ETV Bharat / sports

కర్ణాటక క్రికెట్​ సంఘం రూ.కోటి విరాళం - KSCA donates for Corona Funds

కరోనాపై పోరాటానికిగానూ కర్ణాటక క్రికెట్​ సంఘం రూ.కోటి విరాళాన్ని ప్రకటించింది. బీసీసీఐ ద్వారా ఈ మొత్తాన్ని పీఎం కేర్స్​కు అందజేయనుంది.

Karantaka State Cricket Association to donate Rs one crore for fight against COVID-19
కర్ణాటక క్రికెట్​ సంఘం రూ.కోటి విరాళం
author img

By

Published : Mar 29, 2020, 5:14 PM IST

భారత్​లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రముఖ సంస్థలు, క్రికెట్​ సంఘాలు తమవంతు సాయమందిస్తున్నాయి. ఈ జాబితాలోకి కర్ణాటక రాష్ట్ర క్రికెట్​ సంఘం(కేఎస్​సీఏ) చేరింది. కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించింది. బీసీసీఐ ద్వారా ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెరిసగం ఇస్తున్నట్లు పేర్కొంది.

బీసీసీఐ ద్వారా 'పీఎం-కేర్స్​'కు

కేంద్రానికి ఇచ్చే రూ. 50 లక్షలను బీసీసీఐ ద్వారా ప్రధానమంత్రి సిటిజెన్​ అసిస్టెన్స్​ అండ్​ రిలీఫ్​ ఇన్​ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్​(పీఎం-కేర్స్​)కు అందించనున్నట్లు కేఎస్​సీఏ తెలిపింది. బంగాల్​, ముంబయి, సౌరాష్ట్ర క్రికెట్​ అసోషియేషన్స్​ తమవంతు సాయమందించేందుకు ముందుకొచ్చాయి. అంతకు ముందు బీసీసీఐ.. రూ.51 కోట్లను ఈ సహాయనిధికి ఇస్తున్నట్లు చెప్పింది.

భారత్​లో 25 మంది మృతి

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా 30వేల మందికిపైగా మరణించారు. భారత్​లో ఇప్పటివరకు 25 మంది మృత్యువాతపడ్డారు.

ఇదీ చదవండి: కరోనాపై పోరాటానికి 16 ఏళ్ల మహిళా క్రికెటర్​ చేయూత

భారత్​లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రముఖ సంస్థలు, క్రికెట్​ సంఘాలు తమవంతు సాయమందిస్తున్నాయి. ఈ జాబితాలోకి కర్ణాటక రాష్ట్ర క్రికెట్​ సంఘం(కేఎస్​సీఏ) చేరింది. కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించింది. బీసీసీఐ ద్వారా ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెరిసగం ఇస్తున్నట్లు పేర్కొంది.

బీసీసీఐ ద్వారా 'పీఎం-కేర్స్​'కు

కేంద్రానికి ఇచ్చే రూ. 50 లక్షలను బీసీసీఐ ద్వారా ప్రధానమంత్రి సిటిజెన్​ అసిస్టెన్స్​ అండ్​ రిలీఫ్​ ఇన్​ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్​(పీఎం-కేర్స్​)కు అందించనున్నట్లు కేఎస్​సీఏ తెలిపింది. బంగాల్​, ముంబయి, సౌరాష్ట్ర క్రికెట్​ అసోషియేషన్స్​ తమవంతు సాయమందించేందుకు ముందుకొచ్చాయి. అంతకు ముందు బీసీసీఐ.. రూ.51 కోట్లను ఈ సహాయనిధికి ఇస్తున్నట్లు చెప్పింది.

భారత్​లో 25 మంది మృతి

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా 30వేల మందికిపైగా మరణించారు. భారత్​లో ఇప్పటివరకు 25 మంది మృత్యువాతపడ్డారు.

ఇదీ చదవండి: కరోనాపై పోరాటానికి 16 ఏళ్ల మహిళా క్రికెటర్​ చేయూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.