ETV Bharat / sports

దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​గా రిషభ్​ పంత్​

author img

By

Published : Mar 30, 2021, 8:40 PM IST

Updated : Mar 30, 2021, 9:33 PM IST

రానున్న ఐపీఎల్ సీజన్​ కోసం తమ కెప్టెన్​ను ప్రకటించింది దిల్లీ క్యాపిటల్స్​. గాయపడ్డ శ్రేయస్​ అయ్యర్​ స్థానంలో.. సారథిగా యువ బ్యాట్స్​మెన్, వికెట్​ కీపర్​ రిషభ్​ పంత్​ను నియమించింది.​

Rishabh Pant will be delhi capitals Captain for #IPL2021
దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​గా రిషభ్​ పంత్​

ఐపీఎల్​ 14వ సీజన్​ కోసం దిల్లీ క్యాపిటల్స్​ తదుపరి కెప్టెన్​ను ప్రకటించింది ఫ్రాంఛైజీ. గాయంతో లీగ్​కు దూరమైన శ్రేయస్​ అయ్యర్​ స్థానంలో యువ క్రికెటర్​ రిషభ్ పంత్​ను సారథిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

"శ్రేయస్​​ నాయకత్వంలో మా జట్టు అత్యున్నత శిఖరాలకు చేరింది. అనుకోకుండా దూరమయ్యాడు. అతడి స్థానంలో సారథిగా రిషభ్​ పంత్​ను నియమిస్తున్నాం. పంత్​కు ఇదొక సువర్ణావకాశం. అతడికి శుభాకాంక్షలు. అయ్యర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా" అని దిల్లీ ఛైర్మన్​, సహ యజమాని కిరణ్​ కుమార్​ పేర్కొన్నారు.

"గత ఆరేళ్లుగా ఈ ఫ్రాంఛైజీకి ఆడుతున్నా. ఈ జట్టుకు నాయకత్వం వహించాలనేది నా కల. అదిప్పుడు నెరవేరింది. నాపై నమ్మకముంచిన యాజమాన్యానికి కృతజ్ఞతలు."

-రిషభ్ పంత్, దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్.

తన తర్వాత సారథ్య బాధ్యతలు చేపట్టడానికి పంత్​ సరైన వ్యక్తి అని శ్రేయస్​ పేర్కొన్నాడు. దిల్లీ కెప్టెన్​గా ఎంపికైన రిషభ్​కు అభినందనలు తెలిపాడు. గతంలో దిల్లీ రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహించిన పంత్​కు​.. ఐపీఎల్​లో పగ్గాలు చేపట్టడం మాత్రం ఇదే తొలిసారి.

ఇదీ చదవండి: 'క్వారంటైన్'లో బుమ్రా సాధన​- ఆర్​సీబీ ప్రాక్టీస్​ షురూ

ఐపీఎల్​ 14వ సీజన్​ కోసం దిల్లీ క్యాపిటల్స్​ తదుపరి కెప్టెన్​ను ప్రకటించింది ఫ్రాంఛైజీ. గాయంతో లీగ్​కు దూరమైన శ్రేయస్​ అయ్యర్​ స్థానంలో యువ క్రికెటర్​ రిషభ్ పంత్​ను సారథిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

"శ్రేయస్​​ నాయకత్వంలో మా జట్టు అత్యున్నత శిఖరాలకు చేరింది. అనుకోకుండా దూరమయ్యాడు. అతడి స్థానంలో సారథిగా రిషభ్​ పంత్​ను నియమిస్తున్నాం. పంత్​కు ఇదొక సువర్ణావకాశం. అతడికి శుభాకాంక్షలు. అయ్యర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా" అని దిల్లీ ఛైర్మన్​, సహ యజమాని కిరణ్​ కుమార్​ పేర్కొన్నారు.

"గత ఆరేళ్లుగా ఈ ఫ్రాంఛైజీకి ఆడుతున్నా. ఈ జట్టుకు నాయకత్వం వహించాలనేది నా కల. అదిప్పుడు నెరవేరింది. నాపై నమ్మకముంచిన యాజమాన్యానికి కృతజ్ఞతలు."

-రిషభ్ పంత్, దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్.

తన తర్వాత సారథ్య బాధ్యతలు చేపట్టడానికి పంత్​ సరైన వ్యక్తి అని శ్రేయస్​ పేర్కొన్నాడు. దిల్లీ కెప్టెన్​గా ఎంపికైన రిషభ్​కు అభినందనలు తెలిపాడు. గతంలో దిల్లీ రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహించిన పంత్​కు​.. ఐపీఎల్​లో పగ్గాలు చేపట్టడం మాత్రం ఇదే తొలిసారి.

ఇదీ చదవండి: 'క్వారంటైన్'లో బుమ్రా సాధన​- ఆర్​సీబీ ప్రాక్టీస్​ షురూ

Last Updated : Mar 30, 2021, 9:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.