ETV Bharat / sports

అమ్మాయిల ప్రపంచకప్​: నేడే భారత్​X ఆస్ట్రేలియా పోరు

author img

By

Published : Feb 21, 2020, 5:45 AM IST

Updated : Mar 2, 2020, 12:50 AM IST

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్​ అభిమానులను అలరించేందుకు రంగం సిద్ధమైంది. ప్రేక్షకులకు ఉత్కంఠ, వినోదం అందించేందుకు మహిళల టీ20 ప్రపంచకప్ నేటి నుంచే మొదలుకానుంది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ మెగాటోర్నీ 17 రోజులు కొనసాగనుంది. ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్​లో ఆతిథ్య ఆసీస్​ జట్టుతో తలపడనుంది భారత జట్టు.

India start mega journey in women t20 world cup set to play against australia in 2020
ఆరంభ మ్యాచ్​లో భారత్​X టీమిండియా 'ఢీ'

అసలే టీ20 క్రికెట్‌.. ఆపై ప్రపంచకప్‌! ఈ తరం క్రికెట్‌ అభిమానుల ఉత్సాహానికి కొదవేముంటుంది? అయితే పురుషుల క్రికెట్లో పొట్టి ప్రపంచకప్​ సంబరాల కోసం ఇంకా ఎనిమిది నెలలు ఎదురు చూడాలి. కానీ అంతకంటే ముందే ధనాధన్‌ ఇన్నింగ్స్​లు అందించడానికి అమ్మాయిలు సిద్ధమయ్యారు. ఆస్ట్రేలియా వేదికగా నేటి నుంచే ఈ క్రికెట్​ పండుగ ప్రారంభం కానుంది.

ఈరోజు ఆరంభ మ్యాచ్​లో టీమిండియా-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. తొలి వరల్డ్​కప్ అందుకోవాలని భారత్... మరోకప్పు ఖాతాలో వేసుకోవాలని ఆస్ట్రేలియా ఆరాటపడుతున్నాయి. 17 రోజులపాటు జరిగే ఈ మెగా టోర్నీలో 10 జట్లు పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా పలు విశేషాలివే...

ICC Women’s T20 World Cup
ప్రపంచకప్​తో మహిళా సారథులు
  • పురుషుల తొలి టీ20 ప్రపంచకప్‌ (2007) జరిగిన రెండేళ్లకు.. మహిళల టీ20 వరల్డ్​కప్​ను ఆరంభించింది ఐసీసీ. 2009లో జరిగిన తొలి టోర్నీలో ఇంగ్లాండ్‌ విజేతగా నిలిచింది.
  • ఈ ఏడాది చివర్లో పురుషుల టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనున్న ఆస్ట్రేలియానే.. మహిళల టోర్నీనీ నిర్వహిస్తోంది. పది జట్లు పోటీ పడే ఈ టోర్నీ.. ఫిబ్రవరి 21న మొదలై మార్చి 8న ముగుస్తుంది. మెగా ఈవెంట్​లో మొత్తం 23 మ్యాచ్‌లు జరుగుతాయి.
  • ఆస్ట్రేలియా ఆతిథ్య జట్టు మాత్రమే కాదు.. అత్యంత విజయవంతమైన జట్టు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కావడం, మంచి ఫామ్‌లో ఉండటం.. తాజాగా భారత్‌, ఇంగ్లాండ్‌లతో జరిగిన ముక్కోణపు సిరీస్‌లోనూ విజేతగా నిలవడం వల్ల టైటిల్‌కు హాట్‌ ఫేవరెట్‌గా కంగారూ జట్టును భావిస్తున్నారు.
  • ఫిబ్రవరి 21న ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో భారత్‌.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. ఆరంభ మ్యాచ్‌కు సిడ్నీ ఆతిథ్యమివ్వనుండగా.. మార్చి 8న మెల్‌బోర్న్‌లో ఫైనల్‌ మ్యాచ్​ జరుగుతుంది.
  • రెండేళ్ల క్రితం కప్పు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులోని 15 మందిలో... 13 మంది ప్రస్తుత టోర్నీలోనూ బరిలోకి దిగుతున్నారు.

ఫార్మాట్‌ ఇలా..

టోర్నీలో పోటీ పడుతున్న పది జట్లలో అయిదేసి జట్లను ఎ, బి గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ దశ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో సాగుతుంది. గ్రూప్‌లో ప్రతి జట్టూ మిగతా నాలుగు జట్లలో ఒక్కో లీగ్‌ మ్యాచ్‌ ఆడుతుంది. లీగ్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

తొలిసారి మిథాలీ లేకుండా..

టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి భారత జట్టు దిగ్గజ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ లేకుండా బరిలోకి దిగుతోంది. 2009లో తొలి ప్రపంచకప్‌ నుంచి వరుసగా ఆరు టోర్నీల్లోనూ ఆమె బరిలోకి దిగింది. అయితే గత కప్పులో సెమీఫైనల్‌కు మిథాలీని తుది జట్టులోకి తీసుకోకపోవడం దుమారం రేపింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో మిథాలీ ఉంటే భారత్‌ గెలిచేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గత ఏడాది ఆమె టీ20లకు గుడ్‌బై చెప్పింది. గత టోర్నీలో సారథిగా వ్యవహరించిన హర్మన్‌ప్రీతే ఈసారి కూడా జట్టును నడిపించనుంది.

ICC Women’s T20 World Cup
హర్మన్​ప్రీత్​ సారథ్యంలోని మహిళా టీమిండియా

>> ఈసారి టోర్నీలో ఆడనున్న థాయిలాండ్‌కు ఇదే తొలి టీ20 ప్రపంచకప్‌.

>> ఇప్పటిదాకా ఆరు మహిళల టీ20 ప్రపంచకప్‌ టోర్నిల్లో ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తూ నాలుగు టైటిళ్లు (2010, 2012, 2014, 2018) సాధించింది. ఇంగ్లాండ్‌ (2009), వెస్టిండీస్‌ (2016) ఒక్కోసారి విజేతగా నిలిచాయి.

>> ఈ సారి మహిళల టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 150 మంది అమ్మాయిలు ఆడనుండగా.. అందులో వివిధ జట్లలోని 14 మంది 2009లో తొలి టోర్నీ నుంచి ఆడుతూ.. ఏడో కప్పులో బరిలోకి దిగుతుండటం విశేషం.

>> టీ20 ప్రపంచకప్‌లో అత్యధికంగా 32 మ్యాచ్‌లు ఆడిన ఘనత ఆస్ట్రేలియాదే. ఈ 32 మ్యాచ్‌ల్లోనూ ఆల్‌రౌండర్‌ ఎలీస్‌ పెర్రీ బరిలోకి దిగడం విశేషం.

టీ20 ప్రపంచకప్‌:

  • ఆరంభం: ఫిబ్రవరి 21
  • ఫైనల్‌: మార్చి 8
  • మొత్తం జట్లు: 10

గ్రూప్‌-ఎ: భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌

గ్రూప్‌-బి: ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, థాయ్‌లాండ్‌

2009, 2010, 2018 టోర్నీల్లో సెమీస్‌ చేరిన భారత్‌.. ఆ దశలోనే నిష్క్రమించింది.

అసలే టీ20 క్రికెట్‌.. ఆపై ప్రపంచకప్‌! ఈ తరం క్రికెట్‌ అభిమానుల ఉత్సాహానికి కొదవేముంటుంది? అయితే పురుషుల క్రికెట్లో పొట్టి ప్రపంచకప్​ సంబరాల కోసం ఇంకా ఎనిమిది నెలలు ఎదురు చూడాలి. కానీ అంతకంటే ముందే ధనాధన్‌ ఇన్నింగ్స్​లు అందించడానికి అమ్మాయిలు సిద్ధమయ్యారు. ఆస్ట్రేలియా వేదికగా నేటి నుంచే ఈ క్రికెట్​ పండుగ ప్రారంభం కానుంది.

ఈరోజు ఆరంభ మ్యాచ్​లో టీమిండియా-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. తొలి వరల్డ్​కప్ అందుకోవాలని భారత్... మరోకప్పు ఖాతాలో వేసుకోవాలని ఆస్ట్రేలియా ఆరాటపడుతున్నాయి. 17 రోజులపాటు జరిగే ఈ మెగా టోర్నీలో 10 జట్లు పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా పలు విశేషాలివే...

ICC Women’s T20 World Cup
ప్రపంచకప్​తో మహిళా సారథులు
  • పురుషుల తొలి టీ20 ప్రపంచకప్‌ (2007) జరిగిన రెండేళ్లకు.. మహిళల టీ20 వరల్డ్​కప్​ను ఆరంభించింది ఐసీసీ. 2009లో జరిగిన తొలి టోర్నీలో ఇంగ్లాండ్‌ విజేతగా నిలిచింది.
  • ఈ ఏడాది చివర్లో పురుషుల టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనున్న ఆస్ట్రేలియానే.. మహిళల టోర్నీనీ నిర్వహిస్తోంది. పది జట్లు పోటీ పడే ఈ టోర్నీ.. ఫిబ్రవరి 21న మొదలై మార్చి 8న ముగుస్తుంది. మెగా ఈవెంట్​లో మొత్తం 23 మ్యాచ్‌లు జరుగుతాయి.
  • ఆస్ట్రేలియా ఆతిథ్య జట్టు మాత్రమే కాదు.. అత్యంత విజయవంతమైన జట్టు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కావడం, మంచి ఫామ్‌లో ఉండటం.. తాజాగా భారత్‌, ఇంగ్లాండ్‌లతో జరిగిన ముక్కోణపు సిరీస్‌లోనూ విజేతగా నిలవడం వల్ల టైటిల్‌కు హాట్‌ ఫేవరెట్‌గా కంగారూ జట్టును భావిస్తున్నారు.
  • ఫిబ్రవరి 21న ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో భారత్‌.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. ఆరంభ మ్యాచ్‌కు సిడ్నీ ఆతిథ్యమివ్వనుండగా.. మార్చి 8న మెల్‌బోర్న్‌లో ఫైనల్‌ మ్యాచ్​ జరుగుతుంది.
  • రెండేళ్ల క్రితం కప్పు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులోని 15 మందిలో... 13 మంది ప్రస్తుత టోర్నీలోనూ బరిలోకి దిగుతున్నారు.

ఫార్మాట్‌ ఇలా..

టోర్నీలో పోటీ పడుతున్న పది జట్లలో అయిదేసి జట్లను ఎ, బి గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ దశ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో సాగుతుంది. గ్రూప్‌లో ప్రతి జట్టూ మిగతా నాలుగు జట్లలో ఒక్కో లీగ్‌ మ్యాచ్‌ ఆడుతుంది. లీగ్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

తొలిసారి మిథాలీ లేకుండా..

టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి భారత జట్టు దిగ్గజ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ లేకుండా బరిలోకి దిగుతోంది. 2009లో తొలి ప్రపంచకప్‌ నుంచి వరుసగా ఆరు టోర్నీల్లోనూ ఆమె బరిలోకి దిగింది. అయితే గత కప్పులో సెమీఫైనల్‌కు మిథాలీని తుది జట్టులోకి తీసుకోకపోవడం దుమారం రేపింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో మిథాలీ ఉంటే భారత్‌ గెలిచేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గత ఏడాది ఆమె టీ20లకు గుడ్‌బై చెప్పింది. గత టోర్నీలో సారథిగా వ్యవహరించిన హర్మన్‌ప్రీతే ఈసారి కూడా జట్టును నడిపించనుంది.

ICC Women’s T20 World Cup
హర్మన్​ప్రీత్​ సారథ్యంలోని మహిళా టీమిండియా

>> ఈసారి టోర్నీలో ఆడనున్న థాయిలాండ్‌కు ఇదే తొలి టీ20 ప్రపంచకప్‌.

>> ఇప్పటిదాకా ఆరు మహిళల టీ20 ప్రపంచకప్‌ టోర్నిల్లో ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తూ నాలుగు టైటిళ్లు (2010, 2012, 2014, 2018) సాధించింది. ఇంగ్లాండ్‌ (2009), వెస్టిండీస్‌ (2016) ఒక్కోసారి విజేతగా నిలిచాయి.

>> ఈ సారి మహిళల టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 150 మంది అమ్మాయిలు ఆడనుండగా.. అందులో వివిధ జట్లలోని 14 మంది 2009లో తొలి టోర్నీ నుంచి ఆడుతూ.. ఏడో కప్పులో బరిలోకి దిగుతుండటం విశేషం.

>> టీ20 ప్రపంచకప్‌లో అత్యధికంగా 32 మ్యాచ్‌లు ఆడిన ఘనత ఆస్ట్రేలియాదే. ఈ 32 మ్యాచ్‌ల్లోనూ ఆల్‌రౌండర్‌ ఎలీస్‌ పెర్రీ బరిలోకి దిగడం విశేషం.

టీ20 ప్రపంచకప్‌:

  • ఆరంభం: ఫిబ్రవరి 21
  • ఫైనల్‌: మార్చి 8
  • మొత్తం జట్లు: 10

గ్రూప్‌-ఎ: భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌

గ్రూప్‌-బి: ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, థాయ్‌లాండ్‌

2009, 2010, 2018 టోర్నీల్లో సెమీస్‌ చేరిన భారత్‌.. ఆ దశలోనే నిష్క్రమించింది.

Last Updated : Mar 2, 2020, 12:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.