ఐపీఎల్ 13వ సీజన్ ముంగిట ముంబయి ఇండియన్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ లసిత్ మలింగ.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్నాడు. కరోనా కాలంలో కుటుంబంతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటున్నాడని.. ముంబయి జట్టు యజమాని ఆకాశ్ అంబానీ వెల్లడించారు. మలింగ స్థానంలో ఆస్ట్రేలియా పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ను జట్టులో నియమించినట్లు ప్రకటించారు.
"ఈ ఐపీఎల్లో మాకు సరైన బౌలర్ జేమ్స్ అని నమ్ముతున్నాం. మలింగ ముంబయి జట్టుకు మూల స్తంభం. సీజన్లో అతని ప్రదర్శనను కోల్పోతున్నామనే వాస్తవాన్ని అంగీకరిస్తున్నాం. తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలనే అతని నిర్ణయాన్ని మేము పూర్తిగా అర్థం చేసుకున్నాం".
ఆకాశ్ అంబానీ, ముంబయి జట్టు యజమాని
2009లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన మలింగ.. లీగ్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు 122 మ్యాచ్లు ఆడగా.. 19.80 సగటుతో 170 వికెట్లు పడగొట్టాడు. ప్యాటిన్సన్ తొలిసారి లీగ్లో అరంగేట్రం చేయనున్నాడు.