ETV Bharat / sports

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​కు అందుబాటులో ఉండేందుకే!

author img

By

Published : Nov 17, 2020, 8:47 AM IST

ఐపీఎల్​లో గాయం కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చిన పేసర్​ ఇషాంత్​ శర్మ.. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్​ అకాడమీ (ఎన్​సీఏ)లోని పునరావాసం ద్వారా ఫిట్​నెస్​ సాధించే పనిలో ఉన్నాడు. బౌలింగ్​ కోచ్​ పరాస్​ మాంబ్రే పర్యవేక్షణలో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్​ కోసం ఇషాంత్​ సన్నద్ధమవుతున్నాడు.

Ishant Sharma working closely with Paras Mhambrey at NCA to get fit for Tests in Australia
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​కు అందుబాటులో ఉండేందుకే!

ఆస్ట్రేలియాతో డిసెంబరులో ఆరంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్​కు అందుబాటులో ఉండడానికి పేసర్​ ఇషాంత్​ శర్మ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్​ అకాడమీ (ఎన్​సీఏ)లో బౌలింగ్​ కోచ్​ పరాస్​ మాంబ్రే పర్యవేక్షణలో అతను సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది.

"టెస్టు సిరీస్​ నాటికల్లా భారత జట్టుకు అందుబాటులో ఉండేందుకు ఇషాంత్​.. మాంబ్రే పర్యవేక్షణలో శ్రమిస్తున్నట్లు ఎన్​సీఏ డైరెక్టర్​ ద్రవిడ్​.. బీసీసీఐకు సమాచారం అందించాడు. తొలి టెస్టు తర్వాత కోహ్లీ జట్టుకు దూరమయ్యే నేపథ్యంలో ఇషాంత్​ రాకతో భారత జట్టు బలపడుతుంది. వికెట్లు తీసే బౌలర్లలో అతనొకడు. ఇషాంత్ అనుభవం కూడా జట్టుకు ఉపయోగపడుతుంది" అని ఎన్​సీఏ వర్గాలు తెలిపాయి.

ఈ ఏడాది జనవరిలో దిల్లీ తరపున విదర్భతో రంజీ మ్యాచ్​ ఆడుతుండగా ఇషాంత్​ కుడి చీలమండకు గాయమైంది. ఆ తర్వాత ఎన్​సీఏలో పునరావాసం ద్వారా ఫిట్​నెస్​ సాధించిన అతను ఫిబ్రవరిలో న్యూజిలాండ్​తో జరిగిన రెండు టెస్టుల సిరీస్​లో పాల్గొన్నాడు. అయితే తొలి టెస్టు ఆడుతుండగా గాయం మళ్లీ తిరగబెట్టింది. అలా రెండో టెస్టుకు దూరమయ్యాడు. కరోనా కారణంగా లాక్​డౌన్​ విధించడం వల్ల తిరిగి ఫిట్​నెస్​ సాధించిన ఇషాంత్..​ ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. అయితే మరోసారి గాయం తిరగబెట్టడం వల్ల అతను స్వదేశానికి తిరిగి వచ్చాడు.

ఆస్ట్రేలియాతో డిసెంబరులో ఆరంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్​కు అందుబాటులో ఉండడానికి పేసర్​ ఇషాంత్​ శర్మ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్​ అకాడమీ (ఎన్​సీఏ)లో బౌలింగ్​ కోచ్​ పరాస్​ మాంబ్రే పర్యవేక్షణలో అతను సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది.

"టెస్టు సిరీస్​ నాటికల్లా భారత జట్టుకు అందుబాటులో ఉండేందుకు ఇషాంత్​.. మాంబ్రే పర్యవేక్షణలో శ్రమిస్తున్నట్లు ఎన్​సీఏ డైరెక్టర్​ ద్రవిడ్​.. బీసీసీఐకు సమాచారం అందించాడు. తొలి టెస్టు తర్వాత కోహ్లీ జట్టుకు దూరమయ్యే నేపథ్యంలో ఇషాంత్​ రాకతో భారత జట్టు బలపడుతుంది. వికెట్లు తీసే బౌలర్లలో అతనొకడు. ఇషాంత్ అనుభవం కూడా జట్టుకు ఉపయోగపడుతుంది" అని ఎన్​సీఏ వర్గాలు తెలిపాయి.

ఈ ఏడాది జనవరిలో దిల్లీ తరపున విదర్భతో రంజీ మ్యాచ్​ ఆడుతుండగా ఇషాంత్​ కుడి చీలమండకు గాయమైంది. ఆ తర్వాత ఎన్​సీఏలో పునరావాసం ద్వారా ఫిట్​నెస్​ సాధించిన అతను ఫిబ్రవరిలో న్యూజిలాండ్​తో జరిగిన రెండు టెస్టుల సిరీస్​లో పాల్గొన్నాడు. అయితే తొలి టెస్టు ఆడుతుండగా గాయం మళ్లీ తిరగబెట్టింది. అలా రెండో టెస్టుకు దూరమయ్యాడు. కరోనా కారణంగా లాక్​డౌన్​ విధించడం వల్ల తిరిగి ఫిట్​నెస్​ సాధించిన ఇషాంత్..​ ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. అయితే మరోసారి గాయం తిరగబెట్టడం వల్ల అతను స్వదేశానికి తిరిగి వచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.