ETV Bharat / sports

వరుసగా ఎనిమిదో ఏడాది రోహిత్.. తొలిసారి కోహ్లీ!

author img

By

Published : Dec 2, 2020, 5:42 PM IST

Updated : Dec 2, 2020, 8:30 PM IST

ఈ ఏడాది కూడా వన్డేల్లో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రోహిత్​ రికార్డు సృష్టించాడు. మరోవైపు కోహ్లీ.. తొలిసారి ఒక్క సెంచరీ కూడా చేయకుండా ఏడాదిని ముగించాడు.

Rohith
రోహిత్​కు ఎనిమిదోసారి.... కోహ్లీకి మాత్రం మొదటిసారి!

ఈ ఏడాది టీమ్​ఇండియా ఆడిన వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాట్స్​మన్​గా రోహిత్​ శర్మ నిలిచాడు. ఆస్ట్రేలియా సిరీస్​కు ఎంపిక కాకపోయినా సరే హిట్​మ్యాన్​ ఈ ఘనత సాధించడం విశేషం. ఈ రికార్డు సాధించడం రోహిత్​కు వరుసగా ఇది ఎనిమిదోసారి కావడం విశేషం.

ఈ జనవరిలో ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో రోహిత్ 119 పరుగులు చేశాడు. ప్రసుత్తం ఆసీస్​తో జరిగిన వన్డే సిరీస్​లో ఒక్క భారత ఆటగాడు కూడా సెంచరీ చేయలేకపోయారు.

గత ఎనిమిదేళ్లుగా వన్డేల్లో రోహిత్..

2013 - 209 పరుగులు

2014 - 264

2015 - 150

2016 - 171*

2017 - 208*

2018 - 152

2019 - 159

2020 - 119

కోహ్లీ సెంచరీ చేయకుండానే..

2008లో అంతర్జాతీయ కెరీర్​ మొదలైనప్పటి నుంచి వన్డేల్లో ప్రతి ఏటా కనీసం ఒక సెంచరీ అయినా చేస్తూ వచ్చాడు కోహ్లీ. ఈ ఏడాది మాత్రం శతకం చేయకుండానే సీజన్​ను ముగించాడు. సంవత్సరంలో 10 కన్నా తక్కువ వన్డేలు ఆడటం కూడా ఇదే తొలిసారి.

Rohith_Kohli
విరాట్ కోహ్లీ, కెప్టెన్​

సెంచరీ చేయలేకపోయినా సరే కోహ్లీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో సచిన్​ తెందుల్కర్​కు అధిగమించాడు. 242 ఇన్నింగ్స్​ల్లోనే విరాట్ ఈ మార్క్​ను అందుకోవడం విశేషం.

ఇదీ చదవండి:టీమ్​ఇండియా తొలి విక్టరీ.. ఆసీస్​పై అద్భుత విజయం

ఈ ఏడాది టీమ్​ఇండియా ఆడిన వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాట్స్​మన్​గా రోహిత్​ శర్మ నిలిచాడు. ఆస్ట్రేలియా సిరీస్​కు ఎంపిక కాకపోయినా సరే హిట్​మ్యాన్​ ఈ ఘనత సాధించడం విశేషం. ఈ రికార్డు సాధించడం రోహిత్​కు వరుసగా ఇది ఎనిమిదోసారి కావడం విశేషం.

ఈ జనవరిలో ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో రోహిత్ 119 పరుగులు చేశాడు. ప్రసుత్తం ఆసీస్​తో జరిగిన వన్డే సిరీస్​లో ఒక్క భారత ఆటగాడు కూడా సెంచరీ చేయలేకపోయారు.

గత ఎనిమిదేళ్లుగా వన్డేల్లో రోహిత్..

2013 - 209 పరుగులు

2014 - 264

2015 - 150

2016 - 171*

2017 - 208*

2018 - 152

2019 - 159

2020 - 119

కోహ్లీ సెంచరీ చేయకుండానే..

2008లో అంతర్జాతీయ కెరీర్​ మొదలైనప్పటి నుంచి వన్డేల్లో ప్రతి ఏటా కనీసం ఒక సెంచరీ అయినా చేస్తూ వచ్చాడు కోహ్లీ. ఈ ఏడాది మాత్రం శతకం చేయకుండానే సీజన్​ను ముగించాడు. సంవత్సరంలో 10 కన్నా తక్కువ వన్డేలు ఆడటం కూడా ఇదే తొలిసారి.

Rohith_Kohli
విరాట్ కోహ్లీ, కెప్టెన్​

సెంచరీ చేయలేకపోయినా సరే కోహ్లీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో సచిన్​ తెందుల్కర్​కు అధిగమించాడు. 242 ఇన్నింగ్స్​ల్లోనే విరాట్ ఈ మార్క్​ను అందుకోవడం విశేషం.

ఇదీ చదవండి:టీమ్​ఇండియా తొలి విక్టరీ.. ఆసీస్​పై అద్భుత విజయం

Last Updated : Dec 2, 2020, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.