భారత్ - బంగ్లాదేశ్ జట్లు తొలిసారి డే/నైట్ టెస్టు మ్యాచ్ ఆడనున్నాయి. శుక్రవారం(నవంబర్ 22)న ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం సహా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గులాబి రంగుతో కళకళలాడనున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. 'పింకూ-టింకూ' పేరుతో తాజాగా అధికారిక మస్కట్లనూ విడుదల చేశాడు. మ్యాచ్ టికెట్టు సహా మస్కట్లను ఈడెన్ మైదానంలో ప్రదర్శించాడు దాదా.
![india vs bangladesh 2019: Kolkata turns pink as countdown for first day-night Test begins](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5096404_match22222222.jpg)
గులాబిమయం...
ఈడెన్ మైదానంలో పెద్ద గులాబి బెలూన్ను ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు. ఇది ఐదురోజులు కనువిందు చేయనుంది. షాహిద్ మినార్, ఎత్తైన భవంతులు, పార్కులను గులాబి రంగు విద్యుత్తు కాంతులతో అలంకరిస్తోంది అక్కడి ప్రభుత్వం. హూగ్లీ నదిపైన ఓ పడవను గులాబి రంగులో ఏర్పాటు చేయనుంది. ఎల్ఈడీ బోర్డులు, బస్సుల్లోనూ మ్యాచ్కు ప్రచారం కల్పించనున్నారు. ఫలితంగా టెస్టులపై మరింత ఆసక్తి ఏర్పడుతుందని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే తొలి మూడు రోజులకు పూర్తిగా టికెట్లు అమ్ముడైనట్లు దాదా వెల్లడించాడు.
-
Time to gear up for the Pink! #TeamIndia begin prep under lights in Indore for the Kolkata Test #INDvBAN pic.twitter.com/MVzkaVjdmL
— BCCI (@BCCI) November 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Time to gear up for the Pink! #TeamIndia begin prep under lights in Indore for the Kolkata Test #INDvBAN pic.twitter.com/MVzkaVjdmL
— BCCI (@BCCI) November 17, 2019Time to gear up for the Pink! #TeamIndia begin prep under lights in Indore for the Kolkata Test #INDvBAN pic.twitter.com/MVzkaVjdmL
— BCCI (@BCCI) November 17, 2019