ETV Bharat / sports

'ప్రపంచకప్​ సెమీస్​లో భారత్​ ఓటమికి కారణమిదే'

ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్​ సెమీఫైనల్లో ఓటమికి కారణం చెప్పాడు టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ. ఓల్డ్​ ట్రాఫోర్డు మైదానంలో న్యూజిలాండ్​తో జరిగిన ఈ మ్యాచ్​లో 18 పరుగుల తేడాతో పరాజయం చెందింది భారత జట్టు.

author img

By

Published : Nov 28, 2019, 6:22 PM IST

kohli on world cup defeat 2019 and admits to inner ego crushing him in that time
'ఆ కారణంగానే ప్రపంచకప్​లో ఓడిపోయాం'

ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్​ ఓటమిపై కోహ్లీ మాట్లాడాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్​ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి.. తన అతి విశ్వాసమే కారణమని అన్నాడు విరాట్​. లీగ్​ దశలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన టీమిండియా... కీలక మ్యాచ్​లో ఓటమిపాలవడం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నట్లు చెప్పుకొచ్చాడు.

" వరల్డ్‌కప్‌ ఓటమి నాపై తీవ్ర ప్రభావం చూపింది. సెమీస్​లో ఓడిపోవడం వల్ల జట్టంతా బాధపడ్డారు. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం వల్ల చివరి వరకు నాటౌట్​గా ఉండాలని నిశ్చయించుకున్నా. కానీ అది కాపాడుకోవడంలో విఫలమయ్యాను. ఎందుకంటే అతి విశ్వాసం నాలో నిండిపోడవం వల్ల నేను పరిస్థితులకు తగ్గట్లు జాగ్రత్తపడలేకపోయాను".

-- కోహ్లీ, టీమిండియా సారథి

బలమైన కోరిక, సంకల్పం ఉన్నప్పుడు అన్నీ సాధించగలుగుతామని చెప్పిన కోహ్లీ... ఓడిపోవడాన్ని ద్వేషిస్తానన్నాడు.

"ఓటమితో మైదానాన్ని వీడటం ఇష్టపడను. బరిలోకి దిగడాన్ని గౌరవంగా భావిస్తా. శక్తి ఉన్నంత వరకు పోరాడతా. భవిష్యత్తు తరాలు జట్టు ఆటతీరు గురించి చర్చించుకునే విధంగా పోరాడాలని భావిస్తున్నాం" అని అన్నాడు విరాట్​.

ఓల్డ్‌ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన సెమీస్​లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ ఒక పరుగుకే ఔట్‌ కాగా... టోర్నీ మొత్తం సెంచరీతో అదరగొట్టిన ఓపెనర్ రోహిత్‌ శర్మ కూడా సింగిల్​ రన్​కే పెవిలియన్‌కు చేరాడు. అయితే రవీంద్ర జడేజా(77), ధోనీ(50)లు హాఫ్ సెంచరీలతో చివరి వరకు పోరాడినా టీమిండియాను గెలిపించలేకపోయారు. ఫలితంగా 239 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 221 ఆలౌటైంది భారత జట్టు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

విరాట్​ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ప్రస్తుతం దూసుకెళ్తోంది. ఇటీవల జరిగిన మూడు వరుస టెస్టు సరీస్​లు(విండీస్​, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​) గెలిచింది కోహ్లీసేన. డిసెంబర్​ నుంచి భారత్​లో పర్యటనకు వస్తోంది వెస్టిండీస్​ జట్టు. ఇందులో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు నిర్వహించనున్నారు. డిసెంబర్​ 6న నుంచి మ్యాచ్​లు ప్రారంభం కానున్నాయి.

ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్​ ఓటమిపై కోహ్లీ మాట్లాడాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్​ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి.. తన అతి విశ్వాసమే కారణమని అన్నాడు విరాట్​. లీగ్​ దశలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన టీమిండియా... కీలక మ్యాచ్​లో ఓటమిపాలవడం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నట్లు చెప్పుకొచ్చాడు.

" వరల్డ్‌కప్‌ ఓటమి నాపై తీవ్ర ప్రభావం చూపింది. సెమీస్​లో ఓడిపోవడం వల్ల జట్టంతా బాధపడ్డారు. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం వల్ల చివరి వరకు నాటౌట్​గా ఉండాలని నిశ్చయించుకున్నా. కానీ అది కాపాడుకోవడంలో విఫలమయ్యాను. ఎందుకంటే అతి విశ్వాసం నాలో నిండిపోడవం వల్ల నేను పరిస్థితులకు తగ్గట్లు జాగ్రత్తపడలేకపోయాను".

-- కోహ్లీ, టీమిండియా సారథి

బలమైన కోరిక, సంకల్పం ఉన్నప్పుడు అన్నీ సాధించగలుగుతామని చెప్పిన కోహ్లీ... ఓడిపోవడాన్ని ద్వేషిస్తానన్నాడు.

"ఓటమితో మైదానాన్ని వీడటం ఇష్టపడను. బరిలోకి దిగడాన్ని గౌరవంగా భావిస్తా. శక్తి ఉన్నంత వరకు పోరాడతా. భవిష్యత్తు తరాలు జట్టు ఆటతీరు గురించి చర్చించుకునే విధంగా పోరాడాలని భావిస్తున్నాం" అని అన్నాడు విరాట్​.

ఓల్డ్‌ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన సెమీస్​లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ ఒక పరుగుకే ఔట్‌ కాగా... టోర్నీ మొత్తం సెంచరీతో అదరగొట్టిన ఓపెనర్ రోహిత్‌ శర్మ కూడా సింగిల్​ రన్​కే పెవిలియన్‌కు చేరాడు. అయితే రవీంద్ర జడేజా(77), ధోనీ(50)లు హాఫ్ సెంచరీలతో చివరి వరకు పోరాడినా టీమిండియాను గెలిపించలేకపోయారు. ఫలితంగా 239 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 221 ఆలౌటైంది భారత జట్టు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

విరాట్​ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ప్రస్తుతం దూసుకెళ్తోంది. ఇటీవల జరిగిన మూడు వరుస టెస్టు సరీస్​లు(విండీస్​, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​) గెలిచింది కోహ్లీసేన. డిసెంబర్​ నుంచి భారత్​లో పర్యటనకు వస్తోంది వెస్టిండీస్​ జట్టు. ఇందులో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు నిర్వహించనున్నారు. డిసెంబర్​ 6న నుంచి మ్యాచ్​లు ప్రారంభం కానున్నాయి.

AP Video Delivery Log - 0800 GMT News
Thursday, 28 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0754: Vietnam Funeral AP Clients Only 4242163
Funeral for 2 Vietnamese in UK truck deaths
AP-APTN-0733: Hong Kong Leung AP Clients Only 4242159
Former HK chief executive speaks at FCC
AP-APTN-0656: Hong Kong University Clearing AP Clients Only 4242162
Police teams find crossbows, bows in HK university
AP-APTN-0648: US TX Plant Explosion Must credit KTRK; No access Houston; No use US broadcast networks; No re-sale, re-use or archive 4242161
Texas chemical plant fire burns through the night
AP-APTN-0631: US DC State Dept Venezuela AP Clients Only 4242160
US official: Venezuelan regime steals from poor
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.