ETV Bharat / sports

మలుపు తిప్పే మొనగాళ్లు... మరో ఫ్రాంఛైజీకి మారారు

2019 ఐపీఎల్ మరో రెండ్రోజుల్లో ప్రారంభంకానుంది. ప్రతి ఏడాది జట్టు నుంచి కొందరు ఆటగాళ్లు మారడం సహజమే. అలాగే ఈసారీ వేరే ఫ్రాంఛైజీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ఈ క్రికెటర్లు.

author img

By

Published : Mar 21, 2019, 6:30 PM IST

మ్యచ్​ను మలుపు తిప్పే మొనగాళ్లు...మరో ఫ్రాంఛైజీకి మారారు

సుమారు 106 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఈ ఏడాది కొనుగోళ్లకు సిద్ధమయ్యాయి ఫ్రాంచైజీలు. జైపూర్​లో 2018 డిసెంబర్​లో ఐపీఎల్​ 12వ సీజన్​ వేలంపాట జరిగింది. ఇందులో ఐదుగురు ప్రముఖ క్రికెటర్లు ఒక టీం నుంచి మరో టీంకు మారారు.

  • డికాక్​.. బెంగళూరు నుంచి ముంబయి

2019 వేలంపాటలో మొదటి ఆటగాడు దక్షిణాఫ్రికా బ్యాట్స్​మెన్, వికెట్​ కీపర్​ క్వింటన్​ డికాక్​ను 2.8 కోట్లకు దక్కించుకుంది ముంబయి ఇండియన్స్​ యాజమాన్యం. బంగ్లాదేశ్​ ఫాస్ట్​ బౌలర్​ ముస్తాఫిజుర్​ రెహమాన్​ (2.2 కోట్లు), శ్రీలంక ఆఫ్​ స్పిన్నర్​ అఖిల ధనంజయ (50 లక్షలు)ను వదులుకుని ఈ కొనుగోలు చేసింది.
విండీస్​ ఆటగాడు ఎవిన్​ లూయిస్​, సారథి రోహిత్​ శర్మతో పాటు డికాక్​ రాకతో ముంబయి టాప్​ ఆర్డర్​ బలంగా తయారైంది. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్​ చేసే సామర్థ్యం ఉన్న ఆటగాడు డికాక్​. ఈ మెగా టోర్నీకి ముందు వన్డేల్లో 5 మ్యాచ్​ల్లో 353 పరుగులు చేసిన ఈ సఫారీ బ్యాట్స్​మెన్​...శ్రీలంకతో సిరీస్​ను​ క్లీన్​స్వీప్​ చేయడంలోప్రధానపాత్ర పోషించాడు.​

  • శిఖర్​ ధావన్​.. సన్​రైజర్స్​ నుంచి దిల్లీ క్యాపిటల్స్​

మొదట దిల్లీ తరఫున ఆడిన ధావన్​​.. ఆ జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో గౌతమ్​ గంభీర్​, వీరేంద్ర సెహ్వాగ్​ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ ఐపీఎల్​లో మళ్లీ సొంత గూటికే చేరాడు.

ipl game changers moved to another franchise
దిల్లీ క్యాపిటల్స్​ తరఫున శిఖర్​ధావన్​

విజయ్​ శంకర్​, షహ్​బాజ్​ నదీమ్​, అభిషేక్​ శర్మ వంటి ముగ్గురు ఆటగాళ్లను వదులుకొని ఆ ధరకు ధావన్​ను దక్కించుకుంది దిల్లీ క్యాపిటల్స్​. రూ.5 కోట్లతో అక్షర్​ పటేల్​నూ కొనుగోలు చేసింది ఈ ప్రాంఛైజీ .
  • స్టాయినిస్​.. కింగ్స్​ ఎలెవన్ పంజాబ్​ నుంచి రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు

2018 వేలంలో స్టాయినిస్​ను దక్కించుకోలేకపోయిన బెంగళూరు ఈ ఏడాది 6.20 కోట్ల ధరకు కొనుక్కుంది. ఈ ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ కోసం మన్​దీప్​ సింగ్​ను వదులుకుందీ జట్టు.
స్వదేశంలో భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్​లో స్టాయినిస్​ అద్భుత ప్రదర్శన చేశాడు. 0-2తో వెనుకబడి ఉన్నఆసిస్​... చివరి మూడు మ్యాచ్​లు గెలిచి సిరీస్​ గెలుచుకోవడంలో ముఖ్య పాత్ర వహించాడు. ఒక మ్యాచ్​లో 140 పరుగులతో ఆకట్టుకున్నాడు. బిగ్​బాష్​ టోర్నమెంటులో మూడో అత్యధిక స్కోరర్​గా నిలవడం బెంగళూరుకు కలిసొచ్చే అంశం.

  • యువరాజ్​ సింగ్​.. పంజాబ్​ నుంచి ముంబయి ఇండియన్స్​

2018 టోర్నమెంటులో ఎనిమిది మ్యాచ్​ల్లో 65 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చిన యువరాజ్​సింగ్​పై ఈ ఏడాది ఏ ఫ్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరకు ముంబయి ఇండియన్స్​ కోటి రూపాయల నామమాత్ర ధరకు సొంతం చేసుకుంది. గతంలో 12 కోట్లతో వేలంలో అత్యధిక ధర పలికిన ఈ హిట్టర్​ ఇంత తక్కువ ధర పలకడం ఆశ్చర్యకరం. మంచి అనుభవం ఉన్న ఆటగాడు, మిడిలార్డర్​లో రాణించగలడనే భరోసాతోనే యాజమాన్యం యువీని దక్కించుకుంది.

ipl game changers moved to another franchise
ముంబయి ఇండియన్స్​ తరఫున యువీ
  • మార్టిన్​ గప్తిల్​, బెయిర్​స్టో....సన్​రైజర్స్​

గప్తిల్​, బెయిర్​ స్టో రూపంలో సన్​రైజర్స్​కు బలమైన ఓపెనర్లు దొరికారు. ధావన్​ లేని లోటు తీర్చేందుకు వీరు ఉపయోగపడతారని ఫ్రాంఛైజీ భావిస్తోంది.

  1. తొలిసారి ఐపీఎల్​ వేలంలో పాల్గొన్న బెయిర్​ స్టోను 2.2 కోట్లకు దక్కించుకుంది సన్​రైజర్స్​. ఈ ఇంగ్లండ్​ ఆటగాడు వికెట్​ కీపర్, బ్యాట్స్​మెన్​గా ప్రభావం చూపించగలడు.
  2. గప్తిల్​ను కోటి రూపాయలకు రెండో రౌండ్​లో కొనుగోలు చేసింది సన్​రైజర్స్. ఈ కివీస్​ ఓపెనర్​ చాలా సీజన్ల తరవాత మళ్లీ ఐపీఎల్​లో అడుగుపెడుతున్నాడు. భారత్​లో గప్తిల్​కు మంచి రికార్డు ఉంది. హిట్టర్​గానూ టీ20ల్లో నిరూపించుకున్నాడీ విధ్వంసకర ఓపెనర్.

సుమారు 106 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఈ ఏడాది కొనుగోళ్లకు సిద్ధమయ్యాయి ఫ్రాంచైజీలు. జైపూర్​లో 2018 డిసెంబర్​లో ఐపీఎల్​ 12వ సీజన్​ వేలంపాట జరిగింది. ఇందులో ఐదుగురు ప్రముఖ క్రికెటర్లు ఒక టీం నుంచి మరో టీంకు మారారు.

  • డికాక్​.. బెంగళూరు నుంచి ముంబయి

2019 వేలంపాటలో మొదటి ఆటగాడు దక్షిణాఫ్రికా బ్యాట్స్​మెన్, వికెట్​ కీపర్​ క్వింటన్​ డికాక్​ను 2.8 కోట్లకు దక్కించుకుంది ముంబయి ఇండియన్స్​ యాజమాన్యం. బంగ్లాదేశ్​ ఫాస్ట్​ బౌలర్​ ముస్తాఫిజుర్​ రెహమాన్​ (2.2 కోట్లు), శ్రీలంక ఆఫ్​ స్పిన్నర్​ అఖిల ధనంజయ (50 లక్షలు)ను వదులుకుని ఈ కొనుగోలు చేసింది.
విండీస్​ ఆటగాడు ఎవిన్​ లూయిస్​, సారథి రోహిత్​ శర్మతో పాటు డికాక్​ రాకతో ముంబయి టాప్​ ఆర్డర్​ బలంగా తయారైంది. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్​ చేసే సామర్థ్యం ఉన్న ఆటగాడు డికాక్​. ఈ మెగా టోర్నీకి ముందు వన్డేల్లో 5 మ్యాచ్​ల్లో 353 పరుగులు చేసిన ఈ సఫారీ బ్యాట్స్​మెన్​...శ్రీలంకతో సిరీస్​ను​ క్లీన్​స్వీప్​ చేయడంలోప్రధానపాత్ర పోషించాడు.​

  • శిఖర్​ ధావన్​.. సన్​రైజర్స్​ నుంచి దిల్లీ క్యాపిటల్స్​

మొదట దిల్లీ తరఫున ఆడిన ధావన్​​.. ఆ జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో గౌతమ్​ గంభీర్​, వీరేంద్ర సెహ్వాగ్​ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ ఐపీఎల్​లో మళ్లీ సొంత గూటికే చేరాడు.

ipl game changers moved to another franchise
దిల్లీ క్యాపిటల్స్​ తరఫున శిఖర్​ధావన్​

విజయ్​ శంకర్​, షహ్​బాజ్​ నదీమ్​, అభిషేక్​ శర్మ వంటి ముగ్గురు ఆటగాళ్లను వదులుకొని ఆ ధరకు ధావన్​ను దక్కించుకుంది దిల్లీ క్యాపిటల్స్​. రూ.5 కోట్లతో అక్షర్​ పటేల్​నూ కొనుగోలు చేసింది ఈ ప్రాంఛైజీ .
  • స్టాయినిస్​.. కింగ్స్​ ఎలెవన్ పంజాబ్​ నుంచి రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు

2018 వేలంలో స్టాయినిస్​ను దక్కించుకోలేకపోయిన బెంగళూరు ఈ ఏడాది 6.20 కోట్ల ధరకు కొనుక్కుంది. ఈ ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ కోసం మన్​దీప్​ సింగ్​ను వదులుకుందీ జట్టు.
స్వదేశంలో భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్​లో స్టాయినిస్​ అద్భుత ప్రదర్శన చేశాడు. 0-2తో వెనుకబడి ఉన్నఆసిస్​... చివరి మూడు మ్యాచ్​లు గెలిచి సిరీస్​ గెలుచుకోవడంలో ముఖ్య పాత్ర వహించాడు. ఒక మ్యాచ్​లో 140 పరుగులతో ఆకట్టుకున్నాడు. బిగ్​బాష్​ టోర్నమెంటులో మూడో అత్యధిక స్కోరర్​గా నిలవడం బెంగళూరుకు కలిసొచ్చే అంశం.

  • యువరాజ్​ సింగ్​.. పంజాబ్​ నుంచి ముంబయి ఇండియన్స్​

2018 టోర్నమెంటులో ఎనిమిది మ్యాచ్​ల్లో 65 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చిన యువరాజ్​సింగ్​పై ఈ ఏడాది ఏ ఫ్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరకు ముంబయి ఇండియన్స్​ కోటి రూపాయల నామమాత్ర ధరకు సొంతం చేసుకుంది. గతంలో 12 కోట్లతో వేలంలో అత్యధిక ధర పలికిన ఈ హిట్టర్​ ఇంత తక్కువ ధర పలకడం ఆశ్చర్యకరం. మంచి అనుభవం ఉన్న ఆటగాడు, మిడిలార్డర్​లో రాణించగలడనే భరోసాతోనే యాజమాన్యం యువీని దక్కించుకుంది.

ipl game changers moved to another franchise
ముంబయి ఇండియన్స్​ తరఫున యువీ
  • మార్టిన్​ గప్తిల్​, బెయిర్​స్టో....సన్​రైజర్స్​

గప్తిల్​, బెయిర్​ స్టో రూపంలో సన్​రైజర్స్​కు బలమైన ఓపెనర్లు దొరికారు. ధావన్​ లేని లోటు తీర్చేందుకు వీరు ఉపయోగపడతారని ఫ్రాంఛైజీ భావిస్తోంది.

  1. తొలిసారి ఐపీఎల్​ వేలంలో పాల్గొన్న బెయిర్​ స్టోను 2.2 కోట్లకు దక్కించుకుంది సన్​రైజర్స్​. ఈ ఇంగ్లండ్​ ఆటగాడు వికెట్​ కీపర్, బ్యాట్స్​మెన్​గా ప్రభావం చూపించగలడు.
  2. గప్తిల్​ను కోటి రూపాయలకు రెండో రౌండ్​లో కొనుగోలు చేసింది సన్​రైజర్స్. ఈ కివీస్​ ఓపెనర్​ చాలా సీజన్ల తరవాత మళ్లీ ఐపీఎల్​లో అడుగుపెడుతున్నాడు. భారత్​లో గప్తిల్​కు మంచి రికార్డు ఉంది. హిట్టర్​గానూ టీ20ల్లో నిరూపించుకున్నాడీ విధ్వంసకర ఓపెనర్.
SNTV Digital Daily Planning, 0800 GMT
Thursday 21st March 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: England prepare to meet the Czech Republic at Wembley in the opening Euro 2020 qualifier. Expect at 1200 with update to follow.
SOCCER: The Czech Republic prepare to meet England at Wembley in a Group A Euro 2020 qualifier. Expect at 2000.
SOCCER: Preview of Moldova v France Euro 2020 Group H qualifier in Chisinau. Expect at 2100.
SOCCER: New UAE head coach Bert Van Marwijk is presented to the media. Expect at 1900.
SOCCER: Carlos Queiroz prepares for his first match as head coach of Colombia in an international friendly against Japan in Yokohama. Expect at 1230.
TENNIS: Highlights from the ATP Miami Open, Miami, USA. Expect from 2000 with updates to follow.
TENNIS: Highlights from the WTA Miami Open Miami, USA. Expect from 2000 with updates to follow.
TENNIS: Inauguration of the new third show court at Roland Garros, Court Simonne-Mathieu. Expect at 1700.
GYMNASTICS: Simone Biles helps launch a new world gymnastics event in London. Expect at 1230.
MOTORSPORT: Mick Schumacher comments on the Formula 2 season ahead and being unfazed by comparisons with his father and F1 great, Michael. Expect at 1300.
CYCLING: Highlights from the stage four of the Cape Epic in South Africa. Expect at 2030.  
FORMULA E: Coverage from the build-up to the Formula E China E-Prix in Sanya, Hainan Island, China. Expect at 1500.
Regards,
SNTV
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.