ETV Bharat / sports

'ఐపీఎల్​ క్రికెటర్లకు రోజూ కరోనా టెస్టు చేయాలి!' - ఐపీఎల్​ క్రికెటర్స్​కు కరోనా పరీక్షలు

ఐపీఎల్​లో ఆడే ప్రతి ఒక్క క్రికెటర్​కు కరోనా నిర్ధరణ పరీక్షలు చేయాలని అభిప్రాయపడ్డాడు కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ సహ యాజమాని నెస్ వాడియా. వీలైతే బయోసెక్యూర్‌ వాతావరణంలో మ్యాచ్​లు జరపాలని సూచించాడు.

ipl
ఐపీఎల్
author img

By

Published : Jul 25, 2020, 6:21 PM IST

ఐపీఎల్‌-2020లో భాగస్వాములయ్యే క్రికెటర్లకు ప్రతి రోజూ కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహిస్తే మంచిదని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని నెస్‌ వాడియా అన్నాడు. ఒకవేళ తానే క్రికెటరైతే రోజూ పరీక్షలు చేయించుకునేందుకు ఇబ్బందిపడనని పేర్కొన్నాడు. యూఏఈలో ఎనిమిది జట్లతో బయోసెక్యూర్‌ వాతావరణానికి వీలవుతుందో లేదో చూడాలని వెల్లడించాడు.

"నేనే క్రికెటరైతే రోజూ పరీక్షలు చేయించుకోవడం నాకిష్టం. ఇందులో ఇబ్బందేమీ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో టెస్టు చేయించుకుంటే మంచిది. ఐపీఎల్‌ను సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించాలంటే మైదానంలో, మైదానం ఆవల కఠిన నిబంధనలు అమలు చేయాలి. ఇందులో రాజీ పడొద్దు. బయో సెక్యూర్‌ వాతావరణం ఏర్పాటుకు ప్రయత్నించాలి. ఎనిమిది జట్లతో అది కుదురుతుందో లేదో తెలియదు. మేమైతే బీసీసీఐ నుంచి నిర్వహణ ప్రక్రియ నిబంధనల కోసం ఎదురుచూస్తున్నాం. యూఏఈలో టెస్టింగ్‌ రేటు ఎక్కువగా ఉంది. అందుకు అవసరమైన సాంకేతికత, సామర్థ్యం వారికుంది. ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించేందుకు బీసీసీఐ స్థానిక ప్రభుత్వ సాయం తీసుకోవాలి. భారత్‌లో విమానం ఎక్కే ముందు, దుబాయ్‌లో దిగాక వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే యూఏఈ నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లో ఉండాల్సిందే."

- నెస్‌వాడియా, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని

సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 8 వరకు ఐపీఎల్​ జరగనుంది. ఆగస్టు 20లోపు జట్లన్నీ దుబాయ్‌ చేరుకొనేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇది చూడండి : కైఫ్ స్టన్నింగ్ క్యాచ్.. పాక్​పై భారత్ విజయం!

ఐపీఎల్‌-2020లో భాగస్వాములయ్యే క్రికెటర్లకు ప్రతి రోజూ కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహిస్తే మంచిదని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని నెస్‌ వాడియా అన్నాడు. ఒకవేళ తానే క్రికెటరైతే రోజూ పరీక్షలు చేయించుకునేందుకు ఇబ్బందిపడనని పేర్కొన్నాడు. యూఏఈలో ఎనిమిది జట్లతో బయోసెక్యూర్‌ వాతావరణానికి వీలవుతుందో లేదో చూడాలని వెల్లడించాడు.

"నేనే క్రికెటరైతే రోజూ పరీక్షలు చేయించుకోవడం నాకిష్టం. ఇందులో ఇబ్బందేమీ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో టెస్టు చేయించుకుంటే మంచిది. ఐపీఎల్‌ను సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించాలంటే మైదానంలో, మైదానం ఆవల కఠిన నిబంధనలు అమలు చేయాలి. ఇందులో రాజీ పడొద్దు. బయో సెక్యూర్‌ వాతావరణం ఏర్పాటుకు ప్రయత్నించాలి. ఎనిమిది జట్లతో అది కుదురుతుందో లేదో తెలియదు. మేమైతే బీసీసీఐ నుంచి నిర్వహణ ప్రక్రియ నిబంధనల కోసం ఎదురుచూస్తున్నాం. యూఏఈలో టెస్టింగ్‌ రేటు ఎక్కువగా ఉంది. అందుకు అవసరమైన సాంకేతికత, సామర్థ్యం వారికుంది. ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించేందుకు బీసీసీఐ స్థానిక ప్రభుత్వ సాయం తీసుకోవాలి. భారత్‌లో విమానం ఎక్కే ముందు, దుబాయ్‌లో దిగాక వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే యూఏఈ నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లో ఉండాల్సిందే."

- నెస్‌వాడియా, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని

సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 8 వరకు ఐపీఎల్​ జరగనుంది. ఆగస్టు 20లోపు జట్లన్నీ దుబాయ్‌ చేరుకొనేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇది చూడండి : కైఫ్ స్టన్నింగ్ క్యాచ్.. పాక్​పై భారత్ విజయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.