ETV Bharat / sports

'ఆరేళ్లలో ధోనీ కెప్టెన్సీలో చాలా మార్పులు'

కెప్టెన్సీ అందుకున్న తర్వాత ధోనీ విషయంలో చాలా మార్పులొచ్చాయని చెప్పాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. అతడిలో ప్రశాంతత అలవడిందని, బౌలర్లు తమను తాము తీర్చిదిద్దుకునేలా తయారుచేశాడని వెల్లడించాడు.

author img

By

Published : Jun 28, 2020, 11:18 AM IST

Updated : Jun 28, 2020, 12:05 PM IST

dhoni
ధోనీ

టీమ్​ఇండియాకు మహేంద్ర సింగ్​ ధోనీ కెప్టెన్​గా ఉన్నప్పుడు అతడిలో ఎలాంటి మార్పులు వచ్చాయో వెల్లడించాడు మాజీ ఆల్​రౌండర్​ ఇర్ఫాన్​ పఠాన్​. 2007లో సారథ్య బాధ్యతలు అందుకున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నాడని, 2013కు వచ్చేసరికి ప్రశాంతంగా ఆలోచించే స్వభావాన్ని అలవరుచుకున్నాడని తెలిపాడు. స్టార్​స్పోర్ట్స్​ నిర్వహించిన 'క్రికెట్ కనెక్టడ్​' కార్యక్రమంలో మాట్లాడిన పఠాన్.. మహీ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.

"2007 టీ20 ప్రపంచకప్​, 2013 ఛాంపియన్​ ట్రోఫీ జరుగుతున్నప్పుడు ప్రతిమ్యాచ్​కు ముందు ఐదునిమిషాల జట్టు సభ్యులంతా భేటీ అయ్యేవాళ్లం. అయితే ఈ ఆరేళ్ల వ్యవధిలో ధోనీ, ఓ సారథిగా వ్యవహరించే విషయంలో చాలా మార్పొచ్చింది. 2007లో తొలిసారి అతడు బాధ్యతలు అందుకున్నప్పుడు వికెట్​కీపింగ్​ నుంచి బౌలింగ్​​ వరకు ప్రతిదీ తానే చూసుకునేవాడు. కానీ 2013 వచ్చేసరికి బౌలర్లకు క్లిష్టపరిస్థితులు ఎదురైనా సరే, ఎలా ఆడాలో వారే తెలుసుకునేలా తీర్చిదిద్దాడు. సారథిగా తప్పుకునే సమయానికి చాలా కూల్​గా, కంట్రోల్​గా ఉన్నాడు"

-ఇర్ఫాన్​ పఠాన్​, టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​

కెప్టెన్​గా ఉన్న సమయంలో ధోనీ, స్పిన్నర్లపై నమ్మకం ఉంచేవాడని ఇర్పాన్ చెప్పాడు. వారికి మరిన్ని అవకాశాలిచ్చి ప్రోత్సాహించేవాడని అన్నాడు. ఇర్ఫాన్ పఠాన్.. ఈ ఏడాది ప్రారంభంలో క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ధోనీ విషయానికొస్తే గతేడాది జరిగిన ప్రపంచకప్​ సెమీస్​లో చివరగా కనిపించాడు. ఆ తర్వాత ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. ఐపీఎల్​ 13వ సీజనలో పాల్గొని తిరిగి జట్టులో చోటు దక్కించుకోవాలనుకున్నాడు. కానీ కరోనా ప్రభావంతో ఈ టోర్నీ నిరవధిక వాయిదా పడింది. మహీ కెప్టెన్సీలోనే భారత జట్టు.. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2010-2016 ఆసియాకప్​లు గెలుచుకుంది. టీమ్​ఇండియా చరిత్రలో అన్ని ఐసీసీ కప్పులు గెలుచుకున్న ఏకైక సారథి మహీనే కావడం విశేషం.

ఇది చూడండి : 'సీఎస్​కే డ్రెస్సింగ్​ రూమ్​లో ఏదో తెలియని ధైర్యం'

టీమ్​ఇండియాకు మహేంద్ర సింగ్​ ధోనీ కెప్టెన్​గా ఉన్నప్పుడు అతడిలో ఎలాంటి మార్పులు వచ్చాయో వెల్లడించాడు మాజీ ఆల్​రౌండర్​ ఇర్ఫాన్​ పఠాన్​. 2007లో సారథ్య బాధ్యతలు అందుకున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నాడని, 2013కు వచ్చేసరికి ప్రశాంతంగా ఆలోచించే స్వభావాన్ని అలవరుచుకున్నాడని తెలిపాడు. స్టార్​స్పోర్ట్స్​ నిర్వహించిన 'క్రికెట్ కనెక్టడ్​' కార్యక్రమంలో మాట్లాడిన పఠాన్.. మహీ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.

"2007 టీ20 ప్రపంచకప్​, 2013 ఛాంపియన్​ ట్రోఫీ జరుగుతున్నప్పుడు ప్రతిమ్యాచ్​కు ముందు ఐదునిమిషాల జట్టు సభ్యులంతా భేటీ అయ్యేవాళ్లం. అయితే ఈ ఆరేళ్ల వ్యవధిలో ధోనీ, ఓ సారథిగా వ్యవహరించే విషయంలో చాలా మార్పొచ్చింది. 2007లో తొలిసారి అతడు బాధ్యతలు అందుకున్నప్పుడు వికెట్​కీపింగ్​ నుంచి బౌలింగ్​​ వరకు ప్రతిదీ తానే చూసుకునేవాడు. కానీ 2013 వచ్చేసరికి బౌలర్లకు క్లిష్టపరిస్థితులు ఎదురైనా సరే, ఎలా ఆడాలో వారే తెలుసుకునేలా తీర్చిదిద్దాడు. సారథిగా తప్పుకునే సమయానికి చాలా కూల్​గా, కంట్రోల్​గా ఉన్నాడు"

-ఇర్ఫాన్​ పఠాన్​, టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​

కెప్టెన్​గా ఉన్న సమయంలో ధోనీ, స్పిన్నర్లపై నమ్మకం ఉంచేవాడని ఇర్పాన్ చెప్పాడు. వారికి మరిన్ని అవకాశాలిచ్చి ప్రోత్సాహించేవాడని అన్నాడు. ఇర్ఫాన్ పఠాన్.. ఈ ఏడాది ప్రారంభంలో క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ధోనీ విషయానికొస్తే గతేడాది జరిగిన ప్రపంచకప్​ సెమీస్​లో చివరగా కనిపించాడు. ఆ తర్వాత ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. ఐపీఎల్​ 13వ సీజనలో పాల్గొని తిరిగి జట్టులో చోటు దక్కించుకోవాలనుకున్నాడు. కానీ కరోనా ప్రభావంతో ఈ టోర్నీ నిరవధిక వాయిదా పడింది. మహీ కెప్టెన్సీలోనే భారత జట్టు.. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2010-2016 ఆసియాకప్​లు గెలుచుకుంది. టీమ్​ఇండియా చరిత్రలో అన్ని ఐసీసీ కప్పులు గెలుచుకున్న ఏకైక సారథి మహీనే కావడం విశేషం.

ఇది చూడండి : 'సీఎస్​కే డ్రెస్సింగ్​ రూమ్​లో ఏదో తెలియని ధైర్యం'

Last Updated : Jun 28, 2020, 12:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.