ETV Bharat / sports

'ధోనితో పోలిస్తే గంగూలీ ఆ విషయంలో ఉత్తమం'

author img

By

Published : Jul 19, 2020, 8:03 PM IST

ధోనీతో పోలిస్తే సౌరభ్ గంగూలీ నాయకత్వం టీమ్​ఇండియాపై ఎక్కువ ప్రభావం చూపిందని అన్నాడు భారత క్రికెటర్​ పార్థివ్​ పటేల్​. కెప్టెన్​గా మహీ మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించినా.. ఆందోళనలో ఉన్న జట్టును తిరిగి నిర్మించడంలో గంగూలీ ప్రధానపాత్ర వహించాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

One has lot of trophies, other built the team: Parthiv Patel opines on Sourav Ganguly vs MS Dhoni debate
'ధోనితో పోలిస్తే గంగూలీ ఆ విషయంలో ఉత్తమం'

టీమ్​ఇండియాకు కెప్టెన్​గా ధోనీ మూడు ఐసీసీ ట్రోఫీలు తెచ్చినా.. సౌరభ్ గంగూలీ నాయకత్వం జట్టుపై అత్యంత ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డాడు భారత క్రికెటర్​ పార్థివ్​ పటేల్​. భారత క్రికెట్​ గందరగోళంలో ఉన్నప్పుడు గంగూలీ జట్టు పగ్గాలు స్వీకరించి టీమ్​ను గాడిలో పెట్టాడని తాజాగా ఓ ఇంటర్వ్యులో తెలిపాడు. ధోనీ గురించి మాట్లాడాలంటే కేవలం మూడు ట్రోఫీలు మాత్రమేనని వెల్లడించాడు.

"ధోనీ, గంగూలీల మధ్య పోటీ చెల్లుతుంది. వీరిలో ఒక కెప్టెన్​ చాలా ట్రోఫీలు సాధించగా.. మరొకరు జట్టును పూర్తిస్థాయిలో నిర్మాణం చేయడంలో పాటుపడ్డారు. 2000లో సౌరభ్​ గంగూలీ సారథి అయినప్పుడు టీమ్​ఇండియా చాలా కష్టాల్లో ఉంది. అంతకుముందు టోర్నీల్లో సరిగా ప్రదర్శన చేయలేకపోయినా.. దాదా వచ్చిన తర్వాత విదేశాల్లో జట్టు రాణించగలిగింది. ఆస్ట్రేలియాపై టెస్టు మ్యాచ్​లు గెలిచాం. ఆ తర్వాత పాకిస్థాన్​పై కూడా టెస్టు సిరీస్​ నెగ్గాం. 2003 ప్రపంచకప్​లో భారత్​ ఫైనల్​కు చేరుతుందని ఎవరూ ఊహించలేదు."

-పార్థివ్​ పటేల్​, భారత క్రికెటర్​

"ధోనీ గురించి చెప్పాలంటే అతని నాయకత్వంలో మూడు ట్రోఫీలు ఉన్నా... జట్టును తీర్చిదిద్దిన ఘనత గంగూలీకే చెందుతుంది. ఎందుకంటే అతను జట్టును సమగ్రంగా తీర్చిదిద్దడంలో పాటు పడ్డాడు" అని పార్థివ్​ పటేల్​ వెల్లడించాడు.

టీమ్​ఇండియాకు కెప్టెన్​గా ధోనీ మూడు ఐసీసీ ట్రోఫీలు తెచ్చినా.. సౌరభ్ గంగూలీ నాయకత్వం జట్టుపై అత్యంత ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డాడు భారత క్రికెటర్​ పార్థివ్​ పటేల్​. భారత క్రికెట్​ గందరగోళంలో ఉన్నప్పుడు గంగూలీ జట్టు పగ్గాలు స్వీకరించి టీమ్​ను గాడిలో పెట్టాడని తాజాగా ఓ ఇంటర్వ్యులో తెలిపాడు. ధోనీ గురించి మాట్లాడాలంటే కేవలం మూడు ట్రోఫీలు మాత్రమేనని వెల్లడించాడు.

"ధోనీ, గంగూలీల మధ్య పోటీ చెల్లుతుంది. వీరిలో ఒక కెప్టెన్​ చాలా ట్రోఫీలు సాధించగా.. మరొకరు జట్టును పూర్తిస్థాయిలో నిర్మాణం చేయడంలో పాటుపడ్డారు. 2000లో సౌరభ్​ గంగూలీ సారథి అయినప్పుడు టీమ్​ఇండియా చాలా కష్టాల్లో ఉంది. అంతకుముందు టోర్నీల్లో సరిగా ప్రదర్శన చేయలేకపోయినా.. దాదా వచ్చిన తర్వాత విదేశాల్లో జట్టు రాణించగలిగింది. ఆస్ట్రేలియాపై టెస్టు మ్యాచ్​లు గెలిచాం. ఆ తర్వాత పాకిస్థాన్​పై కూడా టెస్టు సిరీస్​ నెగ్గాం. 2003 ప్రపంచకప్​లో భారత్​ ఫైనల్​కు చేరుతుందని ఎవరూ ఊహించలేదు."

-పార్థివ్​ పటేల్​, భారత క్రికెటర్​

"ధోనీ గురించి చెప్పాలంటే అతని నాయకత్వంలో మూడు ట్రోఫీలు ఉన్నా... జట్టును తీర్చిదిద్దిన ఘనత గంగూలీకే చెందుతుంది. ఎందుకంటే అతను జట్టును సమగ్రంగా తీర్చిదిద్దడంలో పాటు పడ్డాడు" అని పార్థివ్​ పటేల్​ వెల్లడించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.