ప్రపంచ అత్యుత్తమ క్రికెట్ జట్టు టీమిండియాను ఓడించడం సంతృప్తిగా ఉందని కివీస్ సారథి కేన్ విలియమ్సన్ అన్నాడు. తొలి టెస్టులో పది వికెట్లు, రెండో టెస్టులో ఏడు వికెట్ల ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది భారత్. ఫలితంగా న్యూజిలాండ్ 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం కివీస్ సారథి విలియమ్సన్ మాట్లాడుతూ.. ఇదో అద్భుతమైన సిరీస్ అని, తమ ఆటగాళ్లు బాగా ఆడారని మెచ్చుకున్నాడు. ముఖ్యంగా జేమిసన్పై ప్రశంసలు కురిపించాడు.
"రెండు టెస్టుల్లో జేమిసన్ 9 వికెట్లు తీయడమే కాకుండా 93 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఉత్సాహవంతమైన నైపుణ్యం కలవాడు. అతడు బ్యాట్తో పాటు బంతితోనూ మంచి ప్రదర్శన చేశాడు. అతడు పొడుగ్గా ఉండటం వల్ల ఈ పిచ్లపై బౌన్స్ లభిస్తుంది. అది జట్టుకెంతో ఉపయోగం. రెండు మ్యాచ్ల్లో చివర్లో విలువైన పరుగులు చేసి బాగా రాణించాడు.
-విలియమ్సన్, కివీస్ సారథి.
రెండు టెస్టుల సిరీస్ను కైవసం చేసుకోవడం వల్ల న్యూజిలాండ్ ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్లో మూడో స్థానానికి చేరుకుంది. టీమిండియా, ఆస్ట్రేలియా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి : 'పంత్'ను ఏమనకండి... ఇది సమష్టి వైఫల్యం : కోహ్లీ