ETV Bharat / sports

'అతడు క్రీజులో ఉంటే మాకు తలనొప్పి తప్పదు'

టెస్టుల్లో ప్రస్తుతం అత్యుత్తమ బ్యాట్స్​మన్ ఎవరో చెప్పాడు ఆసీస్ బౌలర్ కమిన్స్. అతడు క్రీజులో ఉంటే తమ జట్టుకు తలనొప్పి తప్పదని, ఔట్ చేయడం చాలా కష్టమని అన్నాడు.

author img

By

Published : Apr 26, 2020, 3:33 PM IST

'అతడు క్రీజులో ఉంటే మాకు తలనొప్పే'
కమిన్స్ పుజారా

టీమిండియాకు చెందిన చతేశ్వర్​ పుజారా.. తాను ఎదుర్కొన్న అత్యంత కష్టమైన టెస్టు బ్యాట్స్​మన్ అని చెప్పాడు ప్రపంచ నంబర్.1 బౌలర్ ప్యాట్ కమిన్స్. క్రీజులో ఉంటే అతడ్ని ఔట్ చేయడం చాలా కష్టమని, తమకు తలనొప్పిగా మారతాడని అన్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్​తో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని వెల్లడించాడు.

"ఎంతోమంది బ్యాట్స్​మెన్​ను చూశాను. అందరిలోనూ డిఫరెంట్ అంటే పుజారానే. అతడు క్రీజులో ఉంటే మాకు తలనొప్పి తప్పదు. ఎంతో ఏకాగ్రతతో బ్యాటింగ్ చేస్తాడు. ప్రస్తుత టెస్టు క్రికెట్​లో అతడో గొప్ప ఆటగాడు" -ప్యాట్ కమిన్స్, ఆసీస్ బౌలర్

2018-19లో ఆస్ట్రేలియాలో పర్యటించిన కోహ్లీసేన.. 71 ఏళ్ల చరిత్రలో కంగారూ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇందులో అద్భుతంగా ఆడిన పుజారా.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్​గా నిలిచాడు.

టీమిండియాకు చెందిన చతేశ్వర్​ పుజారా.. తాను ఎదుర్కొన్న అత్యంత కష్టమైన టెస్టు బ్యాట్స్​మన్ అని చెప్పాడు ప్రపంచ నంబర్.1 బౌలర్ ప్యాట్ కమిన్స్. క్రీజులో ఉంటే అతడ్ని ఔట్ చేయడం చాలా కష్టమని, తమకు తలనొప్పిగా మారతాడని అన్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్​తో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని వెల్లడించాడు.

"ఎంతోమంది బ్యాట్స్​మెన్​ను చూశాను. అందరిలోనూ డిఫరెంట్ అంటే పుజారానే. అతడు క్రీజులో ఉంటే మాకు తలనొప్పి తప్పదు. ఎంతో ఏకాగ్రతతో బ్యాటింగ్ చేస్తాడు. ప్రస్తుత టెస్టు క్రికెట్​లో అతడో గొప్ప ఆటగాడు" -ప్యాట్ కమిన్స్, ఆసీస్ బౌలర్

2018-19లో ఆస్ట్రేలియాలో పర్యటించిన కోహ్లీసేన.. 71 ఏళ్ల చరిత్రలో కంగారూ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇందులో అద్భుతంగా ఆడిన పుజారా.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్​గా నిలిచాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.