దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ దూరమైంది. ఐదో వన్డే ఆడుతూ గాయపడ్డ ఆమె.. మొదటి టీ20 మ్యాచ్కు అందుబాటులో ఉండదని వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ శనివారం ప్రారంభం కానుంది.
'సౌతాఫ్రికాతో తొలి టీ20కి హర్మన్ప్రీత్ అందుబాటులో ఉండట్లేదు. తదుపరి వివరాలు వైద్యబృందం సూచన మేరకు వెల్లడిస్తాం' అని మంధాన పేర్కొంది.
ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ను 1-4 తేడాతో కోల్పోయింది ఆతిథ్య భారత జట్టు. దీనిపై స్పందించిన మంధాన.. ప్రస్తుత పొట్టి సిరీస్పైనే తాము దృష్టి సారించామని తెలిపింది. "వన్డే సిరీస్ సంతృప్తికరంగా సాగలేదు. దాని గురించి మరచిపోవడానికి ప్రయత్నిస్తాం. టీ20 సిరీస్ కోసం కొత్త ప్లేయర్లు జట్టులోకి వచ్చారు. కాబట్టి తాజాగా ఆలోచించాలి" అని వైస్ కెప్టెన్ వెల్లడించింది.
ఇదీ చదవండి: డిస్కస్ త్రోలో జాతీయ రికార్డుతో ఒలింపిక్స్కు మరో అథ్లెట్