ETV Bharat / sports

మరో ఏడుగురు పాక్​ క్రికెటర్లకు కరోనా

author img

By

Published : Jun 23, 2020, 6:59 PM IST

Updated : Jun 23, 2020, 7:54 PM IST

Seven more Pakistan cricketers  have tested positive for COVID-19
మరో ఏడుగురు పాక్​ క్రికెటర్లకు కరోనా

19:37 June 23

ఇంగ్లాండ్​ పర్యటనకు ఎంపికైన మరో ఏడుగురు పాకిస్థాన్​ క్రికెటర్లకు కరోనా సోకినట్లు తేలింది. దీనికి సంబంధించి ఆ దేశ క్రికెట్​ బోర్డు మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. దీంతో ఆ జట్టులో మొత్తం పది మంది ఆటగాళ్లకు వైరస్​ నిర్ధరణ అయ్యింది.  

"ఒకేసారి పది మంది ఫిట్​గా ఉన్న క్రికెటర్లకు కరోనా సోకడం మామూలు విషయం కాదు. ఆటగాళ్లకే సోకితే మిగిలిన వారందరికీ సోకే అవకాశం ఉంది".

                  - వసీం ఖాన్​, పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు సీఈఓ  

వైరస్​ సోకిన్ పాక్​ ఆటగాళ్లలో.. కాషిఫ్​​ భట్టి, మహ్మద్​ హస్నైన్​, ఫఖర్​ జమాన్​​, మహ్మద్​ రిజ్వాన్​, ఇమ్రాన్​ ఖాన్​, హఫీజ్​, రియాజ్​లు ఉన్నారు. అయితే సోమవారం చేసిన కరోనా పరీక్షల్లో షాదాబ్​ ఖాన్​, హైదర్​ అలీ, హారిస్​ రవూఫ్​లకు పాజిటివ్​గా తేలింది.  

వీరితో పాటు సహాయ సిబ్బంది మలంగ్​ అలీకీ కొవిడ్​ సోకినట్లు తేలింది. వీరందరికీ జూన్​ 25న మరోసారి కరోనా టెస్ట్​లు చేస్తామని పాక్ క్రికెట్​ బోర్డు సీఈఓ వసీం ఖాన్​ వెల్లడించాడు. అయితే ఇంగ్లాండ్​తో ద్వైపాక్షిక సిరీస్​ కోసం పాకిస్థాన్​ జట్టు జూన్​ 28న వెళ్లాల్సి ఉంది.  

18:55 June 23

మరో ఏడుగురు పాక్​ క్రికెటర్లకు కరోనా

10 మంది పాకిస్థాన్​ క్రికెటర్లకు కరోనా సోకినట్లు పీసీబీ ప్రకటించింది. షాదాబ్​ ఖాన్​, హైదర్​ అలీ, హారిస్​ రవూఫ్​కు సోమవారమే కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కాగా.. ఇవాళ మరో ఏడుగురు వైరస్​ బారినపడ్డారు. మహ్మద్​ హఫీజ్​, వాహాబ్​ రియాజ్ వంటి ప్రముఖ క్రికెటర్లూ బాధితుల్లో ఉన్నారు. 

ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేముందు ఆటగాళ్లకు చేసిన టెస్టుల్లో.. వీరికి కరోనా నిర్ధరణ అయినట్లు పీసీబీ తెలిపింది. ఈ ఆటగాళ్లను ఐసోలేషన్​కు పంపించినట్లు వెల్లడించింది.

19:37 June 23

ఇంగ్లాండ్​ పర్యటనకు ఎంపికైన మరో ఏడుగురు పాకిస్థాన్​ క్రికెటర్లకు కరోనా సోకినట్లు తేలింది. దీనికి సంబంధించి ఆ దేశ క్రికెట్​ బోర్డు మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. దీంతో ఆ జట్టులో మొత్తం పది మంది ఆటగాళ్లకు వైరస్​ నిర్ధరణ అయ్యింది.  

"ఒకేసారి పది మంది ఫిట్​గా ఉన్న క్రికెటర్లకు కరోనా సోకడం మామూలు విషయం కాదు. ఆటగాళ్లకే సోకితే మిగిలిన వారందరికీ సోకే అవకాశం ఉంది".

                  - వసీం ఖాన్​, పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు సీఈఓ  

వైరస్​ సోకిన్ పాక్​ ఆటగాళ్లలో.. కాషిఫ్​​ భట్టి, మహ్మద్​ హస్నైన్​, ఫఖర్​ జమాన్​​, మహ్మద్​ రిజ్వాన్​, ఇమ్రాన్​ ఖాన్​, హఫీజ్​, రియాజ్​లు ఉన్నారు. అయితే సోమవారం చేసిన కరోనా పరీక్షల్లో షాదాబ్​ ఖాన్​, హైదర్​ అలీ, హారిస్​ రవూఫ్​లకు పాజిటివ్​గా తేలింది.  

వీరితో పాటు సహాయ సిబ్బంది మలంగ్​ అలీకీ కొవిడ్​ సోకినట్లు తేలింది. వీరందరికీ జూన్​ 25న మరోసారి కరోనా టెస్ట్​లు చేస్తామని పాక్ క్రికెట్​ బోర్డు సీఈఓ వసీం ఖాన్​ వెల్లడించాడు. అయితే ఇంగ్లాండ్​తో ద్వైపాక్షిక సిరీస్​ కోసం పాకిస్థాన్​ జట్టు జూన్​ 28న వెళ్లాల్సి ఉంది.  

18:55 June 23

మరో ఏడుగురు పాక్​ క్రికెటర్లకు కరోనా

10 మంది పాకిస్థాన్​ క్రికెటర్లకు కరోనా సోకినట్లు పీసీబీ ప్రకటించింది. షాదాబ్​ ఖాన్​, హైదర్​ అలీ, హారిస్​ రవూఫ్​కు సోమవారమే కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కాగా.. ఇవాళ మరో ఏడుగురు వైరస్​ బారినపడ్డారు. మహ్మద్​ హఫీజ్​, వాహాబ్​ రియాజ్ వంటి ప్రముఖ క్రికెటర్లూ బాధితుల్లో ఉన్నారు. 

ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేముందు ఆటగాళ్లకు చేసిన టెస్టుల్లో.. వీరికి కరోనా నిర్ధరణ అయినట్లు పీసీబీ తెలిపింది. ఈ ఆటగాళ్లను ఐసోలేషన్​కు పంపించినట్లు వెల్లడించింది.

Last Updated : Jun 23, 2020, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.