క్రికెట్ అభిమానుల్లో పాత తరాన్ని, కొత్త తరాన్ని కలిపే వారధి విరాట్ కోహ్లీ ఒక్కడేనని అభిప్రాయపడ్డాడు ప్రముఖ కామేంటేటర్ హర్ష భోగ్లే. ప్రస్తుత కాలంలో టెస్టు క్రికెట్ అభివృద్ధి చెందేందుకు విరాట్ కోహ్లీ ఓ ఆయుధంలా ఉపయోగపడతాడని అన్నాడు. టీ20ల ప్రభావంతో ఐదు రోజులు జరిగే ఫార్మాట్కు అనేక దేశాల్లో స్డేడియాలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టిందని.. అలాంటి వారిని తిరిగి రప్పించగలిగే సామర్థ్యం కోహ్లీకి మాత్రమే ఉందని స్పష్టం చేశాడు.
టీ20 మ్యాచ్లకు అలవాటు పడిన ప్రేక్షకులు టెస్టు మ్యాచ్లను వీక్షించడంపై ఆసక్తి చూపడంలేదని హర్ష అన్నాడు. ఆధునిక కాలంలో జీవన విధానాలకు తగ్గట్టు టెస్టుల కంటే టీ20లకు విపరీతమైన క్రేజ్ వచ్చిందని అభిప్రాయపడ్డాడు.
మహిళల మ్యాచ్లకు పెరిగిన ఆదరణ
2017 మహిళా ప్రపంచకప్, ఇటీవలే ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత మహిళల క్రికెట్కు విశేషాదరణ లభించిందని హర్ష తెలిపాడు. ఈ క్రమంలో భారత్లో మహిళల ఐపీఎల్ నిర్వహించడానికి మరెంతో సమయం లేదని అభిప్రాయపడ్డాడు.
ఇదీ చూడండి... 'కోహ్లీ నుంచి అన్నీ తీసేసుకుంటా'