ETV Bharat / sports

తొలి సెంచరీ కోసం ఐదేళ్లు ఎదురుచూసిన సచిన్​

author img

By

Published : Sep 9, 2020, 2:21 PM IST

వన్డేల్లో తొలి శతకం కోసం దిగ్గజ సచిన్ ఐదేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. 77 వన్డేల తర్వాతే ఈ ఫార్మాట్​లో మూడంకెల స్కోరును చేయడం విశేషం.

తొలి సెంచరీ కోసం సచిన్​కు ఐదేళ్లు పట్టింది
సచిన్ తెందుల్కర్

సచిన్ తెందుల్కర్.. ఈ పేరు వినగానే లెక్కలేనన్ని రికార్డులు, క్రికెట్​లో అత్యధిక పరుగులు గుర్తొస్తాయి. కానీ వన్డేల్లో అరంగేట్రం చేసిన అతడు.. తొలి సెంచరీ చేయడానికి ఐదేళ్లు పట్టిందంటే మీరు నమ్మగలరా? అవును ఇదే రోజు(1994 సెప్టెంబరు 9).. 26 ఏళ్ల క్రితం సింగర్ సిరీస్​లో భాగంగా ఆస్ట్రేలియాపై తొలి శతకం నమోదు చేశాడు మాస్టర్.

కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్​. అది సచిన్ 78వ వన్డే. తొలుత టీమ్​ఇండియా బ్యాటింగ్. ఓపెనర్​గా వచ్చిన సచిన్, క్రీజులో బలంగా పాతుకుపోయాడు. మిగతా క్రికెటర్లందరూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్​కు పంపించేసిన ఆసీస్ బౌలర్లు.. మాస్టర్​ను​ మాత్రం త్వరగా ఔట్​ చేయలేకపోయారు. ఎట్టకేలకు 110 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడి​ వికెట్​ తీయగలిగారు.

ఈ మ్యాచ్​లో సచిన్ (110), కాంబ్లీ (43) భాగస్వామ్యంతో టీమ్​ఇండియా, నిర్ణీత 50 ఓవర్లలో 246 పరుగులు చేసింది. ఛేదనలో ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 215 పరుగులకే కుప్పకూలింది.

On this day: Sachin Tendulkar ended five-year wait to slam first ODI ton in 1994
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్​లోని దృశ్యం

భారత బౌలర్లలో ప్రభాకర్ కేవలం 34 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టాడు. రాజేశ్ చౌహాన్ రెండు వికెట్లు, కపిల్ దేవ్, రాజా, కుంబ్లే తలో వికెట్‌ తీశారు. అలా వన్డేల్లో తొలి శతకం కొట్టిన సచిన్.. అదే మ్యాచ్​లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​నూ అందుకున్నాడు.

అనంతరం సిరీస్​లో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మరోవైపు శ్రీలంక.. పాకిస్థాన్, ఆసీస్‌లను ఓడించింది. చివరికి భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ కూడా వర్షం కారణంగా 25 ఓవర్లకే కుదించారు. ఇందులో శ్రీలంక 98 పరుగులు చేయగా, అజారుద్దీన్ సేన ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తొలి సెంచరీ టీమ్​ఇండియాకు ట్రోఫీని తెచ్చిపెట్టింది. అందువల్ల సెప్టెంబర్ 9.. సచిన్​కు, అతడి అభిమానులకు, భారత క్రికెట్​కు మరువలేని రోజుగా మిగిలిపోయింది.

On this day: Sachin Tendulkar ended five-year wait to slam first ODI ton in 1994
19 ఏళ్ల వయసులో సచిన్ తెందుల్కర్

సచిన్ తెందుల్కర్.. ఈ పేరు వినగానే లెక్కలేనన్ని రికార్డులు, క్రికెట్​లో అత్యధిక పరుగులు గుర్తొస్తాయి. కానీ వన్డేల్లో అరంగేట్రం చేసిన అతడు.. తొలి సెంచరీ చేయడానికి ఐదేళ్లు పట్టిందంటే మీరు నమ్మగలరా? అవును ఇదే రోజు(1994 సెప్టెంబరు 9).. 26 ఏళ్ల క్రితం సింగర్ సిరీస్​లో భాగంగా ఆస్ట్రేలియాపై తొలి శతకం నమోదు చేశాడు మాస్టర్.

కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్​. అది సచిన్ 78వ వన్డే. తొలుత టీమ్​ఇండియా బ్యాటింగ్. ఓపెనర్​గా వచ్చిన సచిన్, క్రీజులో బలంగా పాతుకుపోయాడు. మిగతా క్రికెటర్లందరూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్​కు పంపించేసిన ఆసీస్ బౌలర్లు.. మాస్టర్​ను​ మాత్రం త్వరగా ఔట్​ చేయలేకపోయారు. ఎట్టకేలకు 110 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడి​ వికెట్​ తీయగలిగారు.

ఈ మ్యాచ్​లో సచిన్ (110), కాంబ్లీ (43) భాగస్వామ్యంతో టీమ్​ఇండియా, నిర్ణీత 50 ఓవర్లలో 246 పరుగులు చేసింది. ఛేదనలో ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 215 పరుగులకే కుప్పకూలింది.

On this day: Sachin Tendulkar ended five-year wait to slam first ODI ton in 1994
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్​లోని దృశ్యం

భారత బౌలర్లలో ప్రభాకర్ కేవలం 34 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టాడు. రాజేశ్ చౌహాన్ రెండు వికెట్లు, కపిల్ దేవ్, రాజా, కుంబ్లే తలో వికెట్‌ తీశారు. అలా వన్డేల్లో తొలి శతకం కొట్టిన సచిన్.. అదే మ్యాచ్​లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​నూ అందుకున్నాడు.

అనంతరం సిరీస్​లో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మరోవైపు శ్రీలంక.. పాకిస్థాన్, ఆసీస్‌లను ఓడించింది. చివరికి భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ కూడా వర్షం కారణంగా 25 ఓవర్లకే కుదించారు. ఇందులో శ్రీలంక 98 పరుగులు చేయగా, అజారుద్దీన్ సేన ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తొలి సెంచరీ టీమ్​ఇండియాకు ట్రోఫీని తెచ్చిపెట్టింది. అందువల్ల సెప్టెంబర్ 9.. సచిన్​కు, అతడి అభిమానులకు, భారత క్రికెట్​కు మరువలేని రోజుగా మిగిలిపోయింది.

On this day: Sachin Tendulkar ended five-year wait to slam first ODI ton in 1994
19 ఏళ్ల వయసులో సచిన్ తెందుల్కర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.