టీమిండియాతో వన్డే సిరీస్ను న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసింది. 3-0 తేడాతో సొంతం చేసుకుంది. ఈరోజు జరిగిన మూడో మ్యాచ్లోనూ టీమిండియా నిర్దేశించిన 297 పరుగుల లక్ష్యాన్ని 47.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేఎల్ రాహుల్ సెంచరీ చేసినా, ఫలితం లేకుండా పోయింది.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. పృథ్వీ షా 40, మాయంక్ అగర్వాల్ 1, కోహ్లీ 9, శ్రేయస్ అయ్యర్ 62, లోకేశ్ రాహుల్ 112, మనీశ్ పాండే 42, జడేజా 8, శార్దుల్ ఠాకుర్ 7, సైనీ 8 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో బెన్నెట్ 4 వికెట్లు తీయగా, జెమీసన్, నీషమ్ తలో వికెట్ పడగొట్టారు.

ఛేదనలో కివీస్ బ్యాట్స్మన్ మరోసారి అద్భుతంగా రాణించారు. భారత బౌలర్లను సమర్థమంతంగా ఎదుర్కొని స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓపెనర్లు గప్తిల్ (66), నికోలస్ (80).. తొలి వికెట్కు 106 పరుగులు చేసి, విజయానికి బలమైన పునాది వేశారు.
మిగతా బ్యాట్స్మెన్లో విలియమన్స్ 22, టేలర్ 12, లాథమ్ 32, నీషమ్ 19, గ్రాండ్హామ్ 58 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని తెచ్చిపెట్టారు. భారత బౌలర్లలో చాహల్ 3 వికెట్లు, శార్దుల్, జడేజా తలో వికెట్ పడగొట్టారు.
