ETV Bharat / sports

'అలా జరిగితే బౌలర్లు రోబోలు అవుతారు'

author img

By

Published : Jun 12, 2020, 8:37 AM IST

బంతిపై లాలాజలం పూయడం నిషేధిస్తే రోబోలకు బౌలర్లకు తేడా ఉండదని అభిప్రాయపడ్డాడు మాజీ బౌలర్ అక్రమ్. ఈ నిబంధన వల్ల బ్యాట్స్​మెన్​ ఎంతో లాభపడతారని అన్నాడు.

Saliva ban will make bowlers 'robots', warns Wasim Akram
'దాని వల్ల బౌలర్లు 'రోబో'లుగా మారుతారు'

బంతి మెరుపు కోసం లాలాజలాన్ని నిషేధిస్తే బౌలర్లు రోబోలుగా మారతారని ఐసీసీని హెచ్చరించాడు పాకిస్థాన్​ మాజీ బౌలర్​ వసీం అక్రమ్​. బంతిని స్వింగ్​ చేసేందుకు చెమట లేదా సలైవా బౌలర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మార్చిన నిబంధనలు బ్యాట్స్​మెన్​కు అనుకూలంగా ఉన్నాయని చెప్పాడు.

"బంతి మెరుపుకోసం లాలాజలాన్ని వినియోగాన్ని నిషేధిస్తే, బౌలర్లు రోబోలుగా మారతారు. బంతిని స్వింగ్​ చేసేందుకు నాది అదే పద్ధతే. నాకైతే ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఇది. కరోనా సంక్షోభ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ స్వింగ్​ కావడానికి, ఇక బంతి మెరుపు పోయేంతవరకు వేచిచూడక తప్పదు. కొన్ని దేశాల్లో చల్లటి వాతావరణం ఉండటం వల్ల కనీసం చెమటైనా రాదు. దీనికి ఏదో ఓ ప్రత్యామ్నాయం కావాలనుకుంటున్నా. లేదంటే వాసిలిన్ పూసినా బంతిపై గ్రిప్​ వచ్చి స్వింగ్​ అవుతుంది. కానీ, అది ఎంత వరకు ఉపయోగిస్తారనేది ప్రశ్న. జులైలో ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ టెస్టు సిరీస్​లో ఏం జరుగుతుందో చూడాలి"

-వసీం అక్రమ్​, పాకిస్థాన్​ మాజీ బౌలర్​

కరోనా ప్రభావంతో బంతిపై సలైవా పూయడాన్ని తాత్కాలికంగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఐసీసీ. ఈ వైరస్​తో బాధపడే ఆటగాడికి ప్రత్యామ్నాయాన్ని అంగీకరించడం సహా క్రికెటర్లు పాటించాల్సిన కొన్ని మార్గనిర్దేశకాలను తాజాగా విడుదల చేసింది.

ఇదీ చూడండి... శ్రీలంకతో భారత్​ పరిమిత ఓవర్ల సిరీస్​ వాయిదా

బంతి మెరుపు కోసం లాలాజలాన్ని నిషేధిస్తే బౌలర్లు రోబోలుగా మారతారని ఐసీసీని హెచ్చరించాడు పాకిస్థాన్​ మాజీ బౌలర్​ వసీం అక్రమ్​. బంతిని స్వింగ్​ చేసేందుకు చెమట లేదా సలైవా బౌలర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మార్చిన నిబంధనలు బ్యాట్స్​మెన్​కు అనుకూలంగా ఉన్నాయని చెప్పాడు.

"బంతి మెరుపుకోసం లాలాజలాన్ని వినియోగాన్ని నిషేధిస్తే, బౌలర్లు రోబోలుగా మారతారు. బంతిని స్వింగ్​ చేసేందుకు నాది అదే పద్ధతే. నాకైతే ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఇది. కరోనా సంక్షోభ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ స్వింగ్​ కావడానికి, ఇక బంతి మెరుపు పోయేంతవరకు వేచిచూడక తప్పదు. కొన్ని దేశాల్లో చల్లటి వాతావరణం ఉండటం వల్ల కనీసం చెమటైనా రాదు. దీనికి ఏదో ఓ ప్రత్యామ్నాయం కావాలనుకుంటున్నా. లేదంటే వాసిలిన్ పూసినా బంతిపై గ్రిప్​ వచ్చి స్వింగ్​ అవుతుంది. కానీ, అది ఎంత వరకు ఉపయోగిస్తారనేది ప్రశ్న. జులైలో ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ టెస్టు సిరీస్​లో ఏం జరుగుతుందో చూడాలి"

-వసీం అక్రమ్​, పాకిస్థాన్​ మాజీ బౌలర్​

కరోనా ప్రభావంతో బంతిపై సలైవా పూయడాన్ని తాత్కాలికంగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఐసీసీ. ఈ వైరస్​తో బాధపడే ఆటగాడికి ప్రత్యామ్నాయాన్ని అంగీకరించడం సహా క్రికెటర్లు పాటించాల్సిన కొన్ని మార్గనిర్దేశకాలను తాజాగా విడుదల చేసింది.

ఇదీ చూడండి... శ్రీలంకతో భారత్​ పరిమిత ఓవర్ల సిరీస్​ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.