ETV Bharat / sports

దిల్లీ క్యాపిటల్స్​ ఆటగాళ్లకు అప్పటినుంచి శిక్షణ​!

author img

By

Published : Jul 31, 2020, 5:14 PM IST

ఆగస్టు 15 నుంచి భారత ఆటగాళ్లకు శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటోంది దిల్లీ క్యాపిటల్స్. అయితే ఆగస్టు 2న జరిగే ఐపీఎల్ పాలకమండలి భేటీ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనుంది.

IPL 2020: Delhi Capitals keen to host camp in city, final call after General Council meet
ఆగస్టు 15 నుంచి దిల్లీ క్యాపిటల్స్​ ఆటగాళ్లకు శిక్షణ​!

ఇండియన్​ ప్రీమియర్ లీగ్​ (ఐపీఎల్​).. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి తమ జట్టులోని భారత క్రికెరట్లకు శిబిరాన్ని ప్రారంభించేందుకు దిల్లీ క్యాపిటల్స్​ సన్నహాలు చేస్తుంది. కానీ ఆటగాళ్లకు శిక్షణా శిబిరాలు నిర్వహించే విషయమై ఆగస్టు 2 జరిగే పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా ఆటగాళ్ల మధ్య భౌతిక దూరం పాటిస్తూ, తిరిగి ప్రాక్టీస్​ ప్రారంభించాలని భావిస్తున్నట్లు దిల్లీ క్యాపిటల్స్​కు చెందిన ఓ అధికారి వెల్లడించారు.

ఆగస్టు 15 నుంచి ప్రాక్టీస్​

"ఐపీఎల్​ తేదీల గురించి బీసీసీఐ మాకు చెప్పినప్పటి నుంచి ఆటగాళ్లకు ప్రాక్టీసు శిబిరాన్ని ఏర్పాటు చేయాలని మా యాజమాన్యం సన్నాహాలు చేస్తుంది. బీసీసీఐ నిర్ణయం వచ్చిన తర్వాత ఆగస్టు 15 నుంచి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. యూఏఈకి ఎలా వెళ్లాలనే విషయమై సమావేశం తర్వాతే స్పష్టత వస్తుంది. క్రికెటర్లకు శిక్షణ ఇక్కడ? లేదంటే ఆ దేశంలో జరపాలా? అనేది తెలిస్తే ప్రణాళికలు వేసుకుంటాం" అని దిల్లీ క్యాపిటల్స్​ అధికారి చెప్పారు.

కర్ణాటకలో శిబిరం

తమ ఆటగాళ్ల కోసం కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో జేఎస్​డబ్ల్యూ స్పోర్ట్స్​ సెంటర్​లో తొలుత ఓ శిబిరాన్ని ప్రారంభించాలని అనుకున్నామని​, కరోనా కారణంగా దాన్ని రద్దు చేసినట్లు ఆ అధికారి వెల్లడించారు.

ఆరోజే నిర్ణయం

ఆదివారం (ఆగస్టు ​2) జరిగే ఐపీఎల్​ పాలకమండలి భేటీ​ తర్వాత టోర్నీ పూర్తి షెడ్యూల్​ విడుదల కానుంది. ఆ ప్రకటన తర్వాతే ఆటగాళ్లకు ప్రాక్టీసు ప్రణాళికలు రూపొందించుకోవాలని యాజమాన్యాలు భావిస్తున్నాయి.

ఇండియన్​ ప్రీమియర్ లీగ్​ (ఐపీఎల్​).. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి తమ జట్టులోని భారత క్రికెరట్లకు శిబిరాన్ని ప్రారంభించేందుకు దిల్లీ క్యాపిటల్స్​ సన్నహాలు చేస్తుంది. కానీ ఆటగాళ్లకు శిక్షణా శిబిరాలు నిర్వహించే విషయమై ఆగస్టు 2 జరిగే పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా ఆటగాళ్ల మధ్య భౌతిక దూరం పాటిస్తూ, తిరిగి ప్రాక్టీస్​ ప్రారంభించాలని భావిస్తున్నట్లు దిల్లీ క్యాపిటల్స్​కు చెందిన ఓ అధికారి వెల్లడించారు.

ఆగస్టు 15 నుంచి ప్రాక్టీస్​

"ఐపీఎల్​ తేదీల గురించి బీసీసీఐ మాకు చెప్పినప్పటి నుంచి ఆటగాళ్లకు ప్రాక్టీసు శిబిరాన్ని ఏర్పాటు చేయాలని మా యాజమాన్యం సన్నాహాలు చేస్తుంది. బీసీసీఐ నిర్ణయం వచ్చిన తర్వాత ఆగస్టు 15 నుంచి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. యూఏఈకి ఎలా వెళ్లాలనే విషయమై సమావేశం తర్వాతే స్పష్టత వస్తుంది. క్రికెటర్లకు శిక్షణ ఇక్కడ? లేదంటే ఆ దేశంలో జరపాలా? అనేది తెలిస్తే ప్రణాళికలు వేసుకుంటాం" అని దిల్లీ క్యాపిటల్స్​ అధికారి చెప్పారు.

కర్ణాటకలో శిబిరం

తమ ఆటగాళ్ల కోసం కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో జేఎస్​డబ్ల్యూ స్పోర్ట్స్​ సెంటర్​లో తొలుత ఓ శిబిరాన్ని ప్రారంభించాలని అనుకున్నామని​, కరోనా కారణంగా దాన్ని రద్దు చేసినట్లు ఆ అధికారి వెల్లడించారు.

ఆరోజే నిర్ణయం

ఆదివారం (ఆగస్టు ​2) జరిగే ఐపీఎల్​ పాలకమండలి భేటీ​ తర్వాత టోర్నీ పూర్తి షెడ్యూల్​ విడుదల కానుంది. ఆ ప్రకటన తర్వాతే ఆటగాళ్లకు ప్రాక్టీసు ప్రణాళికలు రూపొందించుకోవాలని యాజమాన్యాలు భావిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.