భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, రోమీ దంపతులకు మగబిడ్డ పుట్టాడు. శుక్రవారం.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బాబు జన్మించినట్లు వెల్లడించాడీ క్రికెటర్. ఈ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అభిమానులు, పలువురు క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ దంపతులకు అన్వి అనే పాప ఉంది.
![Indian Cricketer Wriddhiman Saha blessed with a boy on march 6th, 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6327310_saha100.jpg)
![Indian Cricketer Wriddhiman Saha blessed with a boy on march 6th, 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6327310_saha1.jpg)
గతేడాది వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో విఫలమైన కీపర్ రిషభ్ పంత్ను పక్కనపెట్టింది టీమిండియా. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్తో మ్యాచ్ల్లో బంగాల్ కీపర్ వృద్ధిమాన్ సాహాను కొనసాగించింది. ఇతడు కీపింగ్తో ఆకట్టుకోవడమే కాకుండా, అవసరమైన వేళ బ్యాట్తోనూ రాణించాడు. కోహ్లీ.. గతంలో మీడియాతో మాట్లాడుతూ.. "సుదీర్ఘ ఫార్మాట్లో సాహా ప్రపంచంలోనే అత్యుత్తమ కీపర్" అని మెచ్చుకున్నాడు.
పంత్కు ఎన్ని అవకాశాలిచ్చినా విఫలమవడం, సాహా ప్రదర్శన బాగుండటం వల్ల కివీస్తో టెస్టు సిరీస్కు బంగాల్ కీపర్నే ఎంపిక చేస్తారని అంతా భావించారు. అయితే, కెప్టెన్ కోహ్లీ అనూహ్యంగా సాహాను పక్కనపెట్టి పంత్కు మరో అవకాశమిచ్చాడు. ఈ నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని పంత్ చేతులారా వృథా చేసుకున్నాడు. తాజాగా ముగిసిన ఈ సిరీస్లోనూ పెద్దగా రాణించలేదు రిషభ్.