ETV Bharat / sports

ఐపీఎల్​ ముంగిట ఆటగాళ్ల క్వారంటైన్​పై రచ్చ

ఐపీఎల్​లో పాల్గొనాల్సిన ఇంగ్లాండ్​-ఆస్ట్రేలియా సిరీస్​లో ఆడే ఆటగాళ్లు వారం రోజులపాటు క్వారంటైన్​లో ఉండాల్సిందేనని చెప్తున్నాయి ఫ్రాంచైజీలు. ఆర్సీబీ ఛైర్మన్​ సంజీవ్​ చురివాలా సదరు ఆటగాళ్లు క్వారంటైన్​లో ఉండాల్సిన అవసరం లేదన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

author img

By

Published : Aug 22, 2020, 1:53 PM IST

Questions over quarantine:
ఐపీఎల్​ 13

ఆర్సీబీ చైర్మన్​ సంజీవ్​ చురివాలాపై మిగతా ఫ్రాంచైజీలు మండిపడ్డాయి. ఐపీఎల్​లో పాల్గొనాల్సిన.. ఇంగ్లాండ్​-ఆస్ట్రేలియా సిరీస్​లో ఆడే ఆటగాళ్లు వారం రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాల్సిన అవసరం లేదని ఆగస్టు 21న ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ప్రతిఒక్కరికీ ఒకేరకమైన నియమ నిబంధనలు వర్తించావా? అంటూ ప్రశ్నలు సంధించాయి మిగిలిన ఫ్రాంచైజీలు. ప్రతి ఆటగాడితో సహా మిగితా సిబ్బంది తప్పకుండా ఈ నిబంధనలు పాటించాల్సిందేనని ఉద్ఘాటింటాయి.

ఇంగ్లాండ్​-ఆస్ట్రేలియా మధ్య రెండు టీ20లు మూడు వన్డేలతో కూడిన సిరీస్​ సెప్టెంబరు 4 నుంచి 16 వరకు బయోసెక్యూర్ వాతవరణంలో జరగనుంది. దీనికోసం ముందుగా ఇరు జట్ల ఆటగాళ్లు క్వారంటైన్​లో​ ఉంటారు. ఈ సిరీస్​ ముగియగానే దుబాయ్​కు బయలుదేరి ఐపీఎల్​లో పాల్గొంటారు.

ఈ నేపథ్యంలో క్వారంటైన్​లో ఉండి బయో బబుల్​లో మ్యాచులు ఆడి కూడా మళ్లీ సదరు ఆటగాళ్లు క్వారంటైన్​లో ఉండాల్సిన అవసరం లేదన్నాడు సంజీవ్​. స్టార్​ ప్లేయర్లు ఆరోన్​ ఫించ్​(ఆస్ట్రేలియా), మొయిన్ అలీ(ఇంగ్లాండ్​) ఐపీఎల్​లో మొదటి మ్యాచ్​ నుంచే అందుబాటులో ఉంటారని తెలిపాడు. దీనిపై స్పందించిన మిగతా ఫ్రాంచైజీలు.. సంజీవ్​ వ్యాఖ్యలు బీసీసీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని.. ప్రతి ఆటగాడు క్వారంటైన్​లో ఉండాల్సిందేనని స్పష్టం చేశాయి.

బీసీసీఐ కచ్చితమైన నిబంధనలు..

సెప్టెంబర్​ 19న యూఏఈలో ప్రారంభంకానున్న ఐపీఎల్​ కోసం బీసీసీఐ రూపొందించిన ఎస్​ఓపీని.. అన్ని ఫ్రాంచైజీలు తప్పనిసరిగా అనుసరించనున్నాయి. దుబాయ్​లో అడుగుపెట్టగానే ఆటగాళ్లంతా ఆరు రోజులు క్వారంటైన్​లో ఉండాలి. మూడుసార్లు కొవిడ్​-19 టెస్టులు చేయించుకోవాలి. ఆ పరీక్షల్లో నెగటివ్​ వస్తేనే బయో బబుల్​లోకి ప్రవేశం కల్పిస్తారు. దాంతో పాటు ప్రతి ఐదు రోజులకు ఒకసారి ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో జట్టు ఒక్కో హోటల్​ లేదా రిసార్ట్స్​ను పూర్తిగా బుక్​ చేసుకున్నాయి. హోటల్​లో పనిచేసే మొత్తం సిబ్బందికి కరోనా పరీక్షలు చేసిన తర్వాతే బుడగలోకి అనుమతిస్తారు. బస్సు, కారు డ్రైవర్లు కూడా బయో బబుల్​ లోపలే ఉండాలి.

ఇది చూడండి భవిష్యత్ ప్రణాళికలపై గంగూలీ మాటిదే!

ఆర్సీబీ చైర్మన్​ సంజీవ్​ చురివాలాపై మిగతా ఫ్రాంచైజీలు మండిపడ్డాయి. ఐపీఎల్​లో పాల్గొనాల్సిన.. ఇంగ్లాండ్​-ఆస్ట్రేలియా సిరీస్​లో ఆడే ఆటగాళ్లు వారం రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాల్సిన అవసరం లేదని ఆగస్టు 21న ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ప్రతిఒక్కరికీ ఒకేరకమైన నియమ నిబంధనలు వర్తించావా? అంటూ ప్రశ్నలు సంధించాయి మిగిలిన ఫ్రాంచైజీలు. ప్రతి ఆటగాడితో సహా మిగితా సిబ్బంది తప్పకుండా ఈ నిబంధనలు పాటించాల్సిందేనని ఉద్ఘాటింటాయి.

ఇంగ్లాండ్​-ఆస్ట్రేలియా మధ్య రెండు టీ20లు మూడు వన్డేలతో కూడిన సిరీస్​ సెప్టెంబరు 4 నుంచి 16 వరకు బయోసెక్యూర్ వాతవరణంలో జరగనుంది. దీనికోసం ముందుగా ఇరు జట్ల ఆటగాళ్లు క్వారంటైన్​లో​ ఉంటారు. ఈ సిరీస్​ ముగియగానే దుబాయ్​కు బయలుదేరి ఐపీఎల్​లో పాల్గొంటారు.

ఈ నేపథ్యంలో క్వారంటైన్​లో ఉండి బయో బబుల్​లో మ్యాచులు ఆడి కూడా మళ్లీ సదరు ఆటగాళ్లు క్వారంటైన్​లో ఉండాల్సిన అవసరం లేదన్నాడు సంజీవ్​. స్టార్​ ప్లేయర్లు ఆరోన్​ ఫించ్​(ఆస్ట్రేలియా), మొయిన్ అలీ(ఇంగ్లాండ్​) ఐపీఎల్​లో మొదటి మ్యాచ్​ నుంచే అందుబాటులో ఉంటారని తెలిపాడు. దీనిపై స్పందించిన మిగతా ఫ్రాంచైజీలు.. సంజీవ్​ వ్యాఖ్యలు బీసీసీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని.. ప్రతి ఆటగాడు క్వారంటైన్​లో ఉండాల్సిందేనని స్పష్టం చేశాయి.

బీసీసీఐ కచ్చితమైన నిబంధనలు..

సెప్టెంబర్​ 19న యూఏఈలో ప్రారంభంకానున్న ఐపీఎల్​ కోసం బీసీసీఐ రూపొందించిన ఎస్​ఓపీని.. అన్ని ఫ్రాంచైజీలు తప్పనిసరిగా అనుసరించనున్నాయి. దుబాయ్​లో అడుగుపెట్టగానే ఆటగాళ్లంతా ఆరు రోజులు క్వారంటైన్​లో ఉండాలి. మూడుసార్లు కొవిడ్​-19 టెస్టులు చేయించుకోవాలి. ఆ పరీక్షల్లో నెగటివ్​ వస్తేనే బయో బబుల్​లోకి ప్రవేశం కల్పిస్తారు. దాంతో పాటు ప్రతి ఐదు రోజులకు ఒకసారి ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో జట్టు ఒక్కో హోటల్​ లేదా రిసార్ట్స్​ను పూర్తిగా బుక్​ చేసుకున్నాయి. హోటల్​లో పనిచేసే మొత్తం సిబ్బందికి కరోనా పరీక్షలు చేసిన తర్వాతే బుడగలోకి అనుమతిస్తారు. బస్సు, కారు డ్రైవర్లు కూడా బయో బబుల్​ లోపలే ఉండాలి.

ఇది చూడండి భవిష్యత్ ప్రణాళికలపై గంగూలీ మాటిదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.