ETV Bharat / sports

14 ఏళ్ల తర్వాత పాకిస్థాన్​ పర్యటనకు సఫారీలు - పీసీబీ

దాదాపు 14 ఏళ్ల తర్వాత పాకిస్థాన్​ పర్యటనకు దక్షిణాఫ్రికా క్రికెట్​ జట్టు సిద్ధమైంది. పాక్​ జట్టుతో టెస్టు, టీ20 సిరీస్​ ఆడేందుకు సఫారీలు రానున్నట్లు పాక్​ క్రికెట్​ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

SA to tour Pakistan first time in 14 years for two Tests and three T20Is
14 ఏళ్ల తర్వాత పాకిస్థాన్​కు సఫారీల పయనం!
author img

By

Published : Dec 9, 2020, 7:22 PM IST

ఇంగ్లాండ్​, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ కరోనా వ్యాప్తి కారణంగా ఇటీవలే​ రద్దయింది. ఈ నేపథ్యంలో సఫారీలు పాకిస్థాన్​కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత తొలిసారి పాక్​లో ఆడేందుకు సౌతాఫ్రికా ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారని పాక్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

"ఈ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు టీ20లలో పాకిస్థాన్​ తలపడనుంది. టెస్టు సిరీస్​ మొదటి మ్యాచ్​ జనవరి 26 నుంచి 30 వరకు జరగనున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు జనవరి 16న కరాచీ చేరుకుంటారు. తర్వాత మిగతా మ్యాచ్​ల నిర్వహణ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు వెళ్తారు."

- పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు.

టెస్టు సిరీస్​ తర్వాత ఫిబ్రవరి 11, 13, 14 తేదీల్లో టీ-20 సిరీస్​ నిర్వహించనున్నట్లు పాక్​ బోర్డు వెల్లడించింది. దక్షిణాఫ్రికా జట్టు చివరిసారిగా 2007లో పాకిస్థాన్​ పర్యటనకు వెళ్లింది. ఆ సిరీస్​లో 1-0తో సిరీస్​ కైవసం చేసుకుంది. 1995 నుంచి ఇప్పటివరకు ఇరుజట్లు కలిపి 11 టెస్టు సిరీస్​లు ఆడాయి. ఇందులో సఫారీలు 7 గెలవగా పాక్​​ ఒక్కదాంట్లోనే నెగ్గింది.

SA to tour Pakistan first time in 14 years for two Tests and three T20Is
బాబర్ ఆజామ్, పాకిస్థాన్ కెప్టెన్

"దక్షిణాఫ్రికా జట్టు పాక్​ పర్యటనకు రావడం ఆనందంగా ఉంది. పాకిస్థాన్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నా. ఇటీవలే పాకిస్థాన్​ సూపర్​ లీగ్​ టైటిల్​ గెలిచాం. ఈ ధీమాతో సొంత గ్రౌండ్​లో సఫారీలతో తలపడేందుకు సన్నద్దమవుతున్నాం"

-బాబర్ అజామ్, పాకిస్థాన్​ కెప్టెన్.​

పాకిస్థాన్​లో సఫారీల పర్యటన వివరాలు..

* కరాచీ వేదికగా జనవరి 26-30 మధ్య తొలి టెస్టు.

* రావల్పిండి వేదికగా ఫిబ్రవరి 4-8- రెండో టెస్టు.

* ఫిబ్రవరి 11- మొదటి టీ20 మ్యాచ్

*ఫిబ్రవరి 13- రెండో టీ20 ​

* ఫిబ్రవరి 14-మూడో టీ20

టీ-20 సిరీస్​ లాహోర్​లో జరగనుంది. ​

ఇదీ చదవండి:అందుకే ఆసీస్​పై గెలిచాం.. భారత క్రికెటర్ల వ్యాఖ్యలు

ఇంగ్లాండ్​, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ కరోనా వ్యాప్తి కారణంగా ఇటీవలే​ రద్దయింది. ఈ నేపథ్యంలో సఫారీలు పాకిస్థాన్​కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత తొలిసారి పాక్​లో ఆడేందుకు సౌతాఫ్రికా ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారని పాక్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

"ఈ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు టీ20లలో పాకిస్థాన్​ తలపడనుంది. టెస్టు సిరీస్​ మొదటి మ్యాచ్​ జనవరి 26 నుంచి 30 వరకు జరగనున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు జనవరి 16న కరాచీ చేరుకుంటారు. తర్వాత మిగతా మ్యాచ్​ల నిర్వహణ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు వెళ్తారు."

- పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు.

టెస్టు సిరీస్​ తర్వాత ఫిబ్రవరి 11, 13, 14 తేదీల్లో టీ-20 సిరీస్​ నిర్వహించనున్నట్లు పాక్​ బోర్డు వెల్లడించింది. దక్షిణాఫ్రికా జట్టు చివరిసారిగా 2007లో పాకిస్థాన్​ పర్యటనకు వెళ్లింది. ఆ సిరీస్​లో 1-0తో సిరీస్​ కైవసం చేసుకుంది. 1995 నుంచి ఇప్పటివరకు ఇరుజట్లు కలిపి 11 టెస్టు సిరీస్​లు ఆడాయి. ఇందులో సఫారీలు 7 గెలవగా పాక్​​ ఒక్కదాంట్లోనే నెగ్గింది.

SA to tour Pakistan first time in 14 years for two Tests and three T20Is
బాబర్ ఆజామ్, పాకిస్థాన్ కెప్టెన్

"దక్షిణాఫ్రికా జట్టు పాక్​ పర్యటనకు రావడం ఆనందంగా ఉంది. పాకిస్థాన్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నా. ఇటీవలే పాకిస్థాన్​ సూపర్​ లీగ్​ టైటిల్​ గెలిచాం. ఈ ధీమాతో సొంత గ్రౌండ్​లో సఫారీలతో తలపడేందుకు సన్నద్దమవుతున్నాం"

-బాబర్ అజామ్, పాకిస్థాన్​ కెప్టెన్.​

పాకిస్థాన్​లో సఫారీల పర్యటన వివరాలు..

* కరాచీ వేదికగా జనవరి 26-30 మధ్య తొలి టెస్టు.

* రావల్పిండి వేదికగా ఫిబ్రవరి 4-8- రెండో టెస్టు.

* ఫిబ్రవరి 11- మొదటి టీ20 మ్యాచ్

*ఫిబ్రవరి 13- రెండో టీ20 ​

* ఫిబ్రవరి 14-మూడో టీ20

టీ-20 సిరీస్​ లాహోర్​లో జరగనుంది. ​

ఇదీ చదవండి:అందుకే ఆసీస్​పై గెలిచాం.. భారత క్రికెటర్ల వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.