ETV Bharat / sports

చివరి టీ20: నిర్ణయాత్మక​ పోరులో గెలుపెవరిదో?

author img

By

Published : Mar 20, 2021, 5:30 AM IST

భారత్​-ఇంగ్లాండ్​ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిర్ణయాత్మక పోరు శనివారం జరగనుంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో చెరో రెండు గెలిచి 2-2తో సమంగా ఉన్నాయి ఇరు జట్లు. చివరి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్​ను చేజిక్కించుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న పొట్టి క్రికెట్ ప్రపంచకప్​కు తుది జట్టు ఎంపికే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి.

india vs england t20 final match preview
నిర్ణయాత్మక సిరీస్​ పోరులో గెలుపెవరిదో?

ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో నాలుగు మ్యాచ్​లు ముగిశాయి. ఇప్పటికే 2-2తో సిరీస్​ సమం చేసిన ఇరుజట్లు.. సిరీస్​ విజయం కోసం నిర్ణయాత్మక పోరులో తలపడనున్నాయి. టాస్​ ఓడినప్పటికీ నాలుగో టీ20లో గెలిచి టీమ్​ఇండియా ఊపుమీద కనిపిస్తుండగా.. టెస్టు సిరీస్​ ఓటమికి బదులు తీర్చుకోవాలని ఇంగ్లాండ్​ భావిస్తోంది.

ఈ ఏడాది అక్టోబర్‌లో సొంతగడ్డపై జరిగే టీ20 ప్రపంచకప్‌నకు జట్టును సిద్ధం చేసుకొనే లక్ష్యంతోనే ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా ఆడుతోంది. కొత్తవాళ్లతో ప్రయోగాలు చేపట్టింది. కీలక బృందాన్ని పరీక్షించింది. జట్టు కూర్పు, మేళవింపు, సమతూకం ఎలా ఉందో పరిశీలించింది. కుర్రాళ్ల కోసం స్వయంగా తన స్థానాన్ని త్యాగం చేసిన కోహ్లీ.. ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ను మూడో స్థానంలో దించి మెరుగైన ఫలితం రాబట్టాడు. ఇదే పంథాతో చివరి మ్యాచ్‌లోనూ కోహ్లీ సేన బరిలోకి దిగనుంది.

ఆ ఇద్దరి ఆటపై సంతృప్తి..

ఈ సిరీస్‌ ద్వారానే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌ బ్యాటింగ్‌ పట్ల జట్టు సంతోషంగా ఉంది. ఏమాత్రం భయం లేకుండా ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడుతూ వీరిద్దరు జట్టుకు ఎక్స్‌ఫ్యాక్టర్‌లా మారారు. ప్రత్యర్థి ఎంతటి బౌలరైన బంతిని బౌండరీకి పంపడమే లక్ష్యంగా ఆడుతున్నారు. నాలుగో ట్వంటీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్‌ తన సామర్థ్యాన్ని చాటిచెప్పాడు. తద్వారా ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. తొలిమ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి రాణించడం సులభం కాదని.. సూర్య బ్యాటింగ్‌ చూసి ఆశ్చర్యపోయినట్లు కోహ్లీ వ్యాఖ్యానించాడు.

గాయంతో కొన్ని రోజులుగా పూర్తిస్థాయి బౌలింగ్ చేయని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఈ సిరీస్‌లోని మ్యాచుల్లో తన కోటా ఓవర్లు పూర్తి చేస్తుండటం సానుకూలాంశం. నాలుగో మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసి 4 ఓవరల్లో 16 పరుగులే ఇచ్చిన పాండ్యా.. రెండు వికెట్లు పడగొట్టాడు. యుజ్వేంద్ర చాహల్ స్థానంలో జట్టులోకి వచ్చిన స్పిన్నర్ రాహుల్ చాహర్ ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్లు రోహిత్, రాహుల్ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది.

ప్రతీకారం కోసం ఇంగ్లాండ్..

నాలుగో టీ20లో ఓడిన ఇంగ్లాండ్ చివరి మ్యాచ్‌లో గెలిచి టెస్టు సిరీస్ పరాభవానికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది. టీ20 నంబర్ వన్ ర్యాంక్ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్ మలన్‌, జేసన్ రాయ్‌, మోర్గాన్‌ నుంచి ఇంగ్లాండ్ భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది. బౌలింగ్‌ విభాగంలో జోఫ్రా ఆర్చర్, మార్క్‌ వుడ్ రాణిస్తున్నా.. మరో పేసర్ జోర్దాన్ ఆశించిన మేర సత్తా చాటడం లేదు.

మరో ఏడు నెలల్లో ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌ ద్వారా తమ బలహీనతలను తెలుసుకొని వాటిని అధిగమించాలని భావిస్తున్నట్లు ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ చెప్పాడు. క్లిష్ట పరిస్థితులను అధిగమించి గెలవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు రాణించడం వల్ల టీమ్​ఇండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి టీ20 సిరీస్‌ను చేజిక్కించుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. నరేంద్ర మోదీ మైదానంలో శనివారం రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి: దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి హర్మన్​ప్రీత్​ దూరం

ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో నాలుగు మ్యాచ్​లు ముగిశాయి. ఇప్పటికే 2-2తో సిరీస్​ సమం చేసిన ఇరుజట్లు.. సిరీస్​ విజయం కోసం నిర్ణయాత్మక పోరులో తలపడనున్నాయి. టాస్​ ఓడినప్పటికీ నాలుగో టీ20లో గెలిచి టీమ్​ఇండియా ఊపుమీద కనిపిస్తుండగా.. టెస్టు సిరీస్​ ఓటమికి బదులు తీర్చుకోవాలని ఇంగ్లాండ్​ భావిస్తోంది.

ఈ ఏడాది అక్టోబర్‌లో సొంతగడ్డపై జరిగే టీ20 ప్రపంచకప్‌నకు జట్టును సిద్ధం చేసుకొనే లక్ష్యంతోనే ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా ఆడుతోంది. కొత్తవాళ్లతో ప్రయోగాలు చేపట్టింది. కీలక బృందాన్ని పరీక్షించింది. జట్టు కూర్పు, మేళవింపు, సమతూకం ఎలా ఉందో పరిశీలించింది. కుర్రాళ్ల కోసం స్వయంగా తన స్థానాన్ని త్యాగం చేసిన కోహ్లీ.. ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ను మూడో స్థానంలో దించి మెరుగైన ఫలితం రాబట్టాడు. ఇదే పంథాతో చివరి మ్యాచ్‌లోనూ కోహ్లీ సేన బరిలోకి దిగనుంది.

ఆ ఇద్దరి ఆటపై సంతృప్తి..

ఈ సిరీస్‌ ద్వారానే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌ బ్యాటింగ్‌ పట్ల జట్టు సంతోషంగా ఉంది. ఏమాత్రం భయం లేకుండా ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడుతూ వీరిద్దరు జట్టుకు ఎక్స్‌ఫ్యాక్టర్‌లా మారారు. ప్రత్యర్థి ఎంతటి బౌలరైన బంతిని బౌండరీకి పంపడమే లక్ష్యంగా ఆడుతున్నారు. నాలుగో ట్వంటీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్‌ తన సామర్థ్యాన్ని చాటిచెప్పాడు. తద్వారా ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. తొలిమ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి రాణించడం సులభం కాదని.. సూర్య బ్యాటింగ్‌ చూసి ఆశ్చర్యపోయినట్లు కోహ్లీ వ్యాఖ్యానించాడు.

గాయంతో కొన్ని రోజులుగా పూర్తిస్థాయి బౌలింగ్ చేయని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఈ సిరీస్‌లోని మ్యాచుల్లో తన కోటా ఓవర్లు పూర్తి చేస్తుండటం సానుకూలాంశం. నాలుగో మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసి 4 ఓవరల్లో 16 పరుగులే ఇచ్చిన పాండ్యా.. రెండు వికెట్లు పడగొట్టాడు. యుజ్వేంద్ర చాహల్ స్థానంలో జట్టులోకి వచ్చిన స్పిన్నర్ రాహుల్ చాహర్ ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్లు రోహిత్, రాహుల్ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది.

ప్రతీకారం కోసం ఇంగ్లాండ్..

నాలుగో టీ20లో ఓడిన ఇంగ్లాండ్ చివరి మ్యాచ్‌లో గెలిచి టెస్టు సిరీస్ పరాభవానికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది. టీ20 నంబర్ వన్ ర్యాంక్ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్ మలన్‌, జేసన్ రాయ్‌, మోర్గాన్‌ నుంచి ఇంగ్లాండ్ భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది. బౌలింగ్‌ విభాగంలో జోఫ్రా ఆర్చర్, మార్క్‌ వుడ్ రాణిస్తున్నా.. మరో పేసర్ జోర్దాన్ ఆశించిన మేర సత్తా చాటడం లేదు.

మరో ఏడు నెలల్లో ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌ ద్వారా తమ బలహీనతలను తెలుసుకొని వాటిని అధిగమించాలని భావిస్తున్నట్లు ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ చెప్పాడు. క్లిష్ట పరిస్థితులను అధిగమించి గెలవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు రాణించడం వల్ల టీమ్​ఇండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి టీ20 సిరీస్‌ను చేజిక్కించుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. నరేంద్ర మోదీ మైదానంలో శనివారం రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి: దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి హర్మన్​ప్రీత్​ దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.