న్యూజిలాండ్తో జరుగుతున్న చివరి టీ20లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే 4-0తో సిరీస్లో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఇందులోనూ గెలిచి ప్రత్యర్థిని వైట్వాష్ చేయాలని చూస్తోంది. అదే సమయంలో.. గెలిచి, పరువు నిలుపుకోవాలని కివీస్ చూస్తోంది.
![bay oval movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5929376_match-2.jpg)
న్యూజిలాండ్ గడ్డపై భారత్ ఇప్పటివరకు టీ20 సిరీస్ గెలవలేదు. 2009లో ధోనీ సారథ్యంలోని జట్టు 0-2తో ఓటమి పాలైంది. గతేడాది మూడు మ్యాచ్ల సిరీస్ 1-2తో చేజారింది. అయితే తాజా సిరీస్లో నాలుగు విజయాలు సాధించిన కోహ్లీ సేన.. ఇప్పటికే కివీస్ గడ్డపై ట్రోఫీ ఖాయం చేసుకుంది. అయితే ఐదు మ్యాచ్లు గెలిస్తే.. 'మెన్ ఇన్ బ్లూ' టీ20 ర్యాంకింగ్స్లో మరింత ముందుకెళ్తుంది. ఎప్పటినుంచో ఐదో స్థానానికే పరిమితమైన భారత్.. మెరుగైన ప్రదర్శన చేస్తే ఒక ర్యాంకు మెరుగుపడి నాలుగోస్థానానికి ఎగబాకొచ్చు.
జట్లు
భారత్
రోహిత్శర్మ ( కెప్టెన్), సంజు శాంసన్, కేఎల్ రాహుల్ (కీపర్), శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, చాహల్, బుమ్రా, సైని, శార్దూల్
న్యూజిలాండ్
టామ్ బ్రూస్, మార్టిన్ గప్తిల్, కొలిన్ మన్రో, రాస్ టేలర్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెట్, ఇష్ సోదీ, టిమ్ సౌతీ(కెప్టెన్), స్కాట్ కగ్గిలిన్, డారెల్ మిచెల్