ETV Bharat / sports

2 రోజుల్లోనే ముగిసిన పింక్​ టెస్టు- భారత్​దే విజయం

author img

By

Published : Feb 25, 2021, 7:53 PM IST

Updated : Feb 25, 2021, 8:01 PM IST

మొతేరా వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన డే/నైట్​ టెస్టులో భారత్ విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో టీమ్​ఇండియా గెలుపొందింది. దీంతో నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో కోహ్లీ సేన 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

india won the pink test
పింక్​ టెస్టులో భారత్​ విజయభేరి

అహ్మదాబాద్​ పింక్ టెస్టులో టీమ్​ఇండియా ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్​పై జయభేరి మోగించింది. నాలుగు టెస్టుల సిరీస్​లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది కోహ్లీ సేన. స్పిన్​కు సహకరించిన పిచ్​పై పర్యటక జట్టుతో భారత స్పిన్నర్లు ఓ ఆటాడుకున్నారు.

49 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్​లో బరిలోకి దిగిన టీమ్​ఇండియా.. వికెట్లేమీ కోల్పోకుండా విజయం సాధించింది. రోహిత్ శర్మ 25, గిల్​ 15 పరుగులు సాధించారు.

ఓవర్​నైట్​ స్కోర్​ 99/3తో తొలి ఇన్నింగ్స్​ మొదలు పెట్టిన భారత్..​ మరో 46 పరుగులకే మిగతా 7 వికెట్లను కోల్పోయింది. ఇంగ్లాండ్​ బౌలర్లలో రూట్​ 5 వికెట్లతో మెరవగా.. లీచ్​ 4 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​ కంటే 33 పరుగులు ఎక్కువ చేసింది కోహ్లీ సేన.

కుప్పకూలిన రూట్​ సేన..

అనంతరం రెండో ఇన్నింగ్స్​ మొదలు పెట్టిన రూట్​ సేన.. పూర్తిగా తడబాటుకు గురైంది. కేవలం 30.4 ఓవర్ల పాటు బ్యాటింగ్​ చేసిన ఇంగ్లాండ్​ జట్టు 81 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అక్షర్​ 5, అశ్విన్​ 4 వికెట్లు తీశారు.

గులాబీ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. తొలి రోజు ఇంగ్లాండ్​ మొదటి ఇన్నింగ్స్​ ఆడగా.. భారత్​ బ్యాటింగ్​ ఆరంభించి 3 వికెట్లు కోల్పోయింది. రెండో రోజు టీమ్​ఇండియా మిగతా 7 వికెట్లు కోల్పోవడమే కాకుండా.. ఇరు జట్లవి రెండు ఇన్నింగ్స్​లు సాగడం గమనార్హం.

ఆరంభంలోనే అదిరే రికార్డులు..

పునర్నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియంలో పింక్​ టెస్టు సందర్భంగా పలు రికార్డులు నమోదయ్యాయి.

నాలుగు ఇన్నింగ్స్​ల్లో మూడు 'ఐదు'లు..

రవీంద్ర జడేజాకు గాయం వల్ల తుది జట్టులోకి వచ్చిన అక్షర్​.. అద్భుత బౌలింగ్​తో ఇంగ్లాండ్​ పతనాన్ని శాసించాడు. ఆడుతున్నది రెండో టెస్టే అయినా నాలుగు ఇన్నింగ్స్​ల్లో మొత్తం మూడు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇప్పటివరకు మొత్తంగా 18 వికెట్లు తీశాడు అక్షర్. చెన్నై టెస్టులో రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి 7 వికెట్లు తీసిన అక్షర్​.. తాజా టెస్టులో 11 వికెట్లతో మెరిశాడు.

పింక్​ టెస్టులో అక్షర్ 10 వికెట్ల ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్​లో 6 వికెట్లు తీసిన ఈ స్పిన్నర్​.. రెండో ఇన్నింగ్స్​లో 5 వికెట్లతో సత్తా చాటాడు. ​

400 క్లబ్​లో అశ్విన్​..

భారత స్పిన్నర్ రవిచంద్రన్​ అశ్విన్​ టెస్టుల్లో అద్భుతమైన రికార్డు సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో వేగంగా 400 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇందుకు అశ్విన్​ 77 టెస్టులు తీసుకోగా.. శ్రీలంగ దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్​​ 72 మ్యాచ్​ల్లో ఈ ఘనత సాధించాడు.

ధోనీని దాటిన విరాట్.. ​

స్వదేశంలో ఎక్కువ టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్​గా విరాట్​ కోహ్లీ(22) రికార్డు సృష్టించాడు. ధోనీ (21) అతని తర్వాతి స్థానంలో ఉన్నాడు.

ఇదీ చదవండి: ఐసీసీ కొవిడ్​ రూల్స్​పై ఆఫ్రిదీ అసంతృప్తి

అహ్మదాబాద్​ పింక్ టెస్టులో టీమ్​ఇండియా ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్​పై జయభేరి మోగించింది. నాలుగు టెస్టుల సిరీస్​లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది కోహ్లీ సేన. స్పిన్​కు సహకరించిన పిచ్​పై పర్యటక జట్టుతో భారత స్పిన్నర్లు ఓ ఆటాడుకున్నారు.

49 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్​లో బరిలోకి దిగిన టీమ్​ఇండియా.. వికెట్లేమీ కోల్పోకుండా విజయం సాధించింది. రోహిత్ శర్మ 25, గిల్​ 15 పరుగులు సాధించారు.

ఓవర్​నైట్​ స్కోర్​ 99/3తో తొలి ఇన్నింగ్స్​ మొదలు పెట్టిన భారత్..​ మరో 46 పరుగులకే మిగతా 7 వికెట్లను కోల్పోయింది. ఇంగ్లాండ్​ బౌలర్లలో రూట్​ 5 వికెట్లతో మెరవగా.. లీచ్​ 4 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​ కంటే 33 పరుగులు ఎక్కువ చేసింది కోహ్లీ సేన.

కుప్పకూలిన రూట్​ సేన..

అనంతరం రెండో ఇన్నింగ్స్​ మొదలు పెట్టిన రూట్​ సేన.. పూర్తిగా తడబాటుకు గురైంది. కేవలం 30.4 ఓవర్ల పాటు బ్యాటింగ్​ చేసిన ఇంగ్లాండ్​ జట్టు 81 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అక్షర్​ 5, అశ్విన్​ 4 వికెట్లు తీశారు.

గులాబీ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. తొలి రోజు ఇంగ్లాండ్​ మొదటి ఇన్నింగ్స్​ ఆడగా.. భారత్​ బ్యాటింగ్​ ఆరంభించి 3 వికెట్లు కోల్పోయింది. రెండో రోజు టీమ్​ఇండియా మిగతా 7 వికెట్లు కోల్పోవడమే కాకుండా.. ఇరు జట్లవి రెండు ఇన్నింగ్స్​లు సాగడం గమనార్హం.

ఆరంభంలోనే అదిరే రికార్డులు..

పునర్నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియంలో పింక్​ టెస్టు సందర్భంగా పలు రికార్డులు నమోదయ్యాయి.

నాలుగు ఇన్నింగ్స్​ల్లో మూడు 'ఐదు'లు..

రవీంద్ర జడేజాకు గాయం వల్ల తుది జట్టులోకి వచ్చిన అక్షర్​.. అద్భుత బౌలింగ్​తో ఇంగ్లాండ్​ పతనాన్ని శాసించాడు. ఆడుతున్నది రెండో టెస్టే అయినా నాలుగు ఇన్నింగ్స్​ల్లో మొత్తం మూడు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇప్పటివరకు మొత్తంగా 18 వికెట్లు తీశాడు అక్షర్. చెన్నై టెస్టులో రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి 7 వికెట్లు తీసిన అక్షర్​.. తాజా టెస్టులో 11 వికెట్లతో మెరిశాడు.

పింక్​ టెస్టులో అక్షర్ 10 వికెట్ల ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్​లో 6 వికెట్లు తీసిన ఈ స్పిన్నర్​.. రెండో ఇన్నింగ్స్​లో 5 వికెట్లతో సత్తా చాటాడు. ​

400 క్లబ్​లో అశ్విన్​..

భారత స్పిన్నర్ రవిచంద్రన్​ అశ్విన్​ టెస్టుల్లో అద్భుతమైన రికార్డు సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో వేగంగా 400 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇందుకు అశ్విన్​ 77 టెస్టులు తీసుకోగా.. శ్రీలంగ దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్​​ 72 మ్యాచ్​ల్లో ఈ ఘనత సాధించాడు.

ధోనీని దాటిన విరాట్.. ​

స్వదేశంలో ఎక్కువ టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్​గా విరాట్​ కోహ్లీ(22) రికార్డు సృష్టించాడు. ధోనీ (21) అతని తర్వాతి స్థానంలో ఉన్నాడు.

ఇదీ చదవండి: ఐసీసీ కొవిడ్​ రూల్స్​పై ఆఫ్రిదీ అసంతృప్తి

Last Updated : Feb 25, 2021, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.