వరల్డ్కప్ ఓటమి తర్వాత బీసీసీఐ పాలక మండలి జులై 19న తొలిసారిగా సమావేశం కానుంది. ప్రపంచకప్లో టీమిండియా ఆటతీరుపై సమీక్షతో పాటు విండీస్తో సిరీస్కు ఆటగాళ్లనూ ప్రకటించనున్నారు.
ప్రపంచకప్ సెమీస్లోనే వైదొలిగిన టీమిండియా తదుపరి సిరీస్లపై దృష్టి సారించింది. ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్తో జరిగే సిరీస్ కోసం జట్టును ప్రకటించేందుకు సిద్ధమైంది బీసీసీఐ. ధోనీ కెరీర్పైనా స్పష్టత రావాల్సి ఉంది.
ప్రపంచకప్లో ధోనీ ప్రదర్శనపై విమర్శలు వస్తున్న తరుణంలో వెస్టిండీస్తో జరగబోయే సిరీస్లో ఆడతాడా లేదా అనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. మరికొన్ని రోజుల్లో రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న వార్తలూ వినిపిస్తున్నాయి.
"టీమిండియా సెలక్టర్లు జులై 19న ముంబయిలో సమావేశమవుతారు. ధోనీ ప్రపంచకప్లో బాగా ఆడాడు. ఆటలో కొనసాగాలా వద్దా అనేది ఆటగాడి వ్యక్తిగత నిర్ణయం".
-బీసీసీఐ అధికారి
వెస్టిండీస్తో జరిగే టీ20, వన్డే సిరీస్లకు కోహ్లీ, బుమ్రా విశ్రాంతి తీసుకోనున్నారు. ప్రపంచకప్ మ్యాచ్లో గాయపడ్డ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆడుతాడా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. వన్డే, టీ20లకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు.
ఇవీ చూడండి.. 'ఆ ఆరు పరుగులు అంపైర్ల తప్పిదమే'