భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై న్యూజిలాండ్ తాత్కాలిక నిషేధం విధించిన క్రమంలో తమ ఆటగాళ్ల భద్రతపై కీలక వ్యాఖ్యలు చేసింది ఆ దేశ క్రికెట్ సంఘం. ఐపీఎల్లో భాగంగా ప్రస్తుతం భారత్లో ఉన్న తమ ఆటగాళ్ల గురించి ఫ్రాంచైజీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. క్రికెటర్ల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.
ఇటీవల భారత్ నుంచి న్యూజిలాండ్కు వెళ్లిన 23 మంది ప్రయాణికులలో 17 మందికి వైరస్ నిర్ధరణ అయింది. దీంతో ఈ నెల 28 వరకు ప్రయాణికులను తాత్కాలికంగా నిషేధించింది న్యూజిలాండ్. అయితే ఐపీఎల్ కోసం ఇండియాలో ఉన్న ఆటగాళ్ల సంక్షేమం గురించి ఎప్పటికప్పుడు భారత్తో సంప్రదింపులు జరుపుతున్నామని కివీస్ బోర్డు తెలిపింది.
కివీస్ నుంచి కేన్ విలియమ్సన్, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ శాంటర్, కైల్ జేమీసన్, జిమ్మీ నీషమ్, టిమ్ సీఫెర్ట్, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గుసన్ లీగ్లో పాల్గొంటున్నారు. వీరి పూర్తి బాధ్యత న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుదే అని ప్రధాని జెసిండా ఆర్డర్న్ చెప్పారు.
ఇదీ చదవండి: 'చావ్లా.. జట్టుకు ఏమివ్వగలడో మాకు తెలుసు'