ETV Bharat / sports

భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టుకు లైన్ క్లియర్

author img

By

Published : Jan 4, 2021, 8:49 AM IST

Updated : Jan 4, 2021, 9:41 AM IST

మూడో టెస్టుకు ముందు ఆదివారం చేసిన వైద్య పరీక్షల్లో ఇరుజట్ల ఆటగాళ్లకు నెగిటివ్​గా తేలింది. దీంతో టీమ్​ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ మైదానంలో దిగడం దాదాపు ఖరారైంది.

Indian players test negative for coronavirus ahead of third test with australia
భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టుకు లైన్ క్లియర్

టీమ్​ఇండియా క్రికెటర్లకు ఉపశమనం. ఆదివారం చేసిన కొవిడ్ పరీక్షల్లో ఫలితాలు నెగిటివ్​ వచ్చాయి. ఈ విషయాన్ని బీసీసీఐ సోమవారం వెల్లడించింది. ఆస్ట్రేలియా క్రికెటర్లకూ నెగిటివ్​గానే తేలింది. దీంతో మూడో టెస్టు నిర్వహణకు మార్గం సుగమైమనట్లే. ఈరోజే ఇరుజట్లు సిడ్నీకి వెళ్లనున్నాయి.

అసలేం జరిగింది?

భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, గిల్, పంత్, సైనీ, పృథ్వీషా.. ఇటీవల మెల్​బోర్న్​లో ఓ రెస్టారెంట్​కు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడం వల్ల సదరు క్రికెటర్లు బయో బబుల్ నిబంధనలు అతిక్రమించారంటూ పెద్ద రచ్చ జరిగింది. దీనిపై ఇరుదేశాల బోర్డులు స్పందించినప్పటికీ నెటిజన్లు మాత్రం ఊరుకోవట్లేదు.

Indian players test negative for coronavirus ahead of third test with australia
టీమ్​ఇండియా బృందం

ఇందులో భాగంగా ఆ ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్​లో ఉంచారు. అనంతరం వారికి జట్టుతో కలిపి వైద్య పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా అందరికీ కరోనా నెగిటివ్​ రావడం వల్ల టెస్టులో పాల్గొనేందుకు లైన్ క్లియర్ అయింది.

రోహిత్ మెరుస్తాడా?

సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్​తోనే రోహిత్ శర్మ బరిలో దిగుతున్నాడు. అతడికి వైస్​ కెప్టెన్సీ ఇచ్చారు. మరి ఈ సమస్యలు, ఒత్తిడి మధ్య ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. ఇప్పటికే తలో టెస్టు గెలిచిన ఇరుజట్లు.. చివరి రెండు మ్యాచ్​ల్లో గెలిచి సిరీస్​ సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి.

టీమ్​ఇండియా క్రికెటర్లకు ఉపశమనం. ఆదివారం చేసిన కొవిడ్ పరీక్షల్లో ఫలితాలు నెగిటివ్​ వచ్చాయి. ఈ విషయాన్ని బీసీసీఐ సోమవారం వెల్లడించింది. ఆస్ట్రేలియా క్రికెటర్లకూ నెగిటివ్​గానే తేలింది. దీంతో మూడో టెస్టు నిర్వహణకు మార్గం సుగమైమనట్లే. ఈరోజే ఇరుజట్లు సిడ్నీకి వెళ్లనున్నాయి.

అసలేం జరిగింది?

భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, గిల్, పంత్, సైనీ, పృథ్వీషా.. ఇటీవల మెల్​బోర్న్​లో ఓ రెస్టారెంట్​కు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడం వల్ల సదరు క్రికెటర్లు బయో బబుల్ నిబంధనలు అతిక్రమించారంటూ పెద్ద రచ్చ జరిగింది. దీనిపై ఇరుదేశాల బోర్డులు స్పందించినప్పటికీ నెటిజన్లు మాత్రం ఊరుకోవట్లేదు.

Indian players test negative for coronavirus ahead of third test with australia
టీమ్​ఇండియా బృందం

ఇందులో భాగంగా ఆ ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్​లో ఉంచారు. అనంతరం వారికి జట్టుతో కలిపి వైద్య పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా అందరికీ కరోనా నెగిటివ్​ రావడం వల్ల టెస్టులో పాల్గొనేందుకు లైన్ క్లియర్ అయింది.

రోహిత్ మెరుస్తాడా?

సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్​తోనే రోహిత్ శర్మ బరిలో దిగుతున్నాడు. అతడికి వైస్​ కెప్టెన్సీ ఇచ్చారు. మరి ఈ సమస్యలు, ఒత్తిడి మధ్య ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. ఇప్పటికే తలో టెస్టు గెలిచిన ఇరుజట్లు.. చివరి రెండు మ్యాచ్​ల్లో గెలిచి సిరీస్​ సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి.

Last Updated : Jan 4, 2021, 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.