రానున్న రోజుల్లో రిషభ్ పంత్ అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ఆటగాడిగా నిలుస్తాడని భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నారు. ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టులో శతకం చేసిన నేపథ్యంలో పంత్ను ట్విటర్ వేదికగా ప్రశంసించాడు.
"పంత్ ఎంతో చక్కగా ఆడాడు. ఒత్తిడిలోనూ సెంచరీ చేశాడు. రానున్న రోజుల్లో అన్ని ఫార్మాట్లలో గొప్ప ఆటగాడిగా నిలుస్తాడు. ఇదే జోరుతో ఆట కొనసాగించాలి."
-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ శతకం చేశాడు. 118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. సిక్సర్తో శతకం సాధించి ఆ వెంటనే అండర్సన్ బౌలింగ్లో రూట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఇదీ చదవండి:రెండో టెస్టులో పట్టుబిగించిన భారత్.. 294/7