టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలే ప్రస్తుతం హాట్టాపిక్. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్ తర్వాత అతడు క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం తీసుకోవడమే ఇందుకు కారణం. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ఈ క్రికెటర్ ఏం చేస్తాడనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
ధోని చూపు బిలియర్డ్స్ వైపు..!
ధోనీ.. ఇటీవలే సొంతూరు రాంచీలోని ఝార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సందడి చేశాడు. బిలియర్డ్స్ ఆడుతూ కనిపించాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినా తర్వాత ఈ గేమ్ను తన కెరీర్గా ఎంచుకుంటాడేమోనని అభిమానులు అనుకుంటున్నారు.
విరామం నవంబరు వరకు..!
ప్రపంచకప్ తర్వాత వెస్టిండీస్తో సిరీస్కు అందుబాటులో ఉండనని సెలక్టర్లుకు చెప్పాడు ధోనీ. అయితే ఆ తర్వాత జరిగే దక్షిణాఫ్రికా సిరీస్కు ఈ క్రికెటర్ను ఎంపిక చేయలేదు. మహీ విరామం నవంబరు వరకు కొనసాగనుందని సమాచారం.
ఆ సిరీస్తోనే ధోనీ రీఎంట్రీ..!
డిసెంబరులో భారత్లో పర్యటించనుంది వెస్టిండీస్. ఆ సిరీస్కు అందుబాటులో రానున్నాడు మహీ. ఈ పర్యటనలో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాయి ఇరుజట్లు. డిసెంబరు 6న తొలి మ్యాచ్ జరగనుంది.
ఇవీ చదవండి: