతులు ఆడిన పుజారా.. మొత్తంగా 521 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై భారత్​ సిరీస్​ గెలవడం కూడా అదే మొదటిసారి కావడం విశేషం.

ఇదీ చదవండి:స్మిత్​కు​ కెప్టెన్సీ?.. గిల్​క్రిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు

మ్యాచ్ జరుగుతున్నప్పుడు తనను స్లెడ్జింగ్​ చేసినా పెద్దగా పట్టించుకోనని భారత్ నయా వాల్ ఛతేశ్వర్ పుజారా అన్నాడు. స్లెడ్జింగ్​ చేసినంత మాత్రాన ప్రత్యర్థి జట్టు ప్రతి మ్యాచ్​ గెలవదని అభిప్రాయపడ్డాడు. మైదానంలో ఉన్నంత సేపు తన ధ్యాస బంతిపైనే ఉంటుందని, ఇతర ఆటగాళ్లు ఏమన్నా పట్టించుకోనని తెలిపాడు.

పుజారాకు ఎదురైన స్లెడ్జింగ్ అనుభవాలు

  • 2018-19 భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో పుజారా 1000 బంతులు ఆడాడు. ఈ పర్యటనలోని ఓ మ్యాచ్​లో ఆస్ట్రేలియా బౌలర్ లైయన్ పుజారాను ఉద్దేశిస్తూ 'అసలు నీకు బ్యాటింగ్​ అంటే బోర్​ కొట్టదా?' అని విసుక్కున్నాడు.
  • 2017లో రాంచీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో పుజారా 202 పరుగులు చేశాడు. అప్పుడు తన దగ్గరకు వచ్చిన ఆసీస్ ఆటగాళ్లు.. 'ఇప్పుడు నువ్వు ఔట్​ కాకపోతే, మేం వీల్​ ఛైర్స్ అడుగుతాం' అని ఎగతాళి చేశారు.
  • 2018-19 ఆస్ట్రేలియా సిరీస్​కు ముందు ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆసీస్ బౌలర్​ జోష్ హేజిల్​వుడ్... టీమ్​ఇండియా కెప్టెన్​పై ఒత్తిడి తెచ్చేలా మాట్లాడాడు. తమకు విరాట్​ కన్నా పుజారాను ఔట్​ చేయడమే చాలా ముఖ్యమని అన్నాడు. అయితే ఆ సిరీస్​లో 1135 బంతులు ఆడిన పుజారా.. మొత్తంగా 521 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై భారత్​ సిరీస్​ గెలవడం కూడా అదే మొదటిసారి కావడం విశేషం.

ఇదీ చదవండి:స్మిత్​కు​ కెప్టెన్సీ?.. గిల్​క్రిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.