ETV Bharat / sports

100వ టెస్టులో రూట్ @100

author img

By

Published : Feb 5, 2021, 5:40 PM IST

టీమ్​ఇండియాతో జరుగుతోన్న తొలి టెస్టులో రూట్​ మరో రికార్డు సాధించాడు. 100వ టెస్టులో సెంచరీ బాదిన తొమ్మిదో క్రికెటర్​గా ఘనత సాధించాడు. సుధీర్ఘ ఫార్మాట్​లో ఇది అతడికి 20వ శతకం.

root
రూట్​

ఇంగ్లాండ్​ సారథి జో రూట్ జోరు​ మాములుగా లేదు. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్​లో డబుల్​ సెంచరీ, సెంచరీ సాధించిన అతడు.. ప్రస్తుతం టీమ్​ఇండియాతో జరుగుతోన్న తొలి టెస్టు తొలి రోజు ఆటలో మరో శతకం బాది రికార్డులకెక్కాడు. 100వ టెస్టులో శతకం బాదిన తొమ్మిదో క్రికెటర్​గా ఘనత సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో ఇది అతడికి 20వ శతకం.

అతడి కన్నా ముందు కొలిన్​ కౌడ్రె( 1968లో ఆస్ట్రేలియాపై 104), జావేద్​ మియాందాద్(1969లో భారత్​పై 145)​, గోర్డన్​ గ్రీనిడ్జ్(1990లో ఇంగ్లాండ్​పై 149)​, అలె స్టీవార్ట్(2000లో వెస్డిండీస్​పై 105)​, ఇంజమామ్​ ఉల్​ హక్( 2004లో భారత్​పై184)​ , రికీ పాంటింగ్​(2006లో దక్షిణాఫ్రికాపై 120, రెండో ఇన్నింగ్స్​లో 143), గ్రేమ్​ స్మిత్(2012లో ఇంగ్లాండ్​పై 131)​, హషీమ్​ ఆమ్లా(2017లో శ్రీలంకపై 134) ఈ ఘనతను సాధించారు.

తొలి, వందో టెస్టులో ఒకే జట్టుపై సెంచరీ చేసిన మూడో క్రికెటర్​గానూ నిలిచాడు. ​అంతకముందు భారత్​​పై వెస్డిండీస్​ మాజీ క్రికెటర్​ కార్ల్​ హూపర్​, పాకిస్థాన్​పై టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ కపిల్​ దేవ్ తమ తొలి, వందో టెస్టులో శతకాలు బాదారు.

ఈ మ్యాచు​ తొలి రోజు ఆట ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది ఇంగ్లాండ్. జో రూట్​(128*) సెంచరీ, డొమినిక్ సిబ్లే (87)​ అర్ధ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో బుమ్రా 2 , అశ్విన్​ ఓ వికెట్​ దక్కించుకున్నారు.

ఇదీ చూడండి : రూట్​ శతకం.. భారత్​పై ఇంగ్లాండ్​ ఆధిపత్యం

ఇంగ్లాండ్​ సారథి జో రూట్ జోరు​ మాములుగా లేదు. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్​లో డబుల్​ సెంచరీ, సెంచరీ సాధించిన అతడు.. ప్రస్తుతం టీమ్​ఇండియాతో జరుగుతోన్న తొలి టెస్టు తొలి రోజు ఆటలో మరో శతకం బాది రికార్డులకెక్కాడు. 100వ టెస్టులో శతకం బాదిన తొమ్మిదో క్రికెటర్​గా ఘనత సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో ఇది అతడికి 20వ శతకం.

అతడి కన్నా ముందు కొలిన్​ కౌడ్రె( 1968లో ఆస్ట్రేలియాపై 104), జావేద్​ మియాందాద్(1969లో భారత్​పై 145)​, గోర్డన్​ గ్రీనిడ్జ్(1990లో ఇంగ్లాండ్​పై 149)​, అలె స్టీవార్ట్(2000లో వెస్డిండీస్​పై 105)​, ఇంజమామ్​ ఉల్​ హక్( 2004లో భారత్​పై184)​ , రికీ పాంటింగ్​(2006లో దక్షిణాఫ్రికాపై 120, రెండో ఇన్నింగ్స్​లో 143), గ్రేమ్​ స్మిత్(2012లో ఇంగ్లాండ్​పై 131)​, హషీమ్​ ఆమ్లా(2017లో శ్రీలంకపై 134) ఈ ఘనతను సాధించారు.

తొలి, వందో టెస్టులో ఒకే జట్టుపై సెంచరీ చేసిన మూడో క్రికెటర్​గానూ నిలిచాడు. ​అంతకముందు భారత్​​పై వెస్డిండీస్​ మాజీ క్రికెటర్​ కార్ల్​ హూపర్​, పాకిస్థాన్​పై టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ కపిల్​ దేవ్ తమ తొలి, వందో టెస్టులో శతకాలు బాదారు.

ఈ మ్యాచు​ తొలి రోజు ఆట ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది ఇంగ్లాండ్. జో రూట్​(128*) సెంచరీ, డొమినిక్ సిబ్లే (87)​ అర్ధ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో బుమ్రా 2 , అశ్విన్​ ఓ వికెట్​ దక్కించుకున్నారు.

ఇదీ చూడండి : రూట్​ శతకం.. భారత్​పై ఇంగ్లాండ్​ ఆధిపత్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.