టీమ్ఇండియా ఆటగాడిగా కెరీర్కు వీడ్కోలు పలికాక ఏం చేయాలనే విషయంపై స్పష్టత లేకుండా ఇబ్బందులుపడ్డానని చెప్పారు మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. మాజీ సారథి కపిల్ దేవ్ సూచనలే తనకు ఎంతో ఉపయోగపడ్డాయని జాతీయ క్రికెట్ అకాడమీ అధ్యక్షుడు ద్రవిడ్ స్పష్టం చేశారు. భారత మహిళా జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్తో ఆన్లైన్లో ముచ్చటించిన మిస్టర్ వాల్.. ఈ విషయాన్ని వెల్లడించాడు.
"క్రికెటర్గా నా కెరీర్ ముగిసిన అనంతరం ఏం చేయాలో తొలుత పాలుపోలేదు. అప్పుడే కపిల్ దేవ్ ఒక మంచి విషయం చెప్పాడు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని.. కొన్నేళ్లు ఏదో ఒక పనిచేస్తూ నీకు ఏం నచ్చుతుందో దాని మీద ధ్యాసపెట్టమన్నారు. ఆ మాటలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి"
-ద్రవిడ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్.
తన కెరీర్ ముగింపు దశకు వచ్చేసరికే తాను రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్, కోచ్ బాధ్యతల్లో కొనసాగుతున్నానని, అదృష్టవశాత్తూ అలా కోచింగ్ కెరీర్ కొనసాగిందని స్పష్టం చేశాడు ద్రవిడ్.
అలాగే 1998లో తనను వన్డే జట్టు నుంచి తప్పించారని, స్ట్రైక్రేట్ కారణం, కారణం చెప్పకుండా తీసేయడం వల్ల తాను ఏ ఫార్మాట్లో ఆడలేమోననే అభద్రతా భావం ఏర్పడిందన్నారు ద్రవిడ్. అలా ఏడాది పాటు వన్డేల్లో ఆడలేదని చెప్పారు. సహజంగా తాను టెస్టు క్రికెటర్ అని, తనకు కోచింగ్ కూడా టెస్టు క్రికెటర్లాగే సాగిందన్నాడు. ఒకవేళ తన కెరీర్ సాఫీగా సాగకపోయుంటే ఎంబీఏ చేసేవాడినని చెప్పారు రాహుల్ ద్రవిడ్.
ఇది చూడండి : తెలుగు బాక్సర్కు రూ.5 కోట్ల నగదు ప్రోత్సాహం