ETV Bharat / sports

ఆ రోజు గదిలోకి వెళ్లి ఏడ్చేశా: పృథ్వీషా

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమ్ఇండియా ఆడిన తొలిటెస్టులో తన ప్రదర్శనపై బ్యాట్స్​మన్​ పృథ్వీషా స్పందించాడు. ఆ పర్యటన తర్వాత ఏమీ అర్థంకాని పరిస్థితికి తాను చేరుకున్నట్లు వెల్లడించాడు. అప్పుడు గదిలోకి వెళ్లి ఒంటరిగా ఏడ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

author img

By

Published : Mar 12, 2021, 6:01 PM IST

Updated : Mar 12, 2021, 6:45 PM IST

Prithvi Shaw opens up about Australia tour
ఆ రోజు గదిలోకి వెళ్లి ఏడ్చేశా: పృథ్వీషా

ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఏమీ అర్థంకాని పరిస్థితికి చేరుకున్నానని టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీషా అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్‌హజారె ట్రోఫీలో అత్యధికంగా 754 పరుగులు చేసిన పృథ్వీషా.. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో (0, 4) విఫలమైన పృథ్వీని టీమ్‌ఇండియా తర్వాతి టెస్టులకు దూరంపెట్టింది. ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారనే ప్రశ్నకు సమాధానమిచ్చాడు.

"అప్పుడు నేను చాలా ఆందోళనకు గురయ్యా. ఏం జరుగుతోందని నన్ను నేను ప్రశ్నించుకున్నా. నా బ్యాటింగ్‌లో లోపాలుంటే.. అవేంటని ఆలోచించా. అయితే, పింక్‌బాల్‌ టెస్టులో ప్రపంచంలోనే మేటి జట్టుతో ఆడానని నాకు నేను సర్దిచెప్పుకున్నా. ఆ మ్యాచ్‌లో నేనెందుకు బౌల్డ్‌ అయ్యానని ప్రశ్నించుకున్నా. అద్దం ముందు నిల్చొని అందరూ అనుకున్నంత చెత్త ఆటగాడిని మాత్రం కాదని భావించా. ఆ సిరీస్‌లో జట్టు గెలిచినందుకు సంతోషంగా ఉన్నా నన్ను పక్కన పెట్టడం వల్ల ఆందోళన చెందా. అదే నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు. ఆరోజు గదిలోకెళ్లి ఏడ్చేశాను. ఏదో జరుగుతుందని అనిపించింది."

- పృథ్వీషా, టీమ్ఇండియా యువ బ్యాట్స్​మన్​

అయితే, ఆ పర్యటన తర్వాత విజయ్‌ హజారె ట్రోఫీలో ఆడుతున్న పృథ్వీ.. ముంబయి కెప్టెన్‌గా చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలోనే మూడు సెంచరీలతో పాటు ఒక ద్విశతకం సాధించి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దాంతో మూడేళ్ల క్రితం ఇదే టోర్నీలో కర్ణాటక బ్యాట్స్‌మన్‌గా మయాంక్‌ అగర్వాల్‌ సాధించిన 723 అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. ఇక ఈ సీజన్‌లో ముంబయి గురువారం కర్ణాటక జట్టును ఓడించి ఫైనల్‌కు చేరింది. ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌తో ఫైనల్లో తలపడనుంది. పృథ్వీ మరోసారి ఇక్కడ చెలరేగితే ముంబయికి కప్పు అందించడం ఖాయం.

ఇదీ చూడండి: టీ20 సిరీస్​కు ప్రేక్షకుల అనుమతి.. కానీ!

ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఏమీ అర్థంకాని పరిస్థితికి చేరుకున్నానని టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీషా అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్‌హజారె ట్రోఫీలో అత్యధికంగా 754 పరుగులు చేసిన పృథ్వీషా.. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో (0, 4) విఫలమైన పృథ్వీని టీమ్‌ఇండియా తర్వాతి టెస్టులకు దూరంపెట్టింది. ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారనే ప్రశ్నకు సమాధానమిచ్చాడు.

"అప్పుడు నేను చాలా ఆందోళనకు గురయ్యా. ఏం జరుగుతోందని నన్ను నేను ప్రశ్నించుకున్నా. నా బ్యాటింగ్‌లో లోపాలుంటే.. అవేంటని ఆలోచించా. అయితే, పింక్‌బాల్‌ టెస్టులో ప్రపంచంలోనే మేటి జట్టుతో ఆడానని నాకు నేను సర్దిచెప్పుకున్నా. ఆ మ్యాచ్‌లో నేనెందుకు బౌల్డ్‌ అయ్యానని ప్రశ్నించుకున్నా. అద్దం ముందు నిల్చొని అందరూ అనుకున్నంత చెత్త ఆటగాడిని మాత్రం కాదని భావించా. ఆ సిరీస్‌లో జట్టు గెలిచినందుకు సంతోషంగా ఉన్నా నన్ను పక్కన పెట్టడం వల్ల ఆందోళన చెందా. అదే నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు. ఆరోజు గదిలోకెళ్లి ఏడ్చేశాను. ఏదో జరుగుతుందని అనిపించింది."

- పృథ్వీషా, టీమ్ఇండియా యువ బ్యాట్స్​మన్​

అయితే, ఆ పర్యటన తర్వాత విజయ్‌ హజారె ట్రోఫీలో ఆడుతున్న పృథ్వీ.. ముంబయి కెప్టెన్‌గా చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలోనే మూడు సెంచరీలతో పాటు ఒక ద్విశతకం సాధించి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దాంతో మూడేళ్ల క్రితం ఇదే టోర్నీలో కర్ణాటక బ్యాట్స్‌మన్‌గా మయాంక్‌ అగర్వాల్‌ సాధించిన 723 అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. ఇక ఈ సీజన్‌లో ముంబయి గురువారం కర్ణాటక జట్టును ఓడించి ఫైనల్‌కు చేరింది. ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌తో ఫైనల్లో తలపడనుంది. పృథ్వీ మరోసారి ఇక్కడ చెలరేగితే ముంబయికి కప్పు అందించడం ఖాయం.

ఇదీ చూడండి: టీ20 సిరీస్​కు ప్రేక్షకుల అనుమతి.. కానీ!

Last Updated : Mar 12, 2021, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.