ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్లో భాగంగా చివరి మూడు మ్యాచ్లకు టీమ్ఇండియా సారథి కోహ్లీ దూరంకానున్న విషయమై స్పందించాడు ఆసీస్ ఆటగాడు ప్యాట్కమిన్స్. దీని వల్ల పెద్ద నష్టమేమి లేదన్నాడు. విరాట్కు ప్రత్యామ్నయంగా బాగా ఆడే ఆటగాడితో ఆ స్థానం భర్తీ అవుతుందని చెప్పాడు. కోహ్లీ ఉన్నా లేకున్నా.. నాలుగు టెస్టు మ్యాచుల ఫలితాల్లో పెద్దగా తేడా ఏమీ ఉండదని అన్నాడు.
"విరాట్ టెస్ట్ మ్యాచ్లకు దూరం కావచ్చు. కానీ ఆ స్థానం మరో గొప్ప ఆటగాడితో భర్తీ అవుతుంది. అవకాశం కోసం ఎదురుచూస్తోన్న ఏదో ఓ ఆటగాడికి జట్టులో స్థానం లభిస్తుంది. ఆ అవకాశమే అతడి కెరీర్ను మలుపు తిరిగేందుకు నాంది పలుకుతుంది. విరాట్ లేనంత మాత్రానా మ్యాచ్ ఫలితాల్లో పెద్దగా తేడా కూడా ఉండదు. 2018లో భారత్ మా గడ్డపై అద్భుతంగా ఆడింది. ఈ సారి మేము నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా పోరు జరుగుతుంది."
-ప్యాట్ కమిన్స్, ఆస్ట్రేలియా ఆటగాడు.
నవంబరు 27 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి.
ఇదీ చూడండి : 'బ్లాక్ లైవ్స్ మేటర్'కు ఆసీస్ జట్టు మద్దతు