ETV Bharat / sports

ఐపీఎల్​ ముంగిట సీఎస్కే బృందంతో ధోనీ

author img

By

Published : Aug 14, 2020, 8:07 PM IST

ఐపీఎల్​ ఆడేందుకు ముందుగా ప్రాక్టీస్​ సెషన్​ కోసం చెన్నైకి చేరుకున్నాడు మహేంద్ర సింగ్​ ధోనీ. జట్టు సభ్యులైన సురైశ్​ రైనా, పియూష్​ చావ్లా, దీపక్​ చాహర్​ కూడా అతడితో వచ్చారు.

dhoni
చెన్నైకు చేరుకున్న ధోనీ

ఐపీఎల్​లో పాల్గొనేందుకు మహేంద్రసింగ్​ ధోనీ ఆగస్టు 14న చెన్నైకి చేరుకున్నాడు. ఆగస్టు 15 నుంచి సీఎస్కే శిక్షణా శిబిరంలో ప్రారంభమయ్యే ఐదు రోజుల ప్రీ సెషన్​లో పాల్గొననున్నాడు. మహీతో పాటు సీఎస్కే జట్టు ఆటగాళ్లు సురేశ్​ రైనా, కరణ్​ శర్మ, దీపక్​ చాహర్​, పియూష్​ చావ్లా కూడా చెన్నైకి చేరుకున్నారు. ఖాళీ స్డేడియంలోనే ఆటగాళ్లు శిక్షణ ప్రారంభించనున్నారు.


dhoni
చెన్నైకు చేరుకున్న ధోనీ

ఇప్పటికే వీరందరూ చెన్నైకి చేరుకునేముందు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆ వైద్య పరీక్షల్లో నెగెటివ్​ వచ్చినట్లు సీఎస్కే ఫ్రాంచైజీ తెలిపింది. యూఈఏ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు.. బయోసెక్యూర్​ వాతావరణంలో ఐపీఎల్ జరగనుంది.

ధోనీ రీఎంట్రీ

గతేడాది ప్రపంచకప్​లో చివరగా బరిలోకి దిగిన ధోనీ.. ఆ తర్వాత మైదానంలో అడుగుపెట్టలేదు. ఐపీఎల్​తో మళ్లీ ఎంట్రీ ఇస్తాడని అనుకున్నారు. అయితే మార్చిలో కరోనా రావడం, లీగ్​ నిరవధిక వాయిదా పడటం, టీ20 ప్రపంచకప్​ రద్దు.. ఇలా చాలానే అనుకోని సంఘటనలు జరిగాయి. దీంతో మహీ కెరీర్ సందిగ్ధంలో పడింది. అయితే యూఏఈ వేదికగా ఐపీఎల్​ నిర్వహణకు ఇటీవల బీసీసీఐ గ్రీన్​సిగ్నల్​ ఇవ్వగా.. ధోనీ మళ్లీ మైదానంలో కనువిందు చేయనున్నాడు. ఈ లీగ్​ ప్రదర్శనతో టీమ్​ఇండియాలోకి మహీ రీఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇదీ చూడండి ఇటాలియన్​ ఓపెన్​ టెన్నిస్​ షెడ్యూల్​ ఇదే

ఐపీఎల్​లో పాల్గొనేందుకు మహేంద్రసింగ్​ ధోనీ ఆగస్టు 14న చెన్నైకి చేరుకున్నాడు. ఆగస్టు 15 నుంచి సీఎస్కే శిక్షణా శిబిరంలో ప్రారంభమయ్యే ఐదు రోజుల ప్రీ సెషన్​లో పాల్గొననున్నాడు. మహీతో పాటు సీఎస్కే జట్టు ఆటగాళ్లు సురేశ్​ రైనా, కరణ్​ శర్మ, దీపక్​ చాహర్​, పియూష్​ చావ్లా కూడా చెన్నైకి చేరుకున్నారు. ఖాళీ స్డేడియంలోనే ఆటగాళ్లు శిక్షణ ప్రారంభించనున్నారు.


dhoni
చెన్నైకు చేరుకున్న ధోనీ

ఇప్పటికే వీరందరూ చెన్నైకి చేరుకునేముందు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆ వైద్య పరీక్షల్లో నెగెటివ్​ వచ్చినట్లు సీఎస్కే ఫ్రాంచైజీ తెలిపింది. యూఈఏ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు.. బయోసెక్యూర్​ వాతావరణంలో ఐపీఎల్ జరగనుంది.

ధోనీ రీఎంట్రీ

గతేడాది ప్రపంచకప్​లో చివరగా బరిలోకి దిగిన ధోనీ.. ఆ తర్వాత మైదానంలో అడుగుపెట్టలేదు. ఐపీఎల్​తో మళ్లీ ఎంట్రీ ఇస్తాడని అనుకున్నారు. అయితే మార్చిలో కరోనా రావడం, లీగ్​ నిరవధిక వాయిదా పడటం, టీ20 ప్రపంచకప్​ రద్దు.. ఇలా చాలానే అనుకోని సంఘటనలు జరిగాయి. దీంతో మహీ కెరీర్ సందిగ్ధంలో పడింది. అయితే యూఏఈ వేదికగా ఐపీఎల్​ నిర్వహణకు ఇటీవల బీసీసీఐ గ్రీన్​సిగ్నల్​ ఇవ్వగా.. ధోనీ మళ్లీ మైదానంలో కనువిందు చేయనున్నాడు. ఈ లీగ్​ ప్రదర్శనతో టీమ్​ఇండియాలోకి మహీ రీఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇదీ చూడండి ఇటాలియన్​ ఓపెన్​ టెన్నిస్​ షెడ్యూల్​ ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.