ETV Bharat / sports

ఆసియాకప్​: తటస్థ వేదికకు పాక్ గ్రీన్ సిగ్నల్​

author img

By

Published : Mar 7, 2020, 5:47 PM IST

ఆసియాకప్​ను దుబాయ్​ వేదికగా నిర్వహించాలన్న బీసీసీఐ ఛైర్మన్​ సౌరభ్​ గంగూలీ వ్యాఖ్యలను పాక్షికంగా అంగీకరించింది పాక్​ క్రికెట్​ బోర్డు. ఇరుజట్లకు అంగీకారమైన వేదిక ఎంపికపై త్వరలో జరిగే ఆసియా క్రికెట్​ కౌన్సిల్​ సమావేశంలో స్పష్టత రానుందని ప్రకటించింది.

PCB chief Mani admits Asia Cup will be held at neutral venue
ఆసియాకప్​ను తటస్థ వేదికలో నిర్వహించనున్న పాక్​

ఈ ఏడాది సెప్టెంబరులో​ దుబాయ్​ వేదికగా ఆసియాకప్ జరుగుతుందని.. భారత్​, పాక్​ జట్లు అందులో పాల్గొంటాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ ఇటీవల అన్నాడు. తాజాగా పాక్​ అందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​ ఎహ్సాన్​ మణి తెలిపాడు.

"ఆసియా క్రికెట్​ కౌన్సిల్​లోని సభ్యుల నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. పాకిస్థాన్​లో ఆడటానికి భారత్​ సుముఖత చూపించనందున.. ఇరుజట్లకు ఆమోదయోగ్యమైన వేదికను ఏర్పాటు చేయడానికి త్వరలో జరిగే కౌన్సిల్​ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. అయితే ఈ టోర్నీని దుబాయ్​ లేదా బంగ్లాదేశ్​లో నిర్వాహిస్తారా అనే అంశంపై స్పష్టత లేదు."

- ఎహ్సన్​ మణి, పాక్​ క్రికెట్​ బోర్డు అధ్యక్షుడు

పాకిస్థాన్ వేదికగా ఈ సెప్టెంబరులో ఆసియాకప్​ జరగాల్సి ఉంది. భద్రతా కారణాల వల్ల కోహ్లీసేన.. ఆ దేశానికి వెళ్లేందుకు నిరాకరించింది. అందువల్ల తటస్థ వేదికలో ఈ టోర్నీని నిర్వహించాలని ఐసీసీ భావించింది. ఈ నెల 3న దుబాయ్​లో జరగాల్సిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం కరోనా వైరస్​ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. మళ్లీ ఈ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టత రాలేదు.

2012లో భారత్-పాక్ మధ్య చివరగా మ్యాచ్​ జరిగింది. ఆ తర్వాత నుంచి ఒక్క పరిమిత ఓవర్ల సిరీస్​ కూడా ఈ రెండు జట్ల మధ్య వీలుపడలేదు.

ఇదీ చూడండి.. 'ఆసియాకప్ దుబాయ్​లోనా​.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు'

ఈ ఏడాది సెప్టెంబరులో​ దుబాయ్​ వేదికగా ఆసియాకప్ జరుగుతుందని.. భారత్​, పాక్​ జట్లు అందులో పాల్గొంటాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ ఇటీవల అన్నాడు. తాజాగా పాక్​ అందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​ ఎహ్సాన్​ మణి తెలిపాడు.

"ఆసియా క్రికెట్​ కౌన్సిల్​లోని సభ్యుల నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. పాకిస్థాన్​లో ఆడటానికి భారత్​ సుముఖత చూపించనందున.. ఇరుజట్లకు ఆమోదయోగ్యమైన వేదికను ఏర్పాటు చేయడానికి త్వరలో జరిగే కౌన్సిల్​ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. అయితే ఈ టోర్నీని దుబాయ్​ లేదా బంగ్లాదేశ్​లో నిర్వాహిస్తారా అనే అంశంపై స్పష్టత లేదు."

- ఎహ్సన్​ మణి, పాక్​ క్రికెట్​ బోర్డు అధ్యక్షుడు

పాకిస్థాన్ వేదికగా ఈ సెప్టెంబరులో ఆసియాకప్​ జరగాల్సి ఉంది. భద్రతా కారణాల వల్ల కోహ్లీసేన.. ఆ దేశానికి వెళ్లేందుకు నిరాకరించింది. అందువల్ల తటస్థ వేదికలో ఈ టోర్నీని నిర్వహించాలని ఐసీసీ భావించింది. ఈ నెల 3న దుబాయ్​లో జరగాల్సిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం కరోనా వైరస్​ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. మళ్లీ ఈ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టత రాలేదు.

2012లో భారత్-పాక్ మధ్య చివరగా మ్యాచ్​ జరిగింది. ఆ తర్వాత నుంచి ఒక్క పరిమిత ఓవర్ల సిరీస్​ కూడా ఈ రెండు జట్ల మధ్య వీలుపడలేదు.

ఇదీ చూడండి.. 'ఆసియాకప్ దుబాయ్​లోనా​.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.