ETV Bharat / sports

'రాహుల్ ఓ ఛాంపియన్ ప్లేయర్.. జట్టులో కొనసాగుతాడు'

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న టీ20 సిరీస్​లో దారుణంగా విఫలమవుతున్నాడు టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్. ఆడిన మూడు మ్యాచ్​ల్లో రెండుసార్లు డకౌట్​గా వెనుదిరిగాడు. దీంతో ఇతడి ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా రాహుల్​ బ్యాటింగ్​పై స్పందించిన సారథి కోహ్లీ.. అతడిని వెనకేసుకొచ్చాడు.

author img

By

Published : Mar 17, 2021, 9:41 AM IST

Updated : Mar 17, 2021, 11:55 AM IST

kohli
కోహ్లీ

నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది టీమ్ఇండియా. కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నా.. మిగతా బ్యాట్స్​మెన్, బౌలర్లు విఫలమవడం వల్ల ఓటమి తప్పలేదు. అయితే ఈ మ్యాచ్​తో పాటు మొదటి రెండు టీ20ల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు ఓపెనర్ కేఎల్ రాహుల్. ఇందులో రెండు డకౌట్లు ఉన్నాయి. కాగా, ఈ మ్యాచ్​ అనంతరం రాహుల్​ బ్యాటింగ్​పై స్పందించిన కోహ్లీ.. అతడిని వెనకేసుకొచ్చాడు.

"రాహుల్ ఓ ఛాంపియన్ ప్లేయర్. రోహిత్​తో పాటు టాపార్డర్​లో జట్టు ప్రధాన ఆటగాడిగా అతడు కొనసాగుతాడు. ఈ ఫార్మాట్​లో ఐదారు బంతులాడితే ఫామ్ అందుకోవచ్చు" అని తెలిపాడు కోహ్లీ.

rahul
రాహుల్

అలాగే తన ప్రదర్శనపై మాట్లాడిన విరాట్.. "జట్టుకు ఉపయోగపడని ప్రదర్శన చేయాలని ఎవరూ అనుకోరు. కొత్త బంతితో బ్యాటింగ్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. ఇంగ్లాండ్ బౌలర్లు పిచ్​ను ఉపయోగించుకుని బంతుల్ని వేశారు. నేను సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయడం అవసరమనిపించింది. అందువల్లే చివరికి మెరుగైన స్కోర్ సాధించాం" అంటూ వెల్లడించాడు.

ఈ మ్యాచ్​లో 46 బంతుల్లో 77 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు కోహ్లీ. ఫలితంగా భారత్​ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేయగలిగింది. కానీ బట్లర్ అర్ధ సెంచరీతో రెచ్చిపోవడం వల్ల ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్​లో 2-1తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టీ20 గురువారం జరగనుంది.

నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది టీమ్ఇండియా. కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నా.. మిగతా బ్యాట్స్​మెన్, బౌలర్లు విఫలమవడం వల్ల ఓటమి తప్పలేదు. అయితే ఈ మ్యాచ్​తో పాటు మొదటి రెండు టీ20ల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు ఓపెనర్ కేఎల్ రాహుల్. ఇందులో రెండు డకౌట్లు ఉన్నాయి. కాగా, ఈ మ్యాచ్​ అనంతరం రాహుల్​ బ్యాటింగ్​పై స్పందించిన కోహ్లీ.. అతడిని వెనకేసుకొచ్చాడు.

"రాహుల్ ఓ ఛాంపియన్ ప్లేయర్. రోహిత్​తో పాటు టాపార్డర్​లో జట్టు ప్రధాన ఆటగాడిగా అతడు కొనసాగుతాడు. ఈ ఫార్మాట్​లో ఐదారు బంతులాడితే ఫామ్ అందుకోవచ్చు" అని తెలిపాడు కోహ్లీ.

rahul
రాహుల్

అలాగే తన ప్రదర్శనపై మాట్లాడిన విరాట్.. "జట్టుకు ఉపయోగపడని ప్రదర్శన చేయాలని ఎవరూ అనుకోరు. కొత్త బంతితో బ్యాటింగ్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. ఇంగ్లాండ్ బౌలర్లు పిచ్​ను ఉపయోగించుకుని బంతుల్ని వేశారు. నేను సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయడం అవసరమనిపించింది. అందువల్లే చివరికి మెరుగైన స్కోర్ సాధించాం" అంటూ వెల్లడించాడు.

ఈ మ్యాచ్​లో 46 బంతుల్లో 77 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు కోహ్లీ. ఫలితంగా భారత్​ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేయగలిగింది. కానీ బట్లర్ అర్ధ సెంచరీతో రెచ్చిపోవడం వల్ల ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్​లో 2-1తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టీ20 గురువారం జరగనుంది.

Last Updated : Mar 17, 2021, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.