ETV Bharat / sports

'చిన్న బంతికి ఓకే.. కానీ, షార్ట్​పిచ్​ అయితే కష్టం'

మహిళల క్రికెట్​కు మరింత ఆకర్షణ తీసుకురావడానికి కొత్త రూల్స్​ను ప్రవేశపెట్టాలనే సూచనలు వస్తున్నాయి. అందులో బంతి పరిమాణాన్ని తగ్గించడం సహా చిన్న పిచ్​ల్లో మ్యాచ్​లు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి అర్ధరహిత నిర్ణయాల కంటే మహిళల క్రికెట్​పై మరింత ప్రచారంతో ఎక్కువ మంది ప్రేక్షకులను స్టేడియానికి రప్పించవచ్చని అభిప్రాయపడింది టీమ్​ఇండియా బౌలర్​ శిఖా పాండే.

author img

By

Published : Jun 28, 2020, 5:06 PM IST

Shikha Pandey says women's cricket needs marketing & investment
'చిన్న బంతికి ఓకే.. కానీ, షార్ట్​పిచ్​ అయితే కష్టం'

మహిళల క్రికెట్​లో కొత్త రూల్స్​కు బదులుగా ప్రచారంతో అభిమానులను మరింతగా స్టేడియాలకు రప్పించవచ్చని అభిప్రాయపడింది టీమ్​ఇండియా బౌలర్ శిఖా పాండే. ఇప్పటికే ఉమెన్స్​ గేమ్​లో చిన్న బంతిని ప్రవేశపెట్టడం సహా పిచ్​ పరిమాణం తగ్గించి మ్యాచ్​లు నిర్వహించాలన్న సూచనలు వెల్లువెత్తుతున్నాయి. దీని ద్వారా మహిళల మ్యాచ్​లకు మరింత ప్రేక్షకాదరణ ఉంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై తాజాగా ట్విట్టర్​లో స్పందించింది శిఖా పాండే.

  • I have been reading/ hearing a lot about the changes being suggested to help grow women's cricket/ make it a more attractive product. I personally feel most of the suggestions to be superfluous.

    (1/n)

    — Shikha Pandey (@shikhashauny) June 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"100మీ, 400మీ వంటి ఒలింపిక్​ పరుగుపందేల్లో పురుషులు, మహిళలు ఒకే దూరం పరుగెత్తుతారు కదా! మరి క్రికెట్​లో పిచ్​ పరిధిని తగ్గించడం ఎందుకు? బంతి పరిమాణం తగ్గించడం అంగీకారమే. కానీ, సైజ్​ తగ్గినా బంతి అంతే బరువు ఉండేలా చూడాలని, అలా చేస్తేనే బౌండరీలు ఎక్కువ వచ్చే అవకాశంతో పాటు బౌలర్లకు గ్రిప్​ సహకరిస్తుందని ఇయాన్ ​స్మిత్​ తెలిపాడు. మహిళల మ్యాచ్​ల్లో వృద్ధి కావాలంటే తగిన ప్రచారం అవసరం. కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడం వల్ల ప్రేక్షకులను ఆకర్షించలేం".

- శిఖా పాండే, టీమ్​ఇండియా బౌలర్​

Shikha Pandey says women's cricket needs marketing & investment
టీమ్​ఇండియా బౌలర్​ శిఖా పాండే

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్​లో ఆసీస్​తో జరిగిన​ ఫైనల్​లో భారత్ తలపడింది. ఆ మ్యాచ్​ను చూడటానికి ఏకంగా 86,174 మంది వీక్షకులు హాజరయ్యారు. ఆ మ్యాచ్​లో భారత్​పై ఆసీస్​ విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది.

Shikha Pandey says women's cricket needs marketing & investment
న్యూజిలాండ్​ కెప్టెన్​ సోఫీ డెవిన్

కచ్చితంగా మార్పు వస్తుంది

మహిళల క్రికెట్​లో చిన్న బంతిని ప్రవేశపెట్టడం వల్ల ఎక్కువ షాట్లు కొట్టడానికి వీలవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది న్యూజిలాండ్​ కెప్టెన్​ సోఫీ డెవిన్​. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్​లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​ఉమెన్​గా సోఫీ​ నిలిచింది. మహిళల క్రికెట్​లో కొత్త రూల్స్​కు మద్దతుగా నిలుస్తూ.. చిన్న బంతిని ప్రవేశపెట్టడం ద్వారా మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది డెవిన్​.

Shikha Pandey says women's cricket needs marketing & investment
టీమ్​ఇండియా బ్యాటర్​ జెమిమా రోడ్రిగ్స్

ఇది ట్రై చేయండి

పిచ్​ను తగ్గించాలనే సూచన కంటే క్రికెట్​ను మరింత వినోదాత్మకంగా మార్చడానికి మరో ఆలోచన ఉందని తెలిపింది టీమ్​ఇండియా బ్యాట్స్​ఉమెన్ జెమిమా రోడ్రిగ్స్​. షార్ట్​పిచ్​పై సన్నాహక మ్యాచ్​లను నిర్వహించి పరిశీలిస్తే దానికి వచ్చే ఆదరణ దృష్టిలో ఉంచుకుని భవిష్యత్​లో ముందుకు సాగవచ్చని వెల్లడించింది. ఈ ఆలోచనను ప్రయత్నించడంలో తప్పేముందని.. చివరికి మహిళల క్రికెట్​కు తగిన ప్రచారం కల్పిస్తూ ఎక్కువ మంది ప్రేక్షకులను రప్పించడమే అంతిమ లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేసింది రోడ్రిగ్స్.

ఇదీ చూడండి...

'డోపింగ్​, ఫిక్సింగ్​లతో సమానంగా జాతివివక్షను పరిగణించాలి'

మహిళల క్రికెట్​లో కొత్త రూల్స్​కు బదులుగా ప్రచారంతో అభిమానులను మరింతగా స్టేడియాలకు రప్పించవచ్చని అభిప్రాయపడింది టీమ్​ఇండియా బౌలర్ శిఖా పాండే. ఇప్పటికే ఉమెన్స్​ గేమ్​లో చిన్న బంతిని ప్రవేశపెట్టడం సహా పిచ్​ పరిమాణం తగ్గించి మ్యాచ్​లు నిర్వహించాలన్న సూచనలు వెల్లువెత్తుతున్నాయి. దీని ద్వారా మహిళల మ్యాచ్​లకు మరింత ప్రేక్షకాదరణ ఉంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై తాజాగా ట్విట్టర్​లో స్పందించింది శిఖా పాండే.

  • I have been reading/ hearing a lot about the changes being suggested to help grow women's cricket/ make it a more attractive product. I personally feel most of the suggestions to be superfluous.

    (1/n)

    — Shikha Pandey (@shikhashauny) June 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"100మీ, 400మీ వంటి ఒలింపిక్​ పరుగుపందేల్లో పురుషులు, మహిళలు ఒకే దూరం పరుగెత్తుతారు కదా! మరి క్రికెట్​లో పిచ్​ పరిధిని తగ్గించడం ఎందుకు? బంతి పరిమాణం తగ్గించడం అంగీకారమే. కానీ, సైజ్​ తగ్గినా బంతి అంతే బరువు ఉండేలా చూడాలని, అలా చేస్తేనే బౌండరీలు ఎక్కువ వచ్చే అవకాశంతో పాటు బౌలర్లకు గ్రిప్​ సహకరిస్తుందని ఇయాన్ ​స్మిత్​ తెలిపాడు. మహిళల మ్యాచ్​ల్లో వృద్ధి కావాలంటే తగిన ప్రచారం అవసరం. కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడం వల్ల ప్రేక్షకులను ఆకర్షించలేం".

- శిఖా పాండే, టీమ్​ఇండియా బౌలర్​

Shikha Pandey says women's cricket needs marketing & investment
టీమ్​ఇండియా బౌలర్​ శిఖా పాండే

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్​లో ఆసీస్​తో జరిగిన​ ఫైనల్​లో భారత్ తలపడింది. ఆ మ్యాచ్​ను చూడటానికి ఏకంగా 86,174 మంది వీక్షకులు హాజరయ్యారు. ఆ మ్యాచ్​లో భారత్​పై ఆసీస్​ విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది.

Shikha Pandey says women's cricket needs marketing & investment
న్యూజిలాండ్​ కెప్టెన్​ సోఫీ డెవిన్

కచ్చితంగా మార్పు వస్తుంది

మహిళల క్రికెట్​లో చిన్న బంతిని ప్రవేశపెట్టడం వల్ల ఎక్కువ షాట్లు కొట్టడానికి వీలవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది న్యూజిలాండ్​ కెప్టెన్​ సోఫీ డెవిన్​. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్​లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​ఉమెన్​గా సోఫీ​ నిలిచింది. మహిళల క్రికెట్​లో కొత్త రూల్స్​కు మద్దతుగా నిలుస్తూ.. చిన్న బంతిని ప్రవేశపెట్టడం ద్వారా మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది డెవిన్​.

Shikha Pandey says women's cricket needs marketing & investment
టీమ్​ఇండియా బ్యాటర్​ జెమిమా రోడ్రిగ్స్

ఇది ట్రై చేయండి

పిచ్​ను తగ్గించాలనే సూచన కంటే క్రికెట్​ను మరింత వినోదాత్మకంగా మార్చడానికి మరో ఆలోచన ఉందని తెలిపింది టీమ్​ఇండియా బ్యాట్స్​ఉమెన్ జెమిమా రోడ్రిగ్స్​. షార్ట్​పిచ్​పై సన్నాహక మ్యాచ్​లను నిర్వహించి పరిశీలిస్తే దానికి వచ్చే ఆదరణ దృష్టిలో ఉంచుకుని భవిష్యత్​లో ముందుకు సాగవచ్చని వెల్లడించింది. ఈ ఆలోచనను ప్రయత్నించడంలో తప్పేముందని.. చివరికి మహిళల క్రికెట్​కు తగిన ప్రచారం కల్పిస్తూ ఎక్కువ మంది ప్రేక్షకులను రప్పించడమే అంతిమ లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేసింది రోడ్రిగ్స్.

ఇదీ చూడండి...

'డోపింగ్​, ఫిక్సింగ్​లతో సమానంగా జాతివివక్షను పరిగణించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.